తాజా వార్తలు
  • శ్రీ రమ్య తిరుమల లో ముక్కోటి కి భక్తులకు పూర్తి ఏర్పాట్లు

    Dec 29, 2025 5:28 pm

    *జగదాచార్యులు చిన్న జీయర్ మంగళాశాసనం చేసిన దివ్య సన్నిధి* 

    *30 న ఉత్తర ద్వార దర్శనం, అధ్యయనోత్సవాలు*  

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*

    *విశాఖపట్నం / శ్రీకాకుళం, డిసెంబర్ 29, 2025 (డిఎన్ఎస్):* సంకల్ప సిద్ది లభించే దేవాలయంగా ఖ్యాతిగాంచిన శ్రీకాకుళం లోని అరసవల్లి రోడ్ లో గల శ్రీ రమ్య తిరుమలలో ముక్కోటి ఏకాదశి కి అద్వితీయమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని  ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసారు. గత కొన్నేళ్లుగా ఎంతో శ్రద్దగా అన్ని ఉత్సవాలను శ్రీపాంచరాత్ర ఆగమ విధానంలో నిర్వహిస్తున్నట్టు అర్చకులు కరి వేణుమాధవ్ రంగనాధ్ తెలియచేసారు. ఈ నెల  30 న ఉదయం 5 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని, పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. స్వచ్చంద కార్యకర్తలు, ప్రతి భక్తునికి ప్రశాంతంగా దర్శనం లభించేలా సేవలు అందించనున్నట్టు తెలిపారు.  వృద్దులు, మహిళలకు, చిన్నారులకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 
     
    అధ్యయనోత్సవాలు.. ప్రబంధ పారాయణ:

    వైకుంఠ ఏకాదశి పర్వదినోత్సవాన్ని పుర్సకరించుకుని  శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన దివ్య ప్రబంధ తిరువాయ్ మొజి సేవాకాలం అనుసంధానం చేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాల్లో నిర్వహించే ఈ అధ్యయనోత్సవాలు ఈ దేవాలయం సైతం నిర్వహించడం గమనార్హం. వందలాది మంది భక్తుల రాకతో ఆలయం ఈరోజున జనసందోహంగా మారుతుంది. ప్రతి శనివారం స్వామికి, శుక్రవారం అమ్మవారికి అభిషేకం, అర్చనలు జరుగుతున్నాయి. ప్రతి శ్రవణ నక్షత్రం రోజున స్వామి వారికీ తిరుకల్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.  

    జగదాచార్యులు చిన్న జీయర్ స్వామి మంగళాశాసనం...:

    జగదాచార్యులు, అపరరామానుజులు గా ఖ్యాతిగాంచిన త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు ఇటీవలే ఈ ఆలయాన్ని దర్శించి శ్రీవెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి అమ్మవార్లకు మంగళాశాసనం చేయడం జరిగింది. ఆలయ ఆవిర్భావాన్ని తెలుసుకుని, అర్చకుల భక్తి, చిత్తశుద్ధికి సంతోషించారు. ఆలయ అభివృద్ధికి మరిన్ని సూచనలు చేయడం జరిగింది. 

    గణపతి సచ్చిదానంద స్వామి అనుగ్రహం..

    అపర దత్తస్వామి స్వరూపులు మైసూరు దత్తపీఠం గురువులు గణపతి స్చచిదానంద సరస్వతి కూడా ఇటీవలే ఈ ఆలయాన్ని దర్శించడం జరిగింది. 

    యతీశ్వరులు ఎందరో ఎందరెందరో..

    శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని దశదిశలా వైభవంగా విస్తరింపచేస్తున్న యతీశ్వరులు త్రిదండి అహోబల జీయర్ స్వామి వారు, త్రిదండి దేవనాథ జీయర్ స్వామివారు, త్రిదండి శ్రీరామచంద్ర జీయర్ స్వామివారు ఈ శ్రీరమ్య తిరుమల దేవాలయాన్ని దర్శించి, స్వామికి మంగళాశాసనం చేసారు.
    శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులు చిలకపాటి నరసింహాచార్యులు ఆలయాన్ని దర్శించి, యంత్ర ప్రతిష్ట స్వయంగా జరిపించారు. 
    పెద్దల అనుగ్రహంతో, భక్తుల సహకారంతో ఆలయం లో వార్షికోత్సవాలు, ధనుర్మాస వేడుకలు, అధ్యయనోత్సవాలు, వైభవంగా జరుగుతున్నాయి. 

     

  • వైష్ణవ ఆలయాల్లో పగల్ పత్తు తో అధ్యయనోత్సవాలు ప్రారంభం

    Dec 20, 2025 8:09 pm

    దివ్యసాకేతం, తిరుమల, సింహాచలం, వానమామలై పీఠాల్లో..

    *(DNS Report : Sairam CVS, Bureau Chief, Vizag)*

    *విశాఖపట్నం, డిసెంబర్ 20, 2025 (డిఎన్ఎస్):* శ్రీవైష్ణవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది ధనుర్మాసము. ఈ నెల 16 నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో మరింత ప్రాధాన్యమైనవి అధ్యయనోత్సవాలు. వైకుంఠ ఏకాదశి కి ముందు 10 రోజులు, తర్వాత 10 రోజుల పాటు నాలాయిర దివ్య ప్రబంధం అనుసంధానం జరుగుతుంది. ముందు 10 రోజులు ఉదయం వేళల్లో పగల్ పత్తు గాను, వైకుంఠ ఏకాదశి తర్వాత 10 రోజులు రాపత్తు గానీ ఈ అధ్యయనోత్సవాలు. వేడుకలు నిర్వహిస్తుంటారు. 

    శ్రీరంగం, తిరువల్లిక్కేణి, కాంచీపురం, మేల్కొటే, తాడిత దక్షిణ భారత దేశ క్షేత్రాల్లోను,   తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శ్రీవైష్ణవ క్షేత్రాలైన తిరుమల, భద్రాచలం, సింహాచలం, శ్రీకూర్మం, తెలంగాణ సికింద్రాబాద్ లోని వానమామలై పీఠం ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో..  సహా అన్నిప్రధాన సంప్రదాయ దేవాలయాల్లో అత్యంత వైభవంగా ఈ అధ్యయనోత్సవాలు. జరుగుతాయి. 

    ఈ నెల 19 న ఈ అధ్యయనోత్సవాలు. మొదలయ్యాయి. వీటిలో ముదలాయిరమ్ ( పెరియాళ్వార్ తిరుమొజి), పెరియ తిరుమొజి, ఇయర్ప,  తిరువాయ్ మొజి లోని 4000 తమిళ పాశురాలను రాగయుక్తంగా స్వామికి విన్నవించడం జరుగుతుంది. శ్రీరంగం లాంటి క్షేత్రాల్లో అరయర్ ఉత్సవం గా వీటిని నిర్వహిస్తారు. వైష్ణవ స్వాములు, నృత్య గానాలతో తిరువీధి ఉత్సవాలు, నిర్వహిస్తారు. ఈ క్షేత్రాల్లో ఉత్సవ పెరుమాళ్ళ పల్లకిని కేవలం వైష్ణవ స్వాములు మాత్రమే మోయడం జరుగుతుంది. 

    దివ్యసాకేతం లో..

    పరమహంస పరివ్రాజకాచార్య, పద్మభూషణ్ పురస్కార గ్రహీత త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో భాగ్యనగరంలోని దివ్యసంకేతం లో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేదవిద్యార్థులు, అధ్యాపకులు సుస్వర గానంలో  నాలాయిర దివ్య ప్రబంధం అనుసంధానం చేస్తున్నారు.. 

    ఆంధ్ర ప్రదేశ్ . . .. 

    అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస పెరుమాళ్ వేంచేసిన తిరుమల, శ్రీ వరాహ లక్ష్మి నృసింహ క్షేత్రం, సింహాచలం క్షేత్రాల్లో అధ్యయనోత్సవాలు. శుక్రవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. 

    తిరుమలలో...

    తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు.
    కాగా ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల పెద్దజీయ‌ర్‌‌స్వామి, తిరుమల చిన్న జీయ‌ర్‌‌స్వామి, జీయర్ మఠం వైష్ణవ స్వాములు,  ఆలయ వైదిక సిబ్బంది పాల్గొన్నారు..

    తెలంగాణ సికింద్రాబాద్ లోని...

    వానమామలై పీఠం ఆధ్వర్యవం లో నిర్వహించబడుతున్న సికింద్రాబాద్ లోని  శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో.. అధ్యయనోత్సవాలు సంప్రదాయంపరంగా మొదలయ్యాయి. వాటి వివరాలు: వైకుంఠ ఏకాదశి కు ముందు పగల్ పత్తు, తర్వాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. 
    మొదటి రోజు : తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి 1, 2
    రెండవ రోజు: పెరియాళ్వార్ తిరుమొళి 3, 4, 5
    మూడవ రోజు: తిరుప్పావై, నాచియార్ తిరుమొళి
    నాల్గవ రోజు: పెరుమాళ్ తిరుమొళి, తిరుచంద వృత్తం
    ఐదవ రోజు: తిరుమలై, తిరుప్పల్లియాగేచూచి, అమలా నధిపిరన్, కన్నినున్ సిరుతంబు
    ఆరవ రోజు: తిరుమొళి 1, 2
    ఏడవ రోజు: తిరుమొళి 3, 4
    ఎనిమిదవ రోజు: తిరుమొళి 5, 6, 7
    తొమ్మిదో రోజు: తిరుమొళి 8, 9
    పదవ రోజు: తిరుమొళి 10, 11, తిరుకురుందండకం, తిరునెడున్‌హండకం

    తదుపరి రాపత్తు ఉత్సవాలు : 
    మొదటి రోజు: తిరువాయిమొళి 1
    రెండవ రోజు: మొదటి తిరువంతడి. తిరువాయిమొళి 2
    మూడవ రోజు: రెండవ తిరువంతడి, తిరువాయిమొళి 3
    నాల్గవ రోజు: మూడవ తిరువంతడి, తిరువాయిమొళి 4
    ఐదవ రోజు: నాన్ముగన్ తిరువంతడి, తిరువాయిమొళి 5
    ఆరవ రోజు: తిరువృత్తం, తిరువాయిమొళి 6
    ఏడవ రోజు: తిరువాసిరియమ్, పెరియ తిరువంతడి, తిరువాయిమొళి 7
    ఎనిమిదవ రోజు: తిరువెక్కుత్తిరిక్కై, సిరియ తిరుమడల్, తిరువాయిమొళి 8
    తొమ్మిదవ రోజు: పెరియ తిరుమడల్, తిరువాయిమొళి 9
    పదవ రోజు: తిరువాయిమొళి 10, రామానుస శతజయంతి, ఇయాల్ శత్రు, తిరుప్పల్లాండు 

    ఈ ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యమైనది నమ్మాళ్వార్ల పరమపాదోత్సవం తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.  పగల్ పత్తు సందర్భముగా ప్రతి రోజు ఉదయం దేవాలయంలోను, రాపత్తు లో సాయంత్రం వేళల్లో  శ్రీస్వామివారి తిరువీధి ఉత్సవములు జరుగుతాయి. 
     

  • ధనుర్మాస వేడుకలకు శ్రీరంగగిరి సన్నిధి లో వైభవంగా ఏర్పాట్లు

    Dec 15, 2025 6:23 pm

    *16 నుంచి ధనుర్మాసం, డిసెంబర్ 30 న ముక్కోటి: డా ధనుంజయ్*

    *14 న గోదారంగనాధుల కళ్యాణం తో వ్రతం పరిపూర్ణం: * 

    *(DNS రిపోర్ట్ :  సాయిరాం CVS ,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

    *విశాఖపట్నం/ భాగ్యనగరం, డిసెంబర్ 15, 2025 (డిఎన్ఎస్):* ఈనెల 16 నుంచి ప్రారంభమవుతున్న ధనుర్మాసోత్సవ వేడుకలకు మౌలాలి లోని శ్రీరంగగిరి సన్నిధి దేవాలయంలో వైభవంగా ప్రారంభించనున్నట్టు ఆలయ చైర్మన్, ధర్మకర్త డాక్టర్ ధనుంజయ్ గోవర్ధన తెలియచేసారు. 

    దేశ విదేశాల్లోని అన్ని వైష్ణవ క్షేత్రాలు, ఆలయాలు, గృహాల్లో ధనుర్మాసానికి స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీవైష్ణవ సంప్రదాయ పరంగా జరిగే ఈ వేడుకల్లో  ప్రారంభమవుతున్నాయి. దేవాలయాల్లో నిర్వహించే సుప్రభాతం స్థానం లో ఆండాళ్ రచించిన  30 తిరుప్పావై పాశురాలు చదవడం జరుగుతుంది. తెల్లవారు ఝామునే ఇళ్లలోనూ, గుళ్లల్లోనూ ఈ పాశురాలు వినిపించనున్నాయి. 

    ధనుర్మాసం పేరు చెప్పగానే భక్తులందరిలోనూ ఎంతో ఉత్సాహం కలుగుతుంది. కలియుగం ప్రారంభం అయిన 51 ఏళ్ళ ప్రాంతంలో తమిళనాడు లోని విల్లిపుత్తూర్ పట్టణం లో జరిగిన వాస్తవ ఘటన మానవాళి మనుగడనే మార్చేసింది. ఒక నిరుపేద శ్రీవైష్ణవ బ్రాహ్మణుడు పెరియాళ్వార్ లకు తులసి వనం లో లభించిన ఆండాళ్, సాక్షాత్ శ్రీకృషుణ్ణే వివాహం చేసుకోవాలి అనే సంకల్పంతో తిరుప్పావై పాశురాలను తానూ రచించి ఆలపించి, అనంతరం ఏకంగా శ్రీరంగంలో సాక్షాత్ శ్రీ రంగనాధున్ని వివాహం చేసుకున్న చారిత్రక ఆధారాలు ఉన్నాయి.  నాటి నుంచి ప్రతి గ్రామం లోనూ ఈ ధనుర్మాసం లో తిరుప్పావై పాశురాలు చదవడం, అమ్మవారికి రంగనాధులకు కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. 

    తిరుమల, సింహాచలం , యాదాద్రి, మంగళగిరి, శ్రీరంగం, సహా  ప్రతి శ్రీవైష్ణవ క్షేత్రంలోనూ ఈ ధనుర్మాసం నెలరోజుల పాటు అత్యంత వైభవంగా వేడుకలు జరుపుతుంటారు. ఉదయాన్నే 5 గంటల ప్రాంతంలో తొందరడిప్పొడి ఆళ్వార్లు రచించిన తిరుప్పాళ్లి యేజుఛ్చి, ఆండాళ్ రచించిన తిరుప్పావై పాశురాలను విన్నపం చేసి, అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాద వితరణ చేయడం జరుగుతోంది.  ఈ క్రమం లోనే ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లోని దేవాలయాల్లో... ధనుర్మాస వేడుకలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

    శ్రీరంగగిరి సన్నిధిలో :. . .. 

    తెలంగాణ లోని భాగ్యనగరంలో గల మౌలాలీ కృష్ణా నగర్ శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి దేవాలయం లో మంగళవారం నుంచి ధనుర్మాసోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. ధను సంక్రమణం మధ్యాహ్నం 1:20 కి వస్తుండడంతో వేడుకలను ఆ సమయంలో ప్రారంభించనున్నట్టు ఆలయ చైర్మన్, ధర్మకర్త డాక్టర్ ధనుంజయ్ గోవర్ధన తెలియచేసారు. తిరుప్పావై మొదటి  పాశురం మన స్వామి సన్నిధిలో విన్నపం చేయడం జరుగుతుందని, బుధవారం ( డిసెంబర్ 17 నుంచి జనవరి 13 వరకూ) ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు  తిరుప్పావై గోష్ఠి మొదలవుంటుందని తెలిపారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు ఎందరో ఆలయాన్ని విచ్చేసి, స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటారని తెలిపారు. జనవరి 14 న ఉదయం శ్రీ గోదా రంగనాధుల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తామన్నారు.  

    మహా మహోపాధ్యాయ డా. సముద్రాల రంగ రామానుజాచార్యులు, డా. టికే చూడామణి అమ్మగార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో వేడుకలు జరుగుతున్నా ఈ ఆలయంలో ప్రతి రోజు సాయంత్రం భక్తులచే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, జరుగుతుందన్నారు. 
    విశేష కార్యక్రమాలు: ఈ నెల 17 న కుచేల దివసం, 21 న లక్ష్మి హోమం,  28 న  పుష్పయాగం, 30 న ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, 31 నుంచి  జనవరి 4 వరకూ అధ్యయనోత్సవాలు, జనవరి 3 వ తేదీన కుత్తు దీపం, జనవరి 4 న సౌభాగ్య వ్రతం (ముప్పత్తు మూవర్), నమ్మాళ్వార్ పరమపాదోత్సవం, జనవరి 8 న స్వామికి మంగళాశాసనం సందర్భంగా ప్రత్యేక హారతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 
       
    పరమహంస పరివ్రాజకాచార్య, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత, జగదాచార్యులు త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో భగవద్రామానుజాచార్యుల విగ్రహం మొట్టమొదటి సారిగా ఈ ఆలయ నిర్వహణలోనే మౌలాలి కూడలి వద్ద ప్రారంభించడం జరిగింది. నాటి నుంచి ఆ ప్రాంతం రామానుజ సర్కిల్ గా పేరు మారిందని డా. ధనుంజయ్ తెలిపారు. 

    ఈ దేవాలయాన్ని దర్శించిన వారిలో ఎందరో పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్నారు.  
     

Panchangam - Mar 6, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - Mar 6, 2026

ఆంధ్ర ప్రదేశ్
వాయు కాలుష్య నివారణకై ఎలక్ట్రిక్ వాహనాలు అవసరం:...

Nov 2, 2021 10:08 am

*కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య*

*(DNS Report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*  
 
*అమరావతి, నవంబర్ 01,  2021 (డిఎన్ఎస్):* ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మాట్లాడుతూ మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త వేరియంట్ రెట్రోసాను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి వాతావరణ పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు, ఆ దిశగా అవేరా సంస్థ అడుగులు వేయడం శుభపరిణామమన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ఎంచుకున్నందుకు అవేరా బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా అవేరా వ్యవస్థాపకుడు, సీఈవో డా. రమణ, కో ఫౌండర్ చాందిని చందన నాంది పలికారని వెంకయ్య నాయుడు అన్నారు. డా. రమణ మాట్లాడుతూ.. అధునాతన ఫీచర్లతో రూపొందిన రెట్రోసా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 148 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని వెల్లడించారు. బ్లూటూత్ ను అనుసంధానించడం ద్వారా బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ శాతం, వోల్టేజ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. దేశంలోనే ఈ శ్రేణి వాహనాల్లో రెట్రోసా అత్యధిక వేగాన్ని కలిగి ఉందని చెప్పారు. అవేరా ఇప్పటికే యూరప్, ఏషియా పసిఫిక్ దేశాలకు వాహనాల ఎగుమతి చేస్తోందని వివరించారు. 2022 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 అవేరా పాయింట్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోందని డా. రమణ పేర్కొన్నారు. కార్యక్రమంలో అవేరా ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

view more..
రాజకీయo
a...

Jan 13, 2026 5:48 am

a

view more..

వీడియోలు
International
కెనడాలో - 21 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు ...

Feb 14, 2020 11:41 pm

హిమ పర్వతాల నడుమ మధ్య జనజీవనం. . 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

బ్రాంప్టాన్ / విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : ఉత్తర అమెరికా à°–à°‚à°¡à°‚ లోని కెనడాలో à°—à°² బ్రాంప్టాన్ (రాజధాని టొరంటో కు సమీపంలోనే ) నగరం లో ఫిబ్రవరి 14 ఉదయం 6 à°—à°‚à°Ÿà°² సమయానికే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు -21 డిగ్రీలు నమోదు చేసుకోవడం తో నగరం మంచుపర్వతాలతో మునిగిపోయింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన భారతీయులు à°…à°§à°¿à°• శతం ఉండే à°ˆ నగర వీధులన్నీ మంచు ఖండాలతో నిండి పోవడం తో స్థానిక ప్రభుత్వ సిబ్బంది వీటిని తొలగించే పనిలో పడింది. ఇళ్లల్లోని కుళాయిల్లో నీళ్లు సైతం మంచుగా మారిపోవడం గమనార్హం. à°ˆ క్రమం లో జనజీవన స్రవంతి à°•à°¿ ఆటంకం ఏర్పడింది. విధులకు, కళాశాలలకు వెళ్లేవారు భారీ ఎత్తున ఉన్ని దుస్తులు ధరిస్తే గానే ఇంటి నుంచి కాలు బయట పెట్టె పరిస్థితి లేదు.  à°µà°°à±à°·à°‚ కురినట్టుగా మంచు ఏకధాటిగా పడుతుండడం గమనార్హం. ఇళ్ల బయట పార్కింగ్ చేసే కార్లు సైతం హిమపాతాల్లో కూరుకు పోతుండడం గమనార్హం. మైదాన ప్రాంతాల్లో భారీగా కురిసిన మంచు పలు ఆకారాలు దర్శనమిస్తోంది. 
అయితే భారతీయ వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉండే ఉష్ణోగ్రతలు కావడంతో ఎక్కువ మంది భారతీయులు à°ˆ సమయంలోనే ఇక్కడకు చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. 

...

view more..
Movie News
fggfrgfg...

Jan 13, 2026 5:48 am

fgfgfgf

view more..
విశాఖ వార్తలు
చెడు ప్రభావం మనిషిపై పడకూడదనే గ్రహణ నియమాలు ప...

Mar 2, 2026 9:20 pm

*3 నాటి గ్రహణానికి విడుపు స్నానం ఒక్కటే, పట్టు స్నానం ఐఛ్చికమే*

*ఋషులు, పెద్దల కంటే మేలు కోరే మేధావులు సమాజంలో ఉన్నారా?*...

view more..
Competitive Exams in India
view more..
Sports
x

Dec 16, 2024 4:08 pm

x

view more..