May 9, 2026 3:46 pm
*తెలుగు రాష్ట్రాల్లో స్వయం మేతావులకు గుండెపోటు వచ్చిందిట?*
*వాళ్ళకి సందేశ్ ఖాలీ కనపడదు, ఆర్జీ కార్ మర్డర్ కనపడవు.*
*50 ఏళ్లుగా నరకంలోనే ఉంది: మాజీ డిజిపి డా బిఎన్ రమేష్*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 09, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ లోని కోలకతా వేదిక నుంచి అమీ. .. సువెందు అధికారి అని పదాలు వినపడగానే శనివారం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, లోని చాలామందికి గుండెపోటు వచ్చేసినట్టు తెలుస్తోంది. గత పాలకులకు వీళ్ళు తొత్తులు అనుకుంటే మహాతప్పు. వీళ్ళు కడుపుమంట అంతా భారతీయ జనతా పార్టీ కి వ్యతిరేకం, భారత ప్రధాని నరేంద్ర మోడీ అంటే కడుపుమంట. వీళ్లల్లో అధికులు స్వయం ప్రకటిత మేతావులు, హిందూ వ్యతిరేక శక్తులు, సెక్కులర్ నక్కలు. ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిని పట్టించుకునే సమయం, తీరిక బీజేపీ కి లేవు. వాళ్ళ ఉనికి ని తెలియచేసుకునేందుకు కనిపించిన ప్రతీ మైకు ముందు తమ కడుపుమంట వ్రెళ్ళగక్కుతున్నారు. .
భారత దేశంలో అత్యంత ప్రమాదకర ఘటనలు జరుగుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. గత ఏడు దశాబ్దాలుగా అక్కడ జరుగుతున్నా అరాచకాలను, మహిళలపై పట్టపగలే అత్యాచారాలను, భరించలేని స్థానిక ప్రజలు 2026 ఎన్నికల్లో కమ్మునిస్థులకు, తృణమూల్ ఖాన్ గ్రెస్ సహా ఖాన్ గ్రెస్ లాంటి అన్ని పార్టీలకు గట్టిగా బుద్దిచెప్పారు. దీని ఫలితంగా బీజేపీ కి 207 సీట్లు ఇచ్చారు. టిఎంసి కి 80 సీట్లు, ఖాన్ గ్రెస్ కి 2 సీట్లు, ఇచ్చారు. దశాబ్దాల కాలం పాలించిన కమ్యూనిస్ట్ లకు డిపాజిట్లు కూడా రాలేదు.
దీంతో ఆంధ్ర లోని స్వయంప్రకటిత మేథావులు, ( వీళ్ళ సంఘం లో రెండో సభ్యుడు లేడు, ఎందులో మేతావో తెలియదు) తెగ విషయం క్రక్కుతున్నాడు. ఇతనికి మద్దతుగా ఆ ఒడిన పార్టీల చెంచాలు సోషల్ మీడియా వేదికగా ఎన్నికల సంఘం పై దారుణంగా విషం క్రక్కుతున్నారు. ఈవీఎం లు మోసం చేశాయని, బీజేపీ, మోడీ బెంగాల్ ని మోసం చేసారంటూ తెగ ఫీల్ అవుతున్నారు. గత 7 దశాబ్దాలుగా బెంగాల్ లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు వీళ్ళకి కనపడలేదు. సందేశ్ ఖాళీ లో షాజహాన్ ఖాన్ నేరుగా పార్టీ కార్యాలయంలోనే మహిళలపై చేసిన అఘాయిత్యాలు, మట్టుపెట్టడాలు, కోలకతా మహా నగరం నడిబొడ్డులో ఆర్ జి కార్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ పై పట్టపగలు జరిగిన అఘాయిత్యం, హత్య లు ఈ ఉత్తుత్తి మేతావులకు కనపడలేదు.
వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సువెందు అధికారి ప్రకటన చెయ్యగానే కలుగులోని ఎలకల్లా ఒక్కసారిగా ఈ హిందూ వ్యతిరేక శక్తులన్నీ రోడ్డెక్కి గుండెలు బాదుకుంటున్నాయి.
అలాంటిది శనివారం సువెందు అధికారి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చెయ్యగానే ఇక్కడ చాలా గుండెలు బాదేసుకున్నారు.
సెక్రటేరియట్ లో సంబరాలు :
అదే క్రమం లో బెంగాల్ లో ప్రభుత్వం పడిపోగానే ప్రభుత్వ సచివాలయంలో వందలాది మంది ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు అంటే గత ప్రభుత్వం ఉద్యోగులను ఎంతగా నరక బాధలు పెట్టిందో తెలుస్తోంది. బెంగాల్ లో హిందువులు అత్యంత మైనారిటీలుగా బ్రతుకులు ఈడ్చారు అనడానికి నిదర్శనం. .. బెంగాల్ లోని హిందూ దేవాలయాలకు తాళాలు వెయ్యడమే. కోర్టు లు ఆదేశం ఇచ్చినా... ఈ గుళ్ళు తెరిస్తే హిందువులను నడిరోడ్డుమీదే చంపేస్తాం అని బెదిరించిన ఘటనలు ఈ ఉగ్రమేతావులకు కనపడలేదు. వీళ్ళ కార్యాచరణ పరిశీలన చెయ్యవలసిన అవసరం ఉండనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
మాజీ డిజిపి రమేష్ సంచలన వ్యాఖ్యలు:
బెంగాల్ లో గత పాలకుల హయం లో జరిగిన దుర్ఘటనలు, అఘాయిత్యాలను మాజీ డిజిపి డా. రమేష్ ఒక మీడియా డిబేట్ లో వివరించారు. గత 50 ఏళ్ళ నుంచి అన్యాయాలు, అక్రమాలు విస్తృత కృత్యాలు జరిగాయన్నారు. గత మూడు దశాబ్దాలుగా బెంగాల్ లోనే ఉన్నామని, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని తెలిపారు. సందేశ్ ఖాలీ, ఆర్ జి కార్ లాంటి ఘటనల వెనుక కార్యాచరణ ఎంత భయంకరం గా ఉందొ తెలిపారు. ఆర్ధిక వనరులపై చావుదెబ్బ కొట్టి, పరిశ్రమలను తరిమికొట్టారన్నారు. అభయ ఘటనలో 500 మంది పోలీసులను పంపి, ఆ శరీరాన్ని ని హైజాక్ చేసి, 10 లక్షలు పంపి, మరో 5 లక్షలు ఇఛ్చి కేసుని బయటకు రాకుండా చేశారన్నారు. కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను చేశారన్నారు. అదే గుండాలు, మే 4 తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడతాడో మెం చూస్తాం అంటూ నేరుగా కేంద్ర పొలిసు బలగాలకు హెచ్చరిక జారీ చేశారంటే. .. బెంగాల్ లో స్థితి ఎలా ఉందొ తెలుస్తోందన్నారు. ఈ డీ చర్యలను సైతం అడ్డుకుని, రాజ్యాంగ వ్యవస్థ కార్యాచరణని అడ్డుకున్నారని, వాటిని ప్రక్షాళన చెయ్యవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను సరిదిద్దడానికి కొంత సమయం పడుతుందని, రాబోయే ఐదేళ్లు కత్తిమీద సాములాంటిదన్నారు.
బెంగాల్ చరిత్రలో 25 లక్షలకు మంది పైగా జనం మొట్టమొదట సారి పోలింగ్ బూత్ లను చూసింది ఈ 2026 ఎన్నికల్లోనే అని అన్నారు .
యోగి, బాబు, హాజరు :
సువెందు అధికారి ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్య నాధ్, చంద్ర బాబు నాయుడు, రేఖ గుప్త, సహా ప్రముఖులు హాజరయ్యారు.
May 5, 2026 11:35 pm
*రైల్వే జోన్ గెజిట్ పై ఆంధ్ర బీజేపీ నేతలకే పట్టింపు లేదాయె*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 05, 2026 (డిఎన్ఎస్ ):* అన్ని చోట్ల బీజేపీ గెలుస్తున్నా. . . ఆంధ్ర బీజేపీ కి కనీసం పట్టింపు లేకుండా పోయాయి. అత్యంత ప్రమాదకరమైన పశ్చిమ బెంగాల్ లో పోరాడి గెలిచినా బీజేపీ గురించి ఆంధ్ర లో నాయకులూ చంకలు గుద్దుకుంటున్నారు. ఎప్పుడూ ఎదురింట్లో పెళ్లి కి వీళ్ళు చప్పట్లు కొట్టడం తప్ప, వీళ్ళింట్లో పెళ్లి చెయ్యాలి అనే జ్ఞానము లేకుండా పోయింది. ఇప్పడి వరకూ ఆ సోయి రాలేదు. ఇక ముందు వస్తుందన్న నమ్మకం పార్టీ క్యాడర్ లో పోయింది.
నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి ఆంధ్ర బీజేపీ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారు తప్ప, కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు చేసిన అద్భుత మేలు గురించి ఒక్కడు నోరు ఎత్తిన పాపాల పోలేదు.
కొన్ని దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ మంగళ వారం అధికారికంగా గెజిట్ విడుదల అయ్యింది. ఇది బీజేపీ చరిత్రలో అత్యంత పెద్ద విజయం. అయితే దీన్ని ప్రచారం చెయ్యడానికి ఒక్క బీజేపీ నేత, ఆఖరికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సైతం ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మిఠాయిలు పంచాడు తప్పితే. . సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అధికారిక ప్రకటన గురించి నోరు విప్పలేదు. ఇలాంటి వాళ్ళు నేతలు రాష్ట్ర నేతలు గా ఉంటె. . .పార్టీ అడుక్కు తినక అధికారం లోకి వస్తుందా అని సగటు పార్ట్ క్యాడర్ ప్రశ్నిస్తోంది.
ఈ ప్రకటన గతంలోనే వఛ్చినప్పడికి. . .అధికారిక ఉత్తర్వులు మాత్రం మంగళ వారమే వచ్చాయి. దీని ప్రకారం జూన్ 1 , 2026 నుంచి అమలు లోకి రానుంది. దీని కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పోరాటాలు జరిగాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి, విశాఖ లో సభ పెట్టి మరీ రైల్వే జోన్ గురించిన ప్రకటన విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతటి గొప్ప విషయాన్నీ ప్రకటించుకునే స్థాయి ఆంధ్ర బీజేపీ నాయకులకు లేకుండా పోయింది అంటే. .
ఈ ప్రకటన విడుదలయ్యే సమయానికి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ విజయవాడ కార్యాలయం లోను, విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు, తన కార్యాలయం లోనూ, విశాఖ నగర అధ్యక్షుడు పరశురామ రాజు నగర పార్టీ కార్యాలయంలోనూ బెంగాల్ విజయం పై సంబరాలు చేసుకుంటున్నారు. అయితే విశాఖ రైల్వే జోన్ గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ నేతల వైఖ రి చూస్తే ఈ రాష్ట్రంలో బీజేపీ ఏ స్థాయి లో అడుగంటిపోయిందో తెలుస్తోంది.
| Date : |
| Ruthuva : |
| Nakshatram : |
| Week : |
| Masam : |
| Amrithakalam : |
| Year : |
| Pakshamvarjam : |
| Samsthram : |
| Ayanam : |
| Tithi : |
| Durumuhratam : |

సింహాచలం క్షేత్రం లో ప్రబంధం పోస్ట్ లేకపోడాని...
May 20, 2026 2:56 pm
*గుళ్లో అర్చనల్లో పాంచరాత్రం, దివ్య ప్రబంధం వినిపించాలి*
*వేదపాఠశాలలో ఆ రెండు కోర్సులు లేవు? గుళ్లో వాటి పోస్టుల...
May 17, 2026 3:59 pm
May 16, 2026 1:06 pm
May 12, 2026 1:43 pm

May 10, 2026 5:49 pm
*15 ఏళ్లుగా టిఎంసీ గూండాల కబ్జా లో సిపిఎం, ఖాన్ గ్రెస్ ల పార్టీ ఆఫీసులు*
*ఒక్కొక్కటిగా నేడు స్వాధీనం అవుతున్న సంఘటనలు*
(DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*
*విశాఖపట్నం, మే 10, 2026 (డిఎన్ఎస్ ):* పశ్చిమ బెంగాల్ లో బీజేపీ అధికారం లోకి రావడం పట్ల సనాతన హిందూ, బీజేపీ వర్గాల కంటే కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ లు ఎక్కువగా సంతోషపడుతున్నట్టు తెలుస్తోంది. సూర్ఫణఖ పరిపాలనలో గత 15 ఏళ్ళ నుంచి సిపిఎం, ఖాన్ గ్రెస్ పార్టీ ల కార్యాలయాలను త్రిణమూల్ ఖాన్ గ్రెస్ గూండాలు కబ్జా చేయడం జరిగింది. ఈ 15 ఏళ్ళ ల్లో కనీసం ఈ ఆఫీసుల గుమ్మం లోకి కూడా ఈ రెండు పార్టీల వాళ్ళు అడుగు కూడా పెట్టలేకపోవడం అత్యంత దారుణం. ఒక్కసారిగా ప్రజల్లో ప్రజా ఉద్యమం రావడం, భారతీయ జనతా పార్టీ అధికారం లోకి రావడం తో ప్రతిపక్ష పార్టీలైనా కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ పార్టీల సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. 15 ఏళ్లుగా టిఎంసి గూండాల కబ్జాలో ఉన్న తమ పార్టీ కార్యాలయాలను ఉత్సాహంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంబరాలు పశ్చిమ బెంగాల్ మొత్తం కనపడింది. గతం లో ఇదే ఖాన్ గ్రెస్, కమ్యూనిస్ట్ ల పాలనలో హిందువులు ప్రత్యక్ష నరకం అనుభవించిన విషయం తెలిసిందే. ఇలాంటి వాళ్ళకే నరకం చూపించారంటే టిఎంసీ పరిపాలన లో ఎన్ని అకృత్యాలు జరిగాయో తెలుస్తోంది.
పార్టీల అభిమతం వేరు అయినా, వాళ్ళు గెలవడం వల్లనే వీళ్ళ పార్టీ కార్యాలయాల్లోకి అడుగు పెట్టగలిగాం అని ఆఫ్ ది రికార్డు లో తెలియచేస్తున్నారు. ఇన్నాళ్లు రాక్షస పాలనలో ఎన్నో అవస్థలు పడ్డామని, కనీసం తమ పార్టీ అభ్యర్థులకు ప్రచారం కూడా చెయ్యలేని దుస్థితి లో ఉన్నామని తెలియచేస్తున్నాయి. నేటి ప్రజా ఉద్యమం పశ్చిమ బెంగాల్ భవితకు తొలిబాటగా అందరూ అభివర్ణిస్తున్నాయి.