May 5, 2026 12:22 am
*రక్తపిపాసులపై విజయం వెనుక పోరాట యోధులెందరో. .*
*వేలాదిమంది కార్యకర్తల బలిదానం ఫలితమే. . .*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 04, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ ఈ పేరు వినగానే సగటు హిందువులకు మృత్యు పాశమే కనపడుతోంది. దాదాపు వందేళ్ల నుంచి హిందువులపై జరుగుతున్నా దారుణ మరణ కాండపై విసిగిపోయిన హిందూ సమాజం తిరగబడితే సాధించిన విజయం మే 4 నాటి దృశ్యం. స్వాతంత్య్రం రాక ముందు నుంచే బెంగాల్ లో హిందువులను లక్షలాదిగా ఊచకోత కోస్తూ ఉంటె. . .గాంధీ , నెహ్రూలు నోరు ఎట్టకపోవడం తో నాటి హిందూ పోరాట యోధులు గోపాల్ పాఠ లాంటి నేతలు ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు.
సరిగ్గా వారి స్ఫూర్తిగానే నేటి యువతరం, హిందూ సమాజ రక్షణ కోసం కొన్ని ఏళ్లుగా పోరాటాన్ని సాగించారు. సోమవారం నాటి బీజేపీ విజయం ఏ ఒక్క రోజు లోనో వచ్చింది కాదు. ఇలాంటి పోరాట యోధుల కృషి ఏంతో ఉంది. ముందు కాలం లో తురకల దౌర్జన్యాలు, అనంతరం కమ్యుని( కృ) ష్టుల దారుణ హత్యాకాండలు , తదుపరి తృణమూల్ ఖాన్ గ్రెస్ చేతిలో మారుగా మారణకాండలు ఇలా ఎన్నింటినో ఎదుర్కొని, నిలబడి చేసిన పోరాట ఫలితమే ఈ విజయం. ముఖ్యంగా హిందూ మహిళలు పట్టపగలే బెంగాల్ రోడ్లపై తిరగ గలిగే అవకాశమే ఉండేది కాదు. ఒక మహిళా వైద్యురాలు ఆసుపత్రిలో పనిచేస్తుండగానే అత్యంత పాశవికంగా మానభంగం చేసి, చంపేస్తే నోరు ఎత్తని శూర్ఫణఖ ప్రభుత్వానికి హిందూ ఓటర్లు గట్టిగా గుణపాఠం చెప్పారు. ఎందరో ఎబివిపి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలను నడిరోడ్లపైనే పట్టపగలు చంపేస్తే ఒక్క కేసుకూడా పెట్టని సందర్భాలు kokollalu. నేరుగా కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి, రక్షణ కల్పించవలసిన పరిస్థితులు బెంగాల్ లో ఉన్నాయంటే . . పరిపాలన ఏ స్థాయి లో ఉండేదో తెలుస్తోంది. మరోప్రక్క బాంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లు అడ్డుకోడానికి సరిహద్దు లో రక్షణ వలయం కట్టాలని కేంద్రం కోరినా నాటి షూర్ఫణఖ ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వకపోవడం వెనుక ఎంత కుట్ర దాగి ఉందొ ప్రజలు గమనించారు. మరోప్రక్క కమ్యూనిస్టు లు సైతం ఈ మరణ కాండలకు ఊతం ఇచ్చారు తప్ప, ఏనాడు వీటిని తప్పు పట్టలేదు. సుదీర్ఘకాలం వాళ్ళు పాలనా లో ఉండి కూడా హిందువులపై దాడులకు ప్రోత్సహించారు. ముఖ్యంగా రోహింగ్యాలు, అక్రమ వలసదారులకు స్థానిక రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ధ్రువ పత్రాలు ఇచ్చేసి, మరీ ఓట్లు వేయించుకుని, దొంగదారిలో అధికారాన్ని రెండు పార్టీలు దోచుకున్నాయి అని ఆధారాలు దొరికినా, ఎటువంటి చర్యలు లేవు. ఇటీవల సోషల్ మీడియా హంగామా పెరిగిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల దౌర్జన్యాలను ఆధారాలతో బహిర్గతం చెయ్యడంతో ప్రజల్లో చైతన్యం బాగా పెరిగింది. ముఖ్యంగా సందేశ్ ఖాలీ లో మహిళలపై టిఎంసి జహంగీర్ ఖాన్ చేసిన అఘాయిత్యాలు ప్రపంచానికి తెలియడం తో జనంలో ప్రతిఘటన మొదలయ్యింది. ఈ టిఎంసి దుర్మార్గాలు కమ్యూనిస్ట్ లకు , ఇతర పార్టీలకు తెలిసిన నోరు ఎట్టకపోవడం గమనార్హం. 2024 లో వెలుగు చూసిన ఈ దుర్మార్గాలపై పోరాటాన్ని మొదలు పెట్టిన మహిళను ఈనాటి బీజేపీ విజయానికి ఒక కారణం. వైద్యురాలి అకాల మరణానికి ప్రతీకారం కోసం ఎదురుచూసిన యువత జెన్ జి పోరాటం మరొక కారణం. సాటి కార్యకర్తలను కళ్ళ ముందరే కోల్పోయిన ఎబివిపి, బీజేపీ కార్యకర్తల పోరాటం మరొక కారణం. ఇలా ఎందరో పోరాట యోధులు కలిసి సాధించుకున్న ఈ విజయం బాధితులకు తప్పక న్యాయం చేస్తుంది అని అందరూ భావిస్తున్నారు. గతం లో జరిగిన అఘాయిత్యాలపై అన్నింటి పై పూర్తి విచారణ జరిపి, చట్ట ప్రకారం దోషులకు కఠిన శిక్షలు విధించాలి అని బెంగాల్ నేడు ఎదురు చూస్తోంది.
Apr 21, 2026 4:52 pm
*విదేశీయానం చేసినా అర్చకులు గర్భాలయ సేవ చెయ్యోచ్ఛ?*
*సింహాచల దేవాలయ అర్చకుల్లో విదేశాలకు వెళ్లినవాళ్ళెందరో?*
*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*
*విశాఖపట్నం, ఏప్రిల్ 21, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన సింహాచల క్షేత్ర శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం ఎంతో మహోన్నతం. అలాంటి స్వామికి ఉపచారాలు జరిపే వైదికులు ఎంతో పవిత్రంగా ఉండాలి అనేది ఆగమశాస్త్ర సారం. అయితే ఈ రూల్స్ సింహాచలం క్షేత్రం అర్చకులకు ఏమాత్రం వర్తించవు అనేది సుస్పష్టంగా తెలుస్తోంది.
అయితే సింహాచల క్షేత్రం లో నిబంధనలు ఎవరికీ వారే మార్చేసుకుంటారు. నిన్నటి రోజున ( ఏప్రిల్ 20 , 2026) జరిగిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం అనంతరం స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అయితే దీనిలో పాల్గొని సేవచేసే అవకాశం కేవలం సమాశ్రయణపరులైన శ్రీవైష్ణవ స్వాములకు మాత్రమే ఉంటుంది. దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. తలపై కేవలం శిఖ మాత్రమే ఉంచి, ముఖంపై ఉన్న మీసం, గెడ్డం కూడా పూర్తిగా క్షవరం చేయించాలి. దీనికి ఓపనం అని పేరు. అయితే వివిధ దేవాలయాల్లో పనిచేసే అర్చకులు దీక్షాధారులుగా తలపై పూర్తి జుట్టు, ముఖం పై మీసం, గెడ్డం కలిసి ఉన్నవాళ్లు కూడా పాల్గొన్నారు. వీరందరినీ తక్షణం బయటకు వెళ్ళవలసిందిగా సింహాచల క్షేత్రం అర్చిక, వైదిక సిబ్బంది ఆదేశాలు జారీచేశారు. గర్భాలయానికి ముందు నీలాద్రి మండపం వద్ద వీరంతా నిలబడి, ఇలా పూర్తి జుట్టు ఉన్నవాళ్ళని, బయటకు లాగేసారు. వాళ్ళు దేవాలయ దీక్షలో ఉన్నామని చెప్పినా కూడా క్షమాపణ లేకుండా నిర్దాక్షిణ్యంగా బయటకు లాగేసారు. ఇంతవరకూ సంప్రదాయ నిబంధనలు వీరు అద్భుతంగా పాటించారు. భేష్. అయితే... ఇలా నిబంధనలు అమలు చేసిన సింహాచల క్షేత్ర అర్చకుల్లో చాలామంది ఇలా పూర్తి గెడ్డం, మీసం జుట్టుతో ఉండడం గమనార్హం..
ఈ రూల్స్ కేవలం సేవ చేసేవారికేనా?
ఈ ఓపనం నిబంధనలు కేవలం సహస్ర ఘటాభిషేకం చెయ్యడానికి వచ్చిన వైష్ణవ స్వాములకేనా? సింహాచలం దేవస్థానం అర్చకులకు ఈ నిబంధనలు వర్తించవా అనే ప్రశ్నలు వెల్లువవుతున్నాయి.
ఇదే ప్రశ్న వేసిన మిగిలిన వారిపై అర్చకులు మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
విదేశీ యానాం పై విమర్శలు...
ఆగమ శాస్త్రం ప్రకారం సముద్రయానం ( విదేశీ యానం ) చేసిన వైదికులు, అర్చకులు, గర్భాలయంలో మూలవిరాట్ ను ముట్టుకుని అర్చనలు చెయ్యడానికి నిషేధం. అంటే. . సముద్రం దాటి ప్రయాణించి, విదేశాలకు ఏ విధంగా వెళ్లినా తిరిగి వచ్చిన తర్వాత గర్భాలయంలో ఎటువంటి సేవ చెయ్యకూడదు అని ఆగమం తెలియచేస్తోంది. అయితే ఈ నిబంధనలు సింహాచల క్షేత్రం లో ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ప్రస్తుతం విధుల్లో ఉన్న అర్చక, వైదిక సిబ్బంది లో చాలా మంది సముద్రం దాటి, విదేశీయానం ప్రయాణం చేసినవాళ్ళే కావడం గమనార్హం. పైగా ఒక్కసారి కాదు, పలుమార్లు అమెరికా, కెనడా వంటి దేశాలకు వెళ్లి, నెలలకు నెలలు కాలం గడిపిన సందర్భాలు ఉన్నాయి. వీళ్లల్లో సామాన్య అర్చకుల నుంచి ప్రధాన అర్చకుల వారకూ ఉన్నారు అనేది వైదిక వర్గాల అభియోగం.
వీళ్ళు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికారుల వద్ద తమ పరపతిని వాడి, ప్రలోభపెట్టో, బ్రతిమాలో, ఇంకే విధంగానే, ఈ రూల్స్ ని తారుమారు చేసేసారు అనే విమర్శలు సాక్షాత్తు దేవస్థానం సహచర అర్చకుల్లోనే వినపడుతోంది.
వైదిక నిబంధనలు కేవలం సామాన్య వైష్ణవ స్వాములకు మాత్రమేనని, పలుకుబడి ఉన్న అర్చకులు, వైదికులకు కాదు అనేది సింహాచల క్షేత్రం లో సుస్పష్టం అవుతోంది. అయితే ఈ విధమైన పరిస్థితి కేవలం సింహాచల క్షేత్రంలో మాత్రమే కాదు, రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో కూడా ఉంది అన్నది వాస్తవం.
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

దేవస్థాన ట్రస్టీలుగా ఎంపికైన విప్రులకు అభినం...
May 16, 2026 1:06 pm
*సంప్రదాయ వైభవ సారధులకు శుభాకాంక్షలు : DNS Media*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 16, 202...
May 12, 2026 1:43 pm
May 10, 2026 5:49 pm
May 9, 2026 3:46 pm

May 5, 2026 11:35 pm
*రైల్వే జోన్ గెజిట్ పై ఆంధ్ర బీజేపీ నేతలకే పట్టింపు లేదాయె*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 05, 2026 (డిఎన్ఎస్ ):* అన్ని చోట్ల బీజేపీ గెలుస్తున్నా. . . ఆంధ్ర బీజేపీ కి కనీసం పట్టింపు లేకుండా పోయాయి. అత్యంత ప్రమాదకరమైన పశ్చిమ బెంగాల్ లో పోరాడి గెలిచినా బీజేపీ గురించి ఆంధ్ర లో నాయకులూ చంకలు గుద్దుకుంటున్నారు. ఎప్పుడూ ఎదురింట్లో పెళ్లి కి వీళ్ళు చప్పట్లు కొట్టడం తప్ప, వీళ్ళింట్లో పెళ్లి చెయ్యాలి అనే జ్ఞానము లేకుండా పోయింది. ఇప్పడి వరకూ ఆ సోయి రాలేదు. ఇక ముందు వస్తుందన్న నమ్మకం పార్టీ క్యాడర్ లో పోయింది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఆంధ్ర బీజేపీ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన అద్భుత మేలు గురించి ఒక్కడు నోరు ఎత్తిన పాపాల పోలేదు.
కొన్ని దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ మంగళ వారం అధికారికంగా గెజిట్ విడుదల అయ్యింది. ఇది బీజేపీ చరిత్రలో అత్యంత పెద్ద విజయం. అయితే దీన్ని ప్రచారం చెయ్యడానికి ఒక్క బీజేపీ నేత, ఆఖరికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సైతం ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మిఠాయిలు పంచాడు తప్పితే. . సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక ప్రకటన గురించి నోరు విప్పలేదు. ఇలాంటి వాళ్ళు నేతలు రాష్ట్ర నేతలు గా ఉంటె. . .పార్టీ అడుక్కు తినక అధికారం లోకి వస్తుందా అని సగటు పార్ట్ క్యాడర్ ప్రశ్నిస్తోంది.
ఈ ప్రకటన గతంలోనే వఛ్చినప్పడికి. . .అధికారిక ఉత్తర్వులు మాత్రం మంగళ వారమే వచ్చాయి. దీని ప్రకారం జూన్ 1 , 2026 నుంచి అమలు లోకి రానుంది. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పోరాటాలు జరిగాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి, విశాఖ లో సభ పెట్టి మరీ రైల్వే జోన్ గురించిన ప్రకటన విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతటి గొప్ప విషయాన్నీ ప్రకటించుకునే స్థాయి ఆంధ్ర బీజేపీ నాయకులకు లేకుండా పోయింది అంటే. .
ఈ ప్రకటన విడుదలయ్యే సమయానికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విజయవాడ కార్యాలయం లోను, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు, తన కార్యాలయం లోనూ, విశాఖ నగర అధ్యక్షుడు పరశురామ రాజు నగర పార్టీ కార్యాలయంలోనూ బెంగాల్ విజయం పై సంబరాలు చేసుకుంటున్నారు. అయితే విశాఖ రైల్వే జోన్ గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ నేతల వైఖ రి చూస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ ఏ స్థాయి లో అడుగంటిపోయిందో తెలుస్తోంది.