తాజా వార్తలు
  • బొద్దింకలను అడ్డుకోవాలంటే బీజేపీ లో దేశవ్యాప్త ప్రక్షాళన తప్పదు 

    May 26, 2026 1:57 pm

    *ధన బలమే పార్టీ పదవికి అర్హతా? పనిచేసేవాడికి పనిచేసేవాడికి గుర్తింపు ఉండదా ?*

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 26, 2026 (డిఎన్ఎస్ ):* గత రెండు వారాలుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న బొద్దింకలు విపక్షం వే  అనుకునే సామాన్య జనానికి జ్ఞానోదయం కల్గించే సందర్భాలు వెలుగు చూస్తున్నాయి.  
    ఇలాంటి బొద్దింకలను అడ్డుకోవాలంటే. .. భారతీయ జనతా పార్టీ లో దేశవ్యాప్తంగా ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని నిర్లక్ష్యం చేసి, ధనబలం ఉన్నవాళ్ళకి పార్టీ పదవులు ఇస్తే జరిగే పరిణామమే ఇది. 

    మోడీ విజయ విహారాన్ని అడ్డుకునేందుకే:

    దేశ విదేశాల్లో  భారత దేశ ఖ్యాతి ని ఇనుమడింపచేసేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ విజయవిహారాన్ని అడ్డుకునేందుకు వెలుగులోకి వచ్చిందే బొద్దింకలు జనతా పార్టీ.  ఇది కేవలం తాటాకు చప్పుళ్ళు చెయ్యడానికి,   యువతను తప్పుదారి పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీలు మొదలు పెట్టాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీని వెనుక దేశ విద్రోహ శక్తులు, విదేశీ విధ్వంస శక్తులతో పాటు,  లపాకిస్తాన్  ఉగ్రవాద శక్తులు ఉన్నాయనే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. అయితే.  .  ఇంతవరకూ ఇది కేవలం సోషల్ మీడియా కు మాత్రమే పరిమితం అయ్యింది. దీన్ని కార్యాచరణ రూపం లోకి తీసుకు వచ్చే సత్తా విపక్షాలకు లేదంటూ అధికార కూటమి తెలియచేస్తోంది. 

    విపక్షాలకు అంత సత్తా ఉందా? :
    ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ప్రస్తుత నేతల్లో అగ్రస్థానం లో ఉన్న నరేంద్ర మోడీ ని గద్దె దింపే సత్తా విపక్షాలకు లేదు అనేది ఏనాడో తేలిపోయింది. అందుకే విదేశీ విద్రోహ శక్తులు, ఉగ్రవాద శక్తులతో చేతులు కలిపి, భారత దేశాన్ని చిన్నాభిన్నం చేసేందుకు విపక్షాలు చేతులు కలిపి బొద్దింకలుగా ఒక్క చోట చేరినట్టు ఘాటైన విమర్శలు వినిపిస్తున్నాయి. 
    అయితే వీళ్ళ తో పాటు కొన్ని స్వపక్ష శక్తులు  కూడా ఈ బొద్దింకలకు సహకరిస్తున్నాయా అనే అనుమానాలూ లేకపోలేదు.  మోడీ హవా ను తగ్గించేందుకు విపక్షాలు పంపిన వేగులు కూడా ప్రస్తుత పదవుల్లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. 

    అధ్యక్ష మార్పులే  నేల నాకించేసాయి..:

    ప్రధానంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్, అస్సోమ్ మినహా తమిళ్ నాడు, కేరళ సహా మిగిలిన చోట్ల పార్టీ ఆతీ గతీ లేకుండా పోయింది. దీనికి కారణం స్థానికంగా పార్టీలో జరిగిన కుట్రలు, కుతంత్రాలు అనే నమ్మకం ప్రజల్లోనే బలంగా ప్రచారంలోకి వెళ్ళింది.  ముఖ్యంగా తమిళ నాడు లో కొందరు ధూర్తుల చెప్పుడు మాటలు విని రాష్ట్ర అధ్యక్ష పదవి ని మార్చడం తో బీజేపీ ఘోరంగా దెబ్బతింది అనే విషయం బట్టబయలు అయ్యింది. అయినప్పటికీ పార్టీ అధిష్టానం లో ఎటువంటి మార్పు రాకపోవడంతో పాటు, క్షేత్ర స్థాయి లో పనిచేసే సామాన్య కార్యకర్తలకు సైతం ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వక పోవడం క్యాడర్ లో కూడా అసహనాన్ని పెంచింది. 

    అదే విధంగా తెలంగాణ లో సైతం పార్టీ ని అస్తవ్యస్తం చేస్తూ అధ్యక్ష పదవిని మార్చడం తో  క్యాడర్ లో అసహనం పెరిగిపోయింది. తద్వారా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా, ఓటు బ్యాంకు సైతం ఇతర పార్టీలకు తరలిపోయింది. దీంతో తెలంగాణ లో బీజేపీ తలా ఎత్తుకునే స్థితి లేకుండా అయ్యింది. 

    ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ బ్రతికే ఉందొ  లేక భూ స్థాపితం అయ్యిందో వాళ్ళకే తెలియకుండా పోయింది.  కనీసం ఒక వార్డ్ స్థాయి లో కూడా గెలవలేని అనామకుల చేతిలో పార్టీ పగ్గాలు పెట్టడంతో పార్టీ ని పూర్తిగా  నేల నాకించేశారు.  పేరుకే కూటమి ప్రభుత్వం లో ఉన్నాం అనే మాటే తప్ప, ప్రధాన పార్టీ కి తోక పార్టీ లాగా మారిపోయింది అనేది సగటు కార్యకర్తల అభిప్రాయం.  దశాబ్దాల తరబడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎవ్వరూ ప్రస్తుతం పార్టీ పదవుల్లో లేకపోవడం గమనార్హం.  ధనబలం ఉన్నవాళ్ళకి మాత్రమే పార్టీ లో పదవులు లభిస్తాయి అనే మాట ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ కార్యకర్తల్లో బలంగా నాటుకు పోయింది. 

    దశాబ్దాలు కష్టపడి పనిచేసినా, తగిన గుర్తింపు లేకుండా, అనామకులుగా ఉన్న వాళ్ళల్లో నిరాశ, నిస్పృహ  పేరుకుపోయి ఉన్నాయి. 
    ఇలాంటి తరుణంలో అసహనం కల్గిన స్వపక్షం వాళ్ళు సైతం బొద్దింకలు గుంపు ను అడ్డుకునే ప్రయత్నం చేయరు అనేది తెలిసిన విషయమే.  ఇది పూర్తిగా స్వయం కృతాపరాధమే. 

    త్రిప్పి కొట్టే నాధుడే కరువు :

    విదేశీ విద్రోహ శక్తుల సహకారం తో మొదలైన బొద్దింకలు విహారానికి అడ్డుకట్ట వేయవలసిన భాద్యత బీజేపీ లోని నిబద్దత కల్గిన ప్రతి కార్యకర్తకూ ఉంది. అయితే పార్టీ నియమాల ప్రకారం  పార్టీ పదవుల్లో ఉన్నవారే  సామాజిక మాధ్యమాల్లో గానీ, ప్రసార మాధ్యమాల్లో గానీ వ్యాఖ్యానించడాలు, విమర్శించి, అడ్డుకట్ట వెయ్యడాలు చెయ్యాలి. ప్రస్తుతం పదవుల్లో ఉన్నవాళ్ళకి అది చేతగాదు,  పైగా ధనబలం తో  పదవిలోకి వచ్చినవాడు,  తిరిగి సంపాదించేందుకు చూస్తాడు తప్ప, పార్టీ పరువు, ప్రతిష్టల కోసం ఏమి ఆలోచిస్తాడు అనేది సగటు కార్యకర్తల అభిప్రాయం. 
     

  • వెంకన్న కు ఏడు శనివారాల ముడుపుల దీక్ష తో సకల కార్యసిద్ధి

    May 24, 2026 10:20 pm

    *అద్భుతాలు సృష్టిస్తున్న అరసవల్లి శ్రీ రమ్య తిరుమల ఆలయం* 

    (DNS Report: *శాయిరామ్ CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*  

    *విశాఖపట్నం, మే 24, 2026 (డిఎన్ఎస్ ):* మానవ ప్రయత్నం ఎంత ఉన్నా పరమాత్ముని అనుగ్రహం లేకుంటే ఆశించిన ఫలితాలు అంతసులభంగా లభించవు.  స్వామి అనుగ్రహం పొందేందుకు అత్యంత సులభమైన విధానం శరణు వేడడమే.  అలా శరణు వేడిన భక్తులకు మంచిఫలితాలు అందిస్తున్న దేవాలయం లోని శ్రీ రమ్య తిరుమల శ్రీనివాసుడు. శ్రీకాకుళం పట్టణం లోని అరసవల్లి లో గల శ్రీ రమ్య తిరుమల దేవాలయం లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో కలిసి వేంచేసిన శ్రీ వేంకటేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు.  కుటుంబ సమస్యలు, సంతాన లేమి, విద్య లో ఉన్నతి, వ్యాపారంలో అభివృద్ధి, ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, మానసిక సమస్యలు తదితర కష్టాల నుంచి ఉపశమనం అందిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం స్వామికి కట్టే ముడుపులు.  ఎంతో నిరాశ తో ఈ ఆలయానికి వస్తున్న భక్తులు శనివారం దీక్షల తదుపరి వారి ఆనందానికి అంతులేకుండా ఉంది. 

    ఏడు శనివారాలు దీక్ష:

    ఏదైనా ఒక లక్ష్య సాధన కోసం సాగించే దీక్షే ఈ ఏడు శనివారాలు దీక్ష. నువ్వే తప్ప ఇత: పరంబు ఎరుగ  అన్న రీతిలో స్వామిపట్ల శరణాగతి వెడితే. . ఫలితం తప్పనిసరిగా లభిస్తుంది అనేందుకు వందలాది మంది భక్తులే నిదర్శనం.

    ఒక మంచి సంకల్పంతో ఆలయానికి వచ్చిన భక్తులు శనివారం స్వామి దర్శనం చేసుకుని, అర్చక స్వాములు చెప్పే సంకల్పంతో స్వామిని స్వయంగా అర్చించి, అనంతరం ఆలయంలోనే ముడుపులు కట్టడం జరుగుతుంది. ఆ రోజు ఉపవాసం చేసి, స్వామి పట్ల తదేక దీక్ష తో ఉండాల్సి ఉంటుంది. తదుపరి ఆరు శనివారాలు పాటు సాయంత్రం వేళల్లో ఆలయంలోనే శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, తదుపరి నిర్వహించే సామూహిక సహస్రనామ అర్చనలో పాల్గొనడం జరుగుతుంది. ఈ ముడుపులు అన్ని ఆలయంలో స్వామి ఎదుటే ఉంచడం జరుగుతుంది. ప్రతి భక్తుని ముడుపును ఒక క్రమ పద్దతిలో విడిగా పెట్టడం జరుగుతుంది. ఈ ఏడూ వారాల పాటు ఎటువంటి అపశ్రుతి ఆలోచనలు చెయ్యరాదు.  శ్రద్దగా ఈ దీక్ష పూర్తి అయిన తదుపరి ఆలయంలోనే దీక్ష విరమణ చేయవలసి ఉంటుంది.  
    ఇప్పడికే వందలాది మంది భక్తులు ఈ దీక్ష స్వీకారం చేయడం, తదుపరి సత్ఫాలితాలు పొందడం జరిగింది.  

    వివరాల కొరకు :  
    ఈ దీక్ష వివరాలు పొందేందుకు, ఇతర వివరాల కొరకు ఆలయ ప్రధాన అర్చకులు కరి వేణుమాధవ్ రంగనాధ్ ను 9440061940 నెంబర్ లో సంప్రదించవచ్చును. 

    ఆలయానికి చేరుకోవడం ఎలా?
    శ్రీకాకుళం బస్సు స్టాండ్ నుంచి అసరసవల్లి వెళ్లే మార్గం లో శ్రీ రమ్య తిరుమల దేవాలయం రోడ్డు ప్రక్కనే ఉంటుంది. బస్సు స్టాండ్ నుంచి ఆటోలు విరివిగా ఉంటాయి. 

  • దివ్య ప్రబంధం పాఠం - 1.2,  తిరువాయ్ మోజి 1 వ పత్తు 2 వ దశకం

    May 24, 2026 10:48 am

    https://youtu.be/1Ls9CSSw514

    *దివ్య ప్రబంధం ప్రతీ  పాశురం పదవిభజన తో పాటూ నేర్చుకుందాం*  

    *Learn Tiruvay Mojhi - 1.2,  1 st Pattu, 2 nd Dasakham Pada Vibhajana, recitation* 

    *దివ్య ప్రబంధం పాఠం - 1.2,  తిరువాయ్ మోజి 1 వ పత్తు 2 వ దశకం*

    నిర్వహణ: SV Info Services, Visakhapatnam,    

    Pls Subscribe , Share & Like *DnsDivineLive*

Panchangam - Jun 7, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - Jun 7, 2026

ఆంధ్ర ప్రదేశ్
view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
view more..
Movie News
view more..
విశాఖ వార్తలు
జన్ జి అంటే చెస్ విజేత ప్రజ్ఞ్యానంద అవుతాడా, దే...

Jun 7, 2026 3:54 pm

*దేశ విద్రోహులు జన్ జి ఎలా అవుతారు బొద్దింకలు అవుతారు ?*

*డీప్ స్టేట్, విద్రోహ శక్తులు, తేడా యూట్యూబర్ల పై చర్యలకు డిమా...

view more..
Competitive Exams in India
Sports
view more..
National News
view more..