DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీహెచ్ పివి వెంకన్న ఆలయం లో వైభవంగా క్షీరాబ్ది ద్వాదశి అర్చనలు

విశాఖపట్నం, నవంబర్ 20, 2018 (డిఎన్ఎస్ DNS Online ) : శ్రీవైష్ణవ సంప్రదాయం లో అత్యంత ప్రాధాన్యత చోటుచేసుకున్న పర్వదినోత్సవాల్లో క్షీరాబ్ది ఏకాదశి, తదుపరి రోజు ద్వాదశి ఎంతో

వైశిష్ట్యమైనవి. ఈ పర్వదినోత్సవాలను పురస్కరించుకుని విశాఖనగరం లోని బీహెచ్ పివి ప్రాంతంలోని మింది గ్రామం లో వేంచేసిన శ్రీ ప్రసన్నవెంకటేశ్వర స్వామి ఆలయం లో

మంగళవారం విశేష సేవలు వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి జగన్నాధాచార్యులు క్షీరాబ్ది ఏకాదశి, - ద్వాదశి విశిష్టతలను వివరించారు. ఆలయంలో  à°µà°¿à°¶à±‡à°·à°‚à°—à°¾

వైరు ముడి అలంకారం స్వామిని అలంకరించారు. ఈ విధమైన అలంకారం కర్ణాటక రాష్ట్రం లోని మేల్కొటై దివ్యక్షేత్రం లో వేంచేసిన తిరునారాయణ స్వామికి మాత్రమే జరిగే ఈ

వైరుముడి సేవను విశాఖ నగరంలోని శ్రీ వేంకటేశ్వరునికి నిర్వహించడం పట్ల భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోమవారం క్షీరాబ్ది ఏకాదశి అర్చనలు అనంతరం,

మంగళవారం నాడు ప్రాత కాలం నుంచే సుప్రభాత, అర్చన, సహస్రనామార్చనలు నిర్వహించారు. à°ˆ సేవలో ఆలయ అర్చకులు గుంటూరు సీతారాం, వెంకటాచార్యులు, వెంకు స్వామి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à±

పాల్గొన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం నిర్వహణ అత్యంత దుర్భరంగా ఉండడం గమనార్హం. ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, స్వామికి అన్ని

పర్వదినోత్సవాలనూ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అర్చకులు తాపత్రయ పడుతుండగా, ఆలయం లో జరుగవలసిన పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు నిధులు లేవంటూ ఆలయ ఈఓ కె .

పద్మావతి చేతులెత్తేయడం విశేషం. అయితే కేవలం హుండీ తెరిచి నిధులు తీసుకునేందుకు మాత్రమే ఈఓ పద్మావతి à°ˆ ఆలయానికి వస్తున్నట్టు సమాచారం. 
ఈ ఆలయ కమిటీల్లో

అనర్హులను నియమించేందుకు ముందుకు వచ్చే స్థానిక ఎమ్మెల్యే ( గాజువాక ) పల్లా శ్రీనివాసరావు à°†à°²à°¯ అభివృద్ధి à°•à°¿ ససేమిరా అనడం కొసమెరుపు. 

#dnsnews  #dnsmedia  #dnslive  #dns news  #dns media  #dns live  #dns  #vizag 

#visakhapatnam  #bhpv temple  #kshirabdi dwadashi #venkateswara swamy temple

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 25, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam