May 21, 2026 3:39 pm
సింహాచలం భూముల్లో కట్టిన వైన్ షాప్, చర్చ్ లకు అధికారుల అండ ఉందా?
దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం పై విహెచ్పి రాష్ట్ర నేత పూడిపెద్ది శర్మ మండిపాటు
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 21, 2026 (డిఎన్ఎస్ ):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం కు చెందిన భూములు ఇతరులు కబ్జా చేస్తున్న అధికారులు కళ్ళు మూసుకు కూర్చున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర మఠ్ మందిర్ టోలి పూడిపెద్ది శర్మ మండిపడుతున్నారు. దేవస్థానం కొండకి కూతవేటు దూరంలోనే ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసి, అక్రమ నిర్మాణాలు కడుతుండడంతో, పూడిపెద్ది శర్మ ఆలయ అధికారులు ఏఈవో శ్రీనివాస రావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ లను వ్రాతపూర్వక ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేదని తెలిపారు.
విరాట్ నగర్ లో ఏపిఎస్ఈ విద్యుత్ శాఖా కార్యాలయం ఎదురుగా ఉన్న దేవస్థానం స్థలంలో అక్రమం గా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, అక్కడ మద్యం దుకాణానికి అప్పగించారు. అయితే దేవస్థానం భూమిలో అనుమతులు తీసుకుని నిర్మాణం కట్టినా, మద్యం దుకాణాలను అక్కడ పెట్టరాదు. ఇదే స్థలం మీదుగా ఆలయ ఈఓ, ఇతర అధికారులు అందరూ తిరుగుతూనే ఉంటారు. ఎవ్వరికి దీని గురించి పట్టింపు లేదు.
ఇక అడవివరం ఎస్ సి కొలని లో దేవస్థానం భూమిలో ఏకంగా చర్చ్ నిర్మాణం చేసి, ఎటువంటి సిగ్గు లేకుండా చర్చ్ కార్యాలపాలతో పాటు గా, మతమార్పిళ్లు సైతం యధావిధిగా చేస్తున్నారని శర్మ మండిపడ్డారు. ఈ స్థానం లో ఇంటి కోసం అనుమతి తీసుకుని, చర్చ్ ని అక్రమం గా నడుపుతున్నారని, ఆధారాలతో చూపించినా దేవస్థానం అధికారులు కళ్ళు మూసుకుపోయారని మండిపడ్డారు. ఇప్పడికైనా ఆలయ ఈఓ వెంకట్రావు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి, ఈ దేవస్థానం భూములను స్వాధీనం చేసుకోవడం తో పాటు, దోషులపై చట్టప్రకారం చెర్యలు చేపట్టాలని, వీళ్ళకి సహకరిస్తున్న సింహాచల దేవస్థానం అధికారులను తక్షణం ఉద్యోగం నుంచి తొలగించాలని విశ్వహిందూ పరిషత్ తరపున పూడిపెద్ది శర్మ డిమాండ్ చేసారు. లేని పక్షంలో విహెచ్ పి ప్రత్యక్ష పోరాటానికి సిద్దపడుతున్నట్టు హెచ్చరించారు.
May 20, 2026 2:56 pm
*గుళ్లో అర్చనల్లో పాంచరాత్రం, దివ్య ప్రబంధం వినిపించాలి*
*వేదపాఠశాలలో ఆ రెండు కోర్సులు లేవు? గుళ్లో వాటి పోస్టులు లేవు?*
*ఈవో కు, ఆచార్యులకు భాద్యత లేదు, పాఠశాలకు గుర్తింపు లేదు*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 20, 2026 (డిఎన్ఎస్ ):* ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం శ్రీవైష్ణవ శ్రీపాంచరాత్ర ఆగమం విధానం లో నడుస్తుంది. ఈ దేవాలయంలో నిత్యం పాంచరాత్రం ఆగమం ప్రకారం అర్చనలు జరగాలి. నాలాయిర దివ్య ప్రబంధం విన్నపాలు జరగాలి. ఈ పారాయణాలు చేసేందుకు కొన్ని దశాబ్దాల క్రితం వరకూ రెగ్యులర్ విధానం లో శ్రీవైష్ణవ పండితులను నియమించేవారు. అయితే దాదాపు మూడు దశాబ్దాలుగా సింహాచల క్షేత్రంలో నాలాయిర దివ్య ప్రబంధ పండితులు కాంట్రాక్టు విధానం లో రోజువారీ వేతనం ఇచ్చే విధంగా తీసుకు వస్తున్నారు. తప్పితే పూర్తి స్థాయి పండితులను నియమించడం లేదు. అయితే గతంలో వీటికోసం ప్రభుత్వం నియామక ప్రకటన కూడా ఇచ్చింది. అయితే వీటి కి తగిన సూచనలు చేయవలసిన ఆచార్యులు, నాటి అర్చకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ పోస్టులను రద్దు చేసి, వేదం కేటగిరి లోకి మార్చేశారు.
ఆచార్యులు, అర్చకులు కారణమా ?
సింహాచల క్షేత్రం లో రెగ్యులర్ అధ్యాపకులు, పారాయణదారుల పోస్ట్ ల నియామకం కొన్ని దశాబ్దాలుగా జరగకుండా నిలిచిపోడానికి ప్రధాన కారణం ఆచార్యులు, అర్చకులు ఆధిపత్య పోరే కారణం అంటూ వైదిక సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పడికే కొన్నేళ్లుగా రోజువారీ వేతనం విధానం లో పనిచేస్తున్న వాళ్లలో ఎక్కువమందికి పూర్తి అర్హతలు ఉన్నాయి. అయినప్పడికి వీళ్ళకి నియామకం వస్తే దేవస్థానం లో తమ ఆధిపత్యం తగ్గిపోతుంది అన్న కారణంతో ఆ ఇద్దరూ ఈ పోస్ట్ లను అడ్డుకున్నారని ప్రచారం విస్తృతంగా సాగుతోంది. పైగా వీరిలో అర్చకులుగా ఉన్నవారు గతం లో సొంత వ్యవహారాల కోసం అమెరికా వెళ్లి రావడం తో పై కారణానికి మరింత బలం పెరిగింది. ఇటీవల కోర్టు ఇచ్చిన సూచనల ప్రకారం విదేశాలకు వెళ్లిన వాళ్ళు గర్భాలయంలో అర్చనలు చెయ్యరాదు అనే నిబంధన పై వైదిక సిబ్బంది పట్టుపడుతున్నారు. అయితే అతనికి ఉన్నతాధికారుల వద్ద ఉన్న పరపతి కారణంగా ఈ తాత్కాలిక రోజువారీ వైదికులను రెగ్యులర్ నియమాకాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు ఆచార్యులు, అర్చకులు అడ్డకుంటున్నారన్న అభియోగాలకు నిదర్శనాలు కనపడుతున్నాయి.
గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సింహాచల క్షేత్రం లో పూర్తిగా వైదిక ఆచారాలను తుంగలోకి తొక్కి తాము చెప్పినట్టే అర్చనలు చెయ్యాలి అని శాసిస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళు పెట్టె నిబంధనలు ఇతర వైష్ణవ స్వాములకే తప్ప, తాము పాటించవలసిన అవసరం లేదని బహిరంగంగానే వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవలే జరిగిన చందన యాత్ర రోజు రాత్రి నాటి సహస్ర ఘటాభిషేకం లో వైష్ణవ స్వాములందరూ కచ్చితంగా ఓపనం, శిఖా తో ఉండాలి అనే నిబంధన పెట్టారు. వీరు మాత్రం పూర్తి జుట్టు, గెడ్డం తో ఉండడం గమనార్హం. ఇదే ప్రశ్నించిన కొందరు వైష్ణవ స్వాములను ఆలయం నుంచి వెంటనే బయటకు పంపేశారు.
వైదిక విషయాల్లో పూర్తి అధికారం కల్గిన ఆచార్యులు తనదైన శైలిలో చెప్పిన ప్రతి విషయానికి అధికారులు తానతందానా అంటూ తలూపడం జరుగుతోంది.
వీళ్ళ ప్రతాపంతోనే వేదపాఠశాల కుంటూ పడిందా ?
గతంలో వందలాది మంది పండితులు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం పరిధిలోని వేదపాఠశాలలో చేరి, ఉన్నత విద్యావంతులు అయ్యారు. ఇక్కడ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వ వేదం తో పాటు, శైవాగమం, పాంచరాత్ర ఆగమం, స్మార్తం, సహా ఇతర కోర్సులను నేర్పించేవారు. అయితే కొండపై ఇద్దరు పెద్దల అధికార ప్రభావంతో ఈ పాఠశాల లో గత ఐదేళ్లుగా శ్రీ పాంచరాత్ర కోర్సు మూతపడింది. అంతకు ముందు 35 ఏళ్లుగా నాలాయిర దివ్య ప్రబంధం కోర్సు మూతపడింది. అసలు సింహాచల క్షేత్ర దేవాలయానికి ఆయువు పట్టులైన ఈ రెండు కోర్సులనూ మూసివేయడానికి వీళ్ళకి హక్కు ఎవరు ఇచ్చారు అని వైదికులు ప్రశ్నిస్తున్నారు. ఈ పాఠశాల గురించి ఎక్కడా ప్రచారం చెయ్యరు, అసలు ఇక్కడ వేదపాఠశాల ఉంది అనే విషయం కూడా చాలామందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు.
ఇటీవల సింహాచల దేవస్థానం విడుదల చేసిన వేదపాఠశాల ప్రవేశ ప్రకటన ప్రత్యక్ష నిదర్శనం గా నిలిచింది. దీనిలో వేదం, స్మార్తం, శైవ ఆగమం కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులకు ఆహ్వానం అని ఇచ్చారు. దీనిలో పాంచరాత్రం గానీ, దివ్యప్రబంధం గానీ లేవు.
దేవాలయానికి మూలబిందువైన పాచరాత్రం, దివ్య ప్రబంధం నేర్పించేందుకు అసలు అధ్యాపకులే వేదపాఠశాలలో లేరు. వాళ్ళ నియామకం కూడా అనవసరం అని కొండపై పెద్దలు తీర్మానించినట్టు సమాచారం. కొంతమంది వైదికులు ఇప్పడికే విద్యార్హతలు పొంది, వయసు మీరిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. దేవస్థానంలో పాంచరాత్రం, దివ్య ప్రబంధం విభాగాల్లో పూర్తి స్థాయి వైదికులను నియమించినట్టయితే. .. దేవాలయంలో పాటు, వేదపాఠశాల లో విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేదు.
అన్నింటి కంటే మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే సింహాచల క్షేత్రం లో ఉన్న వేద, స్మార్త ఆగమ పాఠశాలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు. ఇక్కడ చేరిన విద్యార్థులు ప్రభుత్వ జాబితా లో ఈ పాఠశాల విద్యార్థులుగా ఉండరు. అయినా కూడా దేవస్థానం కార్యనిర్వహణ అధికారులకు గానీ, దేవస్థానం వైదిక ఆచార్యులకు గానీ, పాఠశాల నిర్వాహక అధ్యాపకులకు గానీ పట్టింపు లేక పోవడం గమనార్హం.
ఇదే ఒక సాధారణ పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేకపోతె వెంటనే ఆ స్కూల్ ను మూసేయిస్తారు అధికారులు. మరి అలాంటిది దశాబ్దాల తరబడి ప్రభుత్వ గుర్తింపు లేకుండా సింహాచలం వేద పాఠశాల ఎలా నడుస్తోంది?
గతం లో ఇక్కడ చదివిన విద్యార్థులు ఇతర సంస్థల నుంచి ప్రభుత్వ పరీక్షలు ప్రవేశ, వర, ప్రవర, వంటి పరీక్షలకు హాజరై వ్యక్తిగతంగా వ్రాసేవారు. అలా వచ్చిన సర్టిఫికెట్లతొ వివిధ దేవస్థానాల్లో ఉద్యోగాల్లో చేరారు తప్ప, సింహాచల దేవస్థానం ఆగమ పాఠశాల వాళ్ళ కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే.
పాఠశాలకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ విద్యార్థులను ఎలా చేరుస్తారు. కనీసం 20 మంది కూడా విద్యార్థులు లేకుండా ఒక వేద పాఠశాలను ఎలా నిర్వహిస్తున్నారో సింహాచల దేవస్థానము ఈఓ కె తెలియాలి.
హిందూ దేవాలయ భూముల్లో చర్చ్ కి అనుమతి ఎవరు ఇచ్చారు? పూడిపెద్ది శర్మ
సింహాచలం క్షేత్రం లో ప్రబంధం పోస్ట్ లేకపోడానికి వాళ్లే కారణమా?
దేవస్థాన ట్రస్టీలుగా ఎంపికైన విప్రులకు అభినందనలు: పూడిపెద్ది శర్మ
1967 లో ఇందిరా చెప్తే లేవని నోళ్లు, మోడీ చెప్తే ఎందుకు ఏడుస్తున్నాయి?
కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ లు బీజేపీ కి , మోడీ కి ధన్యవాదాలు చెప్పాలి
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

బొద్దింకలను అడ్డుకోవాలంటే బీజేపీ లో దేశవ్యాప...
May 26, 2026 2:00 pm
*ధన బలమే పార్టీ పదవికి అర్హతా? పనిచేసేవాడికి పనిచేసేవాడికి గుర్తింపు ఉండదా ?*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, ...
May 26, 2026 1:57 pm
May 24, 2026 10:20 pm

May 22, 2026 3:48 pm
*అడవివరంలో చర్చ్ కూడా కూల్చండి: రాష్ట్ర ప్రముఖ్ పూడిపెద్ది*
*DNS వార్త కు స్పందనగా అక్రమ కట్టడాల కూల్చివేత*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 22, 2026 (డిఎన్ఎస్ ):* సింహాచలం దేవస్థానం భూముల కబ్జా పై DNS మీడియా లో గురువారం వచ్చిన కథనం పై దేవస్థానం అధికారాలు స్పందించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు సింహాచలం క్షేత్రం లో వెలసిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం కు చెందిన భూములు ఇతరులు కబ్జా చేస్తున్న అధికారులు కళ్ళు మూసుకు కూర్చున్నారని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అర్చక, పురోహిత్, మఠ్ మందిర్ ప్రముఖ్ పూడిపెద్ది శర్మ పోరాటం చేస్తున్నారు. అయన పోరాట ఫలితంగా శుక్రవారం దేవస్థానం అధికారులు, అక్రమంగా దేవస్థానం భూముల్లో నిర్మించిన కట్టడాలను కూల్చి వేశారు. సింహాచలం కొండకు దగ్గరలోనే ఉన్న విరాట్ నగర్ లో ప్రధాన కూడలి దగ్గరే ఉన్న దేవస్థానం భూమిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను శుక్రవారం పొలిసు సిబ్బంది సహకారం తో కూల్చేశారు. ఈ చర్య పట్ల పూడిపెద్ది శర్మ హర్షం వ్యక్తం చేసారు.
అదే విధంగా అడవివరం ఎస్ సి కొలని లో దేవస్థానం భూమిలో ఏకంగా చర్చ్ నిర్మాణం చేసి, ఎటువంటి సిగ్గు లేకుండా చర్చ్ కార్యాలపాలతో పాటు గా, మతమార్పిళ్లు సైతం యధావిధిగా చేస్తున్నారని శర్మ మండిపడ్డారు. ఈ స్థానం లో ఇంటి కోసం అనుమతి తీసుకుని, చర్చ్ ని అక్రమం గా నడుపుతున్నారని తెలిపారు. దీని పై కూడా అధికారులు విచారణ జరిపి, తక్షణం చర్చ్ ను కూల్చివేయాలని డిమాండ్ చేసారు.