DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చరిత్ర సృష్టించిన ఆడారి కిషోర్ కు అభినందనల వెల్లువ. . .

చరిత్ర సృష్టించిన ఆడారి కిషోర్ కు అభినందనల వెల్లువ. . .

విశాఖపట్నం, మే 11, 2018 (DNS Online) : ఏక బికిన 365 రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తూ 
ఇండియా బుక్ ఆఫ్

రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న ఆడారి కిషోర్ కుమార్ ను పలువురు అభినందించారు. శుక్రవారం విశాఖ నగరం లోని పెదవాల్తేరు లో గల అతని కార్యాలయం లో జరిగిన

కార్యక్రమం లో సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు, దామోదరం సంజీవయ్య యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేశవరావు, ఆచార్య నాగార్జున

విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి బాలమోహన్ దాస్, యోగి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్నికేవలం విశాఖపట్నం

వరకే మరిమితం చెయ్యకుండా దేశం లోని పలు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయడం అభినందనీయమన్నారు. నిర్విరామంగా 365 రోజులుగా భారతదేశం నలుమూలల జమ్మూకాశ్మీర్, ఢిల్లీ , కేరళ,

ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో నిర్విరామంగా కొనసాగించి సుమారు 5 లక్షల మందిని చైతన్యం పరిచేందుకు గాను ఆడారి కిషోర్ కుమార్ కు “INDIA BOOK OF RECORDS “ లో స్థానం

లభించడం హర్షణీయమన్నారు. గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించిన కిషోర్ కుమార్ కు à°ˆ నెలలో అత్యంత ప్రతిష్ఠాకరమైన “INDIA BOOK OF RECORDS “ లోస్థానం దక్కడం మన

ఆంధ్రప్రదేశ్ నుండి మొట్టమొదటి సారిగా అడారి కిషోర్ కుమార్ కు రావడం గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో శ్రీధర్, ప్రసాద్, చందర్రావు, తదితరులు పాల్గొని

అభినందించారు.
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam