తాజా వార్తలు
  • 1967 లో ఇందిరా చెప్తే లేవని నోళ్లు, మోడీ చెప్తే ఎందుకు ఏడుస్తున్నాయి?

    May 12, 2026 1:43 pm

    *దేశ ఆర్ధిక భద్రతా కోసమే. . బంగారం కొనవద్దు ప్రధాని పిలుపు...*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 12, 2026 (డిఎన్ఎస్ ):* ఒక ఏడాది పాటు బంగారం కొనవద్దు అని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వగానే. . .దేశం లోని వ్యతిరేకశక్తులన్నీ నోరు పట్టుకుని విరుచుకు పడ్డాయి .  అంతర్జాతీయ ఆంక్షల పరిస్థితుల నేపథ్యంలో ఒక ఏడాది పాటు మనం జాగ్రత్తగా ఉండాలి అని మోడీ తెలియచేసారు. అయితే ఈ దేశంలో ఉంటూ.. ఈ దేశం లో తింటూ.. ఈ దేశ అభివృద్ధి కోసం ప్రధాని ఇచ్చిన పిలుపు ను మాత్రం అత్యంత దారుణంగా విమర్శిస్తున్నాయి.  ఇప్పుడు మోడిని విమర్శిస్తున్న ఖాన్ గ్రెస్,  కమ్యుని(కి)ష్టులు, 1967 జూన్ 6 నాడు ఇదే పిలుపు ఇచ్చిన నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ని ఎందుకు ప్రశ్నించలేదు. అప్పుడు గొర్రెల్లా తలూపిన వీళ్ళకి ఇప్పుడు పరిస్థితి తెలియదా. .  ఏదో పెద్ద రోజుకో కేజీ  బంగారం కొనే మొహాలు వీళ్ళూనూ.. 

    అసలు ప్రధాని ఇచ్చిన పిలుపు ఎందుకు?
    పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్నా యుద్ధ వాతావరణం నేపథ్యంలో అమెరికా బంగారం దిగుమతులపై అధిక పన్నులు విధించి, భారత్ పై అదనపు భారాన్ని మోపింది. అదే నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ఉత్పత్తులపై అరబ్ దేశాలు పన్నులు మోత  మ్రోగిస్తున్నాయి. వీటన్నింటీ నీ భారత్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ మారకం పైనే జరుగుతాయి. 
    వీటిని కొంతకాలం తగ్గించుకుంటే. . డాలర్ మారకం తగ్గుతుంది. భారత్ పై ఆర్ధిక భారం తగ్గుతుంది. అనవసరం గా బంగారం కొనడం వల్ల  భారత ధనం  డాలర్ల రూపంలో అమెరికాకు చేరుతుంది. పెట్రో ఉత్పత్తులు కొనడం వల్ల  ధనం  డాలర్ల రూపంలో అరబ్ దేశాలకు చేరుతుంది. వీటిని కొన్నాళ్ళు తగ్గించడం వలన , భారత్ నుంచి వెళ్లే డాలర్ల సంఖ్యా తగ్గుతుంది. భారత్ విలువ అమెరికాకు, అరబ్ దేశాలకు తెలుస్తుంది. అని భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ మాటపై  ఖాన్ గ్రెస్, కమ్యుని (కి)ష్టులు నోటికి వచ్చిన విమర్శలు పేలుతున్నాయి. 
    సరిగ్గా ఇలాంటి పరిస్థితులే 1967 లో వచ్చ్చాయి. జూన్ 6 , 1967 న  నాటి భారత దేశ  ప్రధాన మంత్రి ఇందిరా బంగారం కొనవద్దు అని  ప్రజలకు పిలుపు ఇచ్చారు. అదే విషయాన్నీ, హిందూ దినపత్రిక ప్రధాన వార్తగా ప్రచురించింది. 

    బంగారం కొనవద్దు, ప్రజలకు ఇందిర 1967 లో పిలుపు; 

    'జాతీయ క్రమశిక్షణ' పాటించాలని విన్నపం విదేశీ మారక ద్రవ్యం పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది:  ఏ రూపంలోనూ బంగారం కొనవద్దని, దేశంలో బంగారు వినియోగం విషయంలో  "జాతీయ క్రమశిక్షణ" పాటించాలని ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేడు ప్రజలకు హృదయపూర్వక విన్నపం చేశారు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర కృషిలో భాగంగానే ఈ విన్నపం చేశారు. 

    అందులో  విమర్శకుల నుంచి  ఒక్క విమర్శ కూడా లేదు.  పైగా అన్ని వర్గాలూ ఈ ప్రకటనను  పూర్తిగా సమర్ధించాయి.. మరి అదే పరిస్థితులు ఉన్న నేడు అదే భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొంతకాలం  బంగారం కొనవద్దు అని పిలుపు ఇస్తే. . .నేటి పత్రికల్లో స్వయం ప్రకటిత  మేతావులు, విమర్శకులు అనేక ప్రేలాపనలు  ప్రేలుతున్నారు. పైగా దిక్కుమాలిన సోషల్ మీడియా లో దారుణంగా దూషణలు కూడా మొదలు పెట్టేశాయి.  

    అదే పరిస్థితులు - -  ప్రధాని ఒక ప్రకటన ఇస్తే. . .సమర్ధించిన విమర్శకులు,  అలాంటి పరిస్థితుల్లో భారత ప్రధాని అదే ప్రకటన చేస్తే. . .
    అసలు సొంతంగా పనిచేసి దమ్మిడీ కూడా సంపాదించలేని చవటలు, దేశ విద్రోహ శక్తులు విదిలించే  ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడుతున్న వాళ్ళు నోటికి వచ్చిన ప్రేలాపనలు చేస్తున్నారు అంటే. . . ఈ విమర్శకుల వెనుక ఉన్న దేశ విద్రోహ శక్తులను అరెస్ట్ చేసి, విచారణ జరపవలసిన అవసరం ఉంది అని జాతీయ వాదులు అభిప్రాయపడుతున్నారు. 

  • కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ లు బీజేపీ కి , మోడీ కి ధన్యవాదాలు చెప్పాలి

    May 10, 2026 5:49 pm

    *15 ఏళ్లుగా టిఎంసీ గూండాల కబ్జా లో సిపిఎం, ఖాన్ గ్రెస్ ల పార్టీ ఆఫీసులు* 

    *ఒక్కొక్కటిగా నేడు స్వాధీనం అవుతున్న సంఘటనలు*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 10, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధికారం లోకి రావడం పట్ల సనాతన హిందూ, బీజేపీ వర్గాల కంటే కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ లు ఎక్కువగా సంతోషపడుతున్నట్టు తెలుస్తోంది. సూర్ఫణఖ పరిపాలనలో గత  15 ఏళ్ళ నుంచి సిపిఎం, ఖాన్ గ్రెస్ పార్టీ ల కార్యాలయాలను త్రిణమూల్ ఖాన్ గ్రెస్ గూండాలు కబ్జా చేయడం జరిగింది. ఈ 15 ఏళ్ళ ల్లో కనీసం ఈ ఆఫీసుల  గుమ్మం లోకి కూడా ఈ రెండు పార్టీల వాళ్ళు అడుగు కూడా పెట్టలేకపోవడం అత్యంత దారుణం. ఒక్కసారిగా ప్రజల్లో ప్రజా ఉద్యమం రావడం, భారతీయ జనతా పార్టీ అధికారం లోకి రావడం తో ప్రతిపక్ష పార్టీలైనా కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ పార్టీల సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 15 ఏళ్లుగా టిఎంసి గూండాల కబ్జాలో ఉన్న తమ పార్టీ కార్యాలయాలను ఉత్సాహంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంబరాలు పశ్చిమ బెంగాల్ మొత్తం కనపడింది. గతం లో ఇదే ఖాన్  గ్రెస్, కమ్యూనిస్ట్ ల పాలనలో హిందువులు ప్రత్యక్ష నరకం అనుభవించిన విషయం తెలిసిందే. ఇలాంటి వాళ్ళకే నరకం చూపించారంటే టిఎంసీ  పరిపాలన లో ఎన్ని అకృత్యాలు జరిగాయో తెలుస్తోంది.  

    పార్టీల అభిమతం వేరు అయినా, వాళ్ళు గెలవడం వల్లనే వీళ్ళ పార్టీ కార్యాలయాల్లోకి అడుగు పెట్టగలిగాం అని ఆఫ్ ది రికార్డు లో తెలియచేస్తున్నారు. ఇన్నాళ్లు రాక్షస పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని, కనీసం తమ పార్టీ అభ్యర్థులకు ప్రచారం కూడా చెయ్యలేని దుస్థితి లో ఉన్నామని తెలియచేస్తున్నాయి. నేటి ప్రజా ఉద్యమం పశ్చిమ బెంగాల్ భవితకు తొలిబాటగా అందరూ అభివర్ణిస్తున్నాయి. 

  • అమీ. . . సుబెందు అధికారి.  వినగానే..అక్కడ సంబరాలు

    May 9, 2026 3:46 pm

    *తెలుగు రాష్ట్రాల్లో స్వయం మేతావులకు గుండెపోటు వచ్చిందిట?*   

    *వాళ్ళకి సందేశ్ ఖాలీ కనపడదు, ఆర్జీ కార్  మర్డర్ కనపడవు.*

    *50 ఏళ్లుగా నరకంలోనే ఉంది: మాజీ డిజిపి డా బిఎన్ రమేష్* 

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 09, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ లోని కోలకతా వేదిక నుంచి అమీ. .. సువెందు అధికారి అని పదాలు వినపడగానే శనివారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, లోని చాలామందికి గుండెపోటు వచ్చేసినట్టు తెలుస్తోంది. గత పాలకులకు వీళ్ళు తొత్తులు అనుకుంటే మహాతప్పు. వీళ్ళు కడుపుమంట అంతా భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకం, భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే కడుపుమంట. వీళ్లల్లో అధికులు స్వయం ప్రకటిత మేతావులు, హిందూ వ్యతిరేక శక్తులు, సెక్కులర్ నక్కలు. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని పట్టించుకునే సమయం, తీరిక బీజేపీ కి లేవు. వాళ్ళ ఉనికి ని తెలియచేసుకునేందుకు కనిపించిన ప్రతీ మైకు  ముందు తమ కడుపుమంట  వ్రెళ్ళగక్కుతున్నారు. .  

    భారత దేశంలో అత్యంత ప్రమాదకర ఘటనలు జరుగుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గత ఏడు దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నా అరాచకాలను, మహిళలపై పట్టపగలే అత్యాచారాలను,  భరించలేని స్థానిక ప్రజలు 2026 ఎన్నికల్లో కమ్మునిస్థులకు, తృణమూల్ ఖాన్ గ్రెస్ సహా ఖాన్ గ్రెస్ లాంటి అన్ని పార్టీలకు గట్టిగా బుద్దిచెప్పారు. దీని ఫలితంగా బీజేపీ కి 207 సీట్లు ఇచ్చారు. టిఎంసి కి 80 సీట్లు, ఖాన్ గ్రెస్ కి 2 సీట్లు, ఇచ్చారు. దశాబ్దాల కాలం పాలించిన  కమ్యూనిస్ట్ లకు డిపాజిట్లు కూడా రాలేదు. 
    దీంతో ఆంధ్ర లోని స్వయంప్రకటిత మేథావులు, ( వీళ్ళ సంఘం లో రెండో సభ్యుడు లేడు, ఎందులో మేతావో తెలియదు) తెగ విషయం క్రక్కుతున్నాడు. ఇతనికి మద్దతుగా ఆ ఒడిన  పార్టీల చెంచాలు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం పై దారుణంగా విషం క్రక్కుతున్నారు. ఈవీఎం లు మోసం చేశాయని, బీజేపీ, మోడీ బెంగాల్ ని మోసం చేసారంటూ తెగ ఫీల్ అవుతున్నారు. గత 7 దశాబ్దాలుగా బెంగాల్ లో మహిళలపై జరిగిన  అఘాయిత్యాలు వీళ్ళకి కనపడలేదు. సందేశ్ ఖాళీ లో షాజహాన్ ఖాన్ నేరుగా పార్టీ కార్యాలయంలోనే  మహిళలపై చేసిన అఘాయిత్యాలు, మట్టుపెట్టడాలు, కోలకతా మహా నగరం నడిబొడ్డులో ఆర్ జి కార్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై పట్టపగలు జరిగిన అఘాయిత్యం, హత్య లు ఈ ఉత్తుత్తి మేతావులకు కనపడలేదు. 
    వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సువెందు అధికారి ప్రకటన చెయ్యగానే కలుగులోని ఎలకల్లా ఒక్కసారిగా ఈ హిందూ వ్యతిరేక శక్తులన్నీ రోడ్డెక్కి గుండెలు బాదుకుంటున్నాయి. 

    అలాంటిది శనివారం సువెందు అధికారి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యగానే ఇక్కడ చాలా గుండెలు బాదేసుకున్నారు. 

    సెక్రటేరియట్ లో సంబరాలు : 
    అదే క్రమం లో బెంగాల్ లో ప్రభుత్వం పడిపోగానే ప్రభుత్వ సచివాలయంలో వందలాది మంది ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు అంటే గత ప్రభుత్వం ఉద్యోగులను ఎంతగా నరక బాధలు పెట్టిందో తెలుస్తోంది. బెంగాల్ లో హిందువులు అత్యంత మైనారిటీలుగా బ్రతుకులు ఈడ్చారు అనడానికి నిదర్శనం. .. బెంగాల్ లోని హిందూ దేవాలయాలకు తాళాలు వెయ్యడమే. కోర్టు లు ఆదేశం ఇచ్చినా... ఈ గుళ్ళు తెరిస్తే  హిందువులను నడిరోడ్డుమీదే చంపేస్తాం అని బెదిరించిన ఘటనలు ఈ ఉగ్రమేతావులకు కనపడలేదు. వీళ్ళ కార్యాచరణ పరిశీలన చెయ్యవలసిన అవసరం ఉండనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. 

    మాజీ డిజిపి రమేష్ సంచలన వ్యాఖ్యలు:

    బెంగాల్ లో గత పాలకుల హయం లో జరిగిన దుర్ఘటనలు, అఘాయిత్యాలను మాజీ డిజిపి డా. రమేష్ ఒక మీడియా డిబేట్ లో వివరించారు. గత 50 ఏళ్ళ నుంచి అన్యాయాలు, అక్రమాలు విస్తృత కృత్యాలు జరిగాయన్నారు. గత మూడు దశాబ్దాలుగా బెంగాల్ లోనే ఉన్నామని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. సందేశ్ ఖాలీ, ఆర్ జి  కార్ లాంటి ఘటనల వెనుక కార్యాచరణ ఎంత భయంకరం గా ఉందొ తెలిపారు. ఆర్ధిక వనరులపై చావుదెబ్బ కొట్టి, పరిశ్రమలను తరిమికొట్టారన్నారు. అభయ ఘటనలో 500 మంది పోలీసులను పంపి, ఆ శరీరాన్ని ని హైజాక్ చేసి, 10 లక్షలు పంపి, మరో 5 లక్షలు ఇఛ్చి కేసుని బయటకు రాకుండా చేశారన్నారు. కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేశారన్నారు. అదే గుండాలు,  మే 4 తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడతాడో మెం చూస్తాం అంటూ నేరుగా కేంద్ర పొలిసు బలగాలకు హెచ్చరిక జారీ చేశారంటే. .. బెంగాల్ లో స్థితి ఎలా ఉందొ తెలుస్తోందన్నారు. ఈ డీ చర్యలను సైతం అడ్డుకుని, రాజ్యాంగ వ్యవస్థ కార్యాచరణని అడ్డుకున్నారని, వాటిని ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను సరిదిద్దడానికి కొంత సమయం పడుతుందని, రాబోయే ఐదేళ్లు కత్తిమీద సాములాంటిదన్నారు. 
    బెంగాల్ చరిత్రలో 25 లక్షలకు మంది పైగా జనం  మొట్టమొదట సారి పోలింగ్ బూత్ లను చూసింది ఈ 2026 ఎన్నికల్లోనే అని అన్నారు .  

    యోగి,  బాబు, హాజరు :
    సువెందు అధికారి ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాధ్, చంద్ర బాబు నాయుడు, రేఖ గుప్త, సహా ప్రముఖులు హాజరయ్యారు. 

Panchangam - May 22, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - May 22, 2026

ఆంధ్ర ప్రదేశ్
view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
view more..
Movie News
view more..
విశాఖ వార్తలు
హిందూ దేవాలయ భూముల్లో చర్చ్ కి అనుమతి ఎవరు ఇచ్...

May 21, 2026 3:39 pm

సింహాచలం భూముల్లో కట్టిన వైన్ షాప్, చర్చ్ లకు అధికారుల అండ ఉందా?

దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం పై విహెచ్పి రాష్ట్...

view more..
Competitive Exams in India
Sports
view more..
National News
view more..