DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ లో 19 న లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార సభ 

విశాఖపట్నం, జనవరి 18, 2019 (DNS Online): ప్రముఖ రచయిత కవి, జాతీయ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత " అంపశయ్య" నవీన్ కు లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కారం అందించనున్నట్టు

రాజ్యసభ మాజీ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్. తెలిపారు. శుక్రవారం సంస్థ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర జ్ఞాన

పీఠ్ పురస్కారంగా పేరు పొందిన లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కార సభను విశాఖపట్నం లోని మద్దిలపాలెం లో గల కళాభారతి కళావేదికపై ఈ నెల 19 (శనివారం)నాడు

నిర్వహిస్తున్నామన్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే à°ˆ సభలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అధ్యక్షత వహిస్తారని, à°®à±à°–్య

అతిధిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి  à°œà°¸à±à°Ÿà°¿à°¸à± శరద్ అరవింద్ బాబ్డ్ పాల్గొంటారని, ఆత్మీయ అతిధిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు,

పాల్గొంటారని వివరించారు. 
ఈ ఏడాది లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని అంపశయ్య నవీన్ కు అందించడం జరుగుతుందని, సమాజ సేవలో తరిస్తున్న సౌహార్ద్ర హృదయులకు

ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని ఈ ఏడాది వీటిని బాల వికాసానికి చేసిన కృషికి గాను గుంటూరు కు చెందిన ఎన్. మంగాదేవి కి, దివ్యంగుల, కళా సాహిత్య

సాంస్కృతిక రంగాలలో కృషి చేస్తున్న హైదరాబాద్ కు చెందిన వంశీ రామరాజు లకు చెరో 50 వేల రూపాయల నగదు పురస్కారం అందించనున్నామని తెలిపారు. 
, గతంలో అందుకున్న

అవార్డు గ్రహీతలు: మాలతీ చందూర్ దంపతులు ( 2005 ), బోయి భీమన్న( 2006 ), వాసిరెడ్డి సీతాదేవి ( 2007 ), కాళీపట్నం రామారావు ( 200 ), రావూరి భరద్వాజ ( 2009 ), ఆవంత్స సోమసుందర్ ( 2010 ), డాక్టర్ సివి సుబ్బన్న

శతావధాని ( 2011 ), డాక్టర్ జానమద్ది హనుమచ్చాస్త్రి ( 2012 ), వంగూరి చిట్టెం రాజు ( 2013 ), ఓల్గా à°—à°¾ ప్రసిద్ధి కెక్కిన పోపూరి లలితా కుమారి  (2014 ), గొల్లపూడి మారుతీరావు ( 2015 ), గరికపాటి

నరసింహారావు ( 2016 ), గోరటి వెంకన్న ( 2017 ), మీగడ రామలింగ స్వామి ( 2018 ) లకు అందించడం జరిగింది. 

2005 నుంచి ప్రముఖ సాహిత్య, సంగీత కళాకారులకు అందిస్తున్నామని తెలిపారు. ప్రముఖ

రచయిత హరివంశ్ రాయ్ బచ్చన్, తెలుగు భాషాభిమాని, మాజీ ముఖ్యమంత్రి ఎన్  à°Ÿà°¿ రామారావు à°² వర్ధంతి ను పురస్కరించుకుని ప్రముఖులకు à°ˆ పురస్కారం అందిస్తున్నామన్నారు. à°ˆ

పురస్కారమునకు గాను రూ. 1 .50 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందించడం జరుగుతుందని, ఈ ఏడాది నుంచి సమాజ సేవలో తరిస్తున్న వారు ఇద్దరికీ ప్రోత్సాహక పురస్కారం ( రూ.50 వేలు) కూడా

అందిస్తున్నామన్నారు.  à°ˆ విలేకరుల సమావేశం లో ఫౌండేషన్ ప్రతినిధి ఎన్. బాబయ్య తదితరులు పాల్గొన్నారు 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #yarlagadda lakshmi prasad  #lok nayak foundatiion  #awards  #supreme court justice  #Ampashayya

Naveen

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam