DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాహిత్య పఠనం తో సమాజాన్ని తెలుసుకోవచ్చు : పాత్రికేయులు  ఏ. కృష్ణారావు 

విశాఖపట్నం, జనవరి 18, 2019 (DNS Online): పత్రికారంగం లోను, సమాజంతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించేవారికి  à°¸à°¾à°¹à°¿à°¤à±à°¯ పఠనం తప్పని సరిగా అభ్యసించాలని సీనియర్ పాత్రికేయులు ఏ.

కృష్ణారావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లోని ప్లాటినం జూబిలీ అతిధి గృహం లో జరిగిన సీనియర్ పాత్రికేయులు ఎన్ ఆర్  à°šà°‚దూర్  à°§à°°à±à°® నిధి సందేశ

ప్రసంగం  à°²à±‹ తొలి ప్రసంగాన్నిఅయన అందించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రస్తుత తరం లో అత్యధిక శాతం పాత్రికేయులకు సాహిత్యాన్ని చదివే అలవాటు ఉన్నట్టు

కనపడడం లేదన్నారు. పుస్తక పఠనం ద్వారానే సమాజ దృక్పధాన్ని తెలుసుకోగలుగుతారన్నారు. పూర్వతరం పాత్రికేయులను ఉద్యోగాల్లోకి తీసుకునే సమయంలో మొదటి ప్రశ్న మీకు

నచ్చిన కవి , రచయిత ఎవరు ? ఏ ఏ పుస్తకాలు చదివారు అని, వాటిల్లో మీకు నచ్చిన అంశం వివరించామని అడిగేవారన్నారు. తద్వారా పత్రికారంగం లో సాహిత్యానికి నాటి తరం ఎంత

ప్రాధాన్యత ఇచ్చిందో తెలుస్తోందన్నారు. కాలానుగుణంగా నేడు పత్రికారంగం దాదాపుగా విలువలు కోల్పోతోందన్నారు. అయితే సంప్రదాయబద్దంగా నేటికీ విలువలను

పాటించేవారు అతి తక్కువ మందే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు మాట్లాడుతూ రాజ్యసభ

పూర్వ సభ్యులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, ఇదే విద్యాలయం పూర్వ విద్యార్థి, అధ్యాపకులు కావడంతో విద్యాలయం తో అనుబంధం కారణంగా సుమారు పది వరకూ ధర్మనిధి సందేశం

ప్రసంగం కార్యక్రమాల నిర్వహణకు సొంత నిధులు సమకూర్చారన్నారు. ఒక్కో ధర్మ నిధి సందేశం కార్యక్రమానికి ఆరు లక్షల రూపాయలను అందించవలసి యుందని, ఆ నిధి పై వచ్చే

వడ్డీతో ఆయా విభాగాల్లో ప్రముఖులచే ప్రసంగాలను నిర్వహిస్తుమన్నారు. మొత్తం 25 వరకూ ధర్మ నిధి ప్రసంగాలు అందించాలని సంకల్పించామన్నారు. ఈ కార్యక్రమం లో ఎయు

రెక్టార్ డాక్టర్ à°Žà°‚. ప్రసాద్ రావు, రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్.  à°Žà°¯à± జర్నలిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ à°¡à°¿ వి ఆర్ మూర్తి, డాక్టర్

బాబివర్ధన్, డాక్టర్ చల్ల రామకృష్ణ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #yarlagadda  #NR Chandur  #Endowment lecture;

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam