తాజా వార్తలు
  • వైదిక రూల్స్ వైష్ణవ స్వాములకేనా? సింహాచలం అర్చకులకు వర్తించవా?

    Apr 21, 2026 4:52 pm

    *విదేశీయానం చేసినా అర్చకులు గర్భాలయ సేవ చెయ్యోచ్ఛ?* 

    *సింహాచల దేవాలయ అర్చకుల్లో విదేశాలకు వెళ్లినవాళ్ళెందరో?*

    *(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    
        
    *విశాఖపట్నం, ఏప్రిల్ 21, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన సింహాచల క్షేత్ర  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం ఎంతో మహోన్నతం. అలాంటి స్వామికి  ఉపచారాలు జరిపే వైదికులు ఎంతో  పవిత్రంగా ఉండాలి అనేది ఆగమశాస్త్ర సారం. అయితే ఈ రూల్స్ సింహాచలం క్షేత్రం అర్చకులకు ఏమాత్రం వర్తించవు అనేది సుస్పష్టంగా తెలుస్తోంది. 

    అయితే సింహాచల క్షేత్రం లో నిబంధనలు ఎవరికీ వారే మార్చేసుకుంటారు. నిన్నటి రోజున ( ఏప్రిల్ 20 , 2026)  జరిగిన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం అనంతరం స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. అయితే దీనిలో పాల్గొని సేవచేసే అవకాశం కేవలం సమాశ్రయణపరులైన శ్రీవైష్ణవ స్వాములకు మాత్రమే ఉంటుంది. దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. తలపై కేవలం శిఖ మాత్రమే ఉంచి, ముఖంపై ఉన్న మీసం, గెడ్డం కూడా పూర్తిగా క్షవరం చేయించాలి. దీనికి ఓపనం అని పేరు. అయితే వివిధ దేవాలయాల్లో పనిచేసే అర్చకులు దీక్షాధారులుగా తలపై  పూర్తి జుట్టు, ముఖం పై మీసం, గెడ్డం కలిసి ఉన్నవాళ్లు కూడా పాల్గొన్నారు. వీరందరినీ తక్షణం బయటకు వెళ్ళవలసిందిగా సింహాచల క్షేత్రం అర్చిక, వైదిక సిబ్బంది ఆదేశాలు జారీచేశారు. గర్భాలయానికి ముందు నీలాద్రి మండపం వద్ద వీరంతా నిలబడి, ఇలా పూర్తి జుట్టు ఉన్నవాళ్ళని, బయటకు లాగేసారు. వాళ్ళు దేవాలయ దీక్షలో ఉన్నామని చెప్పినా కూడా క్షమాపణ లేకుండా నిర్దాక్షిణ్యంగా బయటకు లాగేసారు. ఇంతవరకూ సంప్రదాయ నిబంధనలు వీరు అద్భుతంగా పాటించారు. భేష్. అయితే... ఇలా నిబంధనలు అమలు చేసిన సింహాచల క్షేత్ర అర్చకుల్లో చాలామంది ఇలా పూర్తి గెడ్డం, మీసం జుట్టుతో ఉండడం గమనార్హం..  

    ఈ రూల్స్ కేవలం సేవ చేసేవారికేనా? 
    ఈ ఓపనం నిబంధనలు  కేవలం సహస్ర ఘటాభిషేకం చెయ్యడానికి వచ్చిన వైష్ణవ స్వాములకేనా?  సింహాచలం దేవస్థానం అర్చకులకు ఈ నిబంధనలు వర్తించవా అనే ప్రశ్నలు వెల్లువవుతున్నాయి. 
    ఇదే ప్రశ్న వేసిన మిగిలిన వారిపై అర్చకులు మండిపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

    విదేశీ యానాం పై విమర్శలు...

    ఆగమ శాస్త్రం ప్రకారం సముద్రయానం ( విదేశీ యానం ) చేసిన వైదికులు, అర్చకులు, గర్భాలయంలో మూలవిరాట్ ను ముట్టుకుని అర్చనలు చెయ్యడానికి నిషేధం. అంటే. . సముద్రం దాటి ప్రయాణించి, విదేశాలకు ఏ విధంగా వెళ్లినా తిరిగి వచ్చిన తర్వాత గర్భాలయంలో ఎటువంటి సేవ చెయ్యకూడదు అని ఆగమం తెలియచేస్తోంది. అయితే ఈ నిబంధనలు సింహాచల క్షేత్రం లో ఒక్కటి కూడా అమలు కావడం లేదు. ప్రస్తుతం విధుల్లో ఉన్న అర్చక, వైదిక సిబ్బంది లో చాలా మంది సముద్రం దాటి, విదేశీయానం ప్రయాణం చేసినవాళ్ళే కావడం గమనార్హం. పైగా ఒక్కసారి కాదు, పలుమార్లు అమెరికా, కెనడా వంటి దేశాలకు వెళ్లి, నెలలకు నెలలు కాలం గడిపిన సందర్భాలు ఉన్నాయి. వీళ్లల్లో సామాన్య అర్చకుల నుంచి ప్రధాన అర్చకుల వారకూ ఉన్నారు అనేది వైదిక వర్గాల అభియోగం. 
    వీళ్ళు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికారుల వద్ద తమ పరపతిని వాడి, ప్రలోభపెట్టో, బ్రతిమాలో, ఇంకే విధంగానే, ఈ రూల్స్ ని తారుమారు చేసేసారు అనే విమర్శలు సాక్షాత్తు దేవస్థానం సహచర అర్చకుల్లోనే వినపడుతోంది. 

    వైదిక నిబంధనలు కేవలం సామాన్య వైష్ణవ స్వాములకు మాత్రమేనని,  పలుకుబడి ఉన్న అర్చకులు, వైదికులకు కాదు అనేది సింహాచల క్షేత్రం లో సుస్పష్టం అవుతోంది.  అయితే ఈ విధమైన పరిస్థితి కేవలం సింహాచల క్షేత్రంలో మాత్రమే కాదు,  రాష్ట్రంలోని ఇతర దేవాలయాల్లో కూడా ఉంది అన్నది వాస్తవం. 
     

  • సింహాచల వైభవం, కృష్ణమయ్య పాటకు - నృసింహుని ఆటకు చెల్లు

    Apr 19, 2026 11:38 am

    జగదాచార్యులు  రామానుజుల రాక తో సింహాచల క్షేత్రానికి వైదిక వైభవం...*

    *(DNS Report: Sathya Ganesh, Cheif Reporter, visakhapatnam)*    

    *విశాఖపట్నం, ఏప్రిల్ 19, 2026 (డిఎన్ఎస్ ):* ప్రసిద్ధ  సింహాచల క్షేత్రంలో  శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి పట్ల అచంచలమైన భక్తి ఉన్న పరమ వైదికుల్లో అగ్రగణ్యులు. శ్రీ కాంతా కృష్ణమాచార్యులు ఒకరు. వారు ఎంతో విద్వత్ సంపన్నులు. కవి పండితులు. వీరు స్వామిని. కీర్తిస్తూ పాటలు పాడితే  స్వామి నృత్యం చేసేవాడు.  ప్రతీ రోజూ  ఇదే జరిగేది. దీంతో  వీరి ఖ్యాతి  ఎంతో పెరిగింది. దాంతో పాటు వీరికి కొంత  అహం కూడా పెరిగింది. దాంతో ఇతరుల పట్ల వీరి వైఖరి మారింది. 
    అదే కాలంలో కొన్నాళ్ళకి యాతీశ్వరులు, జగదాచార్యులు శ్రీ  భగవద్రామానుజాచార్యులు  ఈ క్షేత్రానికి విజయ యాత్ర చేశారు.  శ్రీ వైష్ణవ  సంప్రదాయం ప్రకారం పెద్దలు మన గ్రామానికి వస్తె వెళ్ళి వారిని దర్శించాలి.  అయితే కృష్ణమయ్య .. నేను పాడితే స్వామిని పలుకుతున్నాడు.. ఇక ఇతరులతో పనేంటి అనే కించత్ భావంతో రామానుజుల వద్ద కు వెళ్ళరు. 
    అయితే వీరి వైభవం తెలుసుకున్నా రామానుజులు అవకాశం చూసుకుని ఒకసారి తమ వద్దకు రావాల్సిందిగా కబురు పంపుతారు. తానూ రావడం కుదరదు అని తేల్చి చెప్పడం తో తమ శిష్యులతో ఒక సందేశాన్ని కృష్ణమయ్య వద్దకు పంపుతారు రామానుజులు. 

    వీరు పంపిన సందేశం : 
    1 .  రాత్రి మీ గాత్ర సమయం లో స్వామి వచ్చినప్పుడు. రామానుజులకు  మోక్షం ఉందా  అని స్వామిని అడిగి తెలుసుకోవాల్సిందిగా కోరతారు. 
    అదే ప్రశ్న ను రాత్రి సమయంలో కృష్ణమయ్యా శ్రీ వరాహ నృసింహ స్వామిని అడుగుతారు.
    దానికి స్వామి ఓ కచ్చితంగా వారికి మోక్షం ఉంది అని చెప్తారు.

    రెండవ రోజు రామానుజులు మరొక సందేహం అడగమని కోరతారు. 
    2 . కృష్ణమాచార్యులు ku మోక్షం ఉందా అని అడగమంటారు.వెంటనే కృష్ణమ య్య గట్టిగా నవ్వి.. నేను పాడితే నృసింహుడు నృత్యం చేస్తాడు.  నాకు మోక్షం  లేకపోవడం ఏంటి అని ప్రశ్నిస్తాడు. అయినా స్వామిని అడుగుతా లే అని చెప్తారు.
    రాత్రి ఏకాంత సేవలో స్వామి వచ్చినప్పుడు. కృష్ణమాచార్యులు ఇదే ప్రశ్న ను వరాహ నృసింహుని అడుగుతారు.
    దానికి సమాధానంగా నృసింహుడు. తెలియదు అని చెప్తాడు.
    అదేంటి నేను పిలిస్తే నువ్వు వస్తున్నావు... నాకు మోక్షం లేకపోవడం  ఏంటి అని అడుగుతారు.
    దానికి నవ్వి. నువ్వు పాడుతున్నావు...  దానికి నేను నృత్యం చేస్తున్నా.  రెండింటికీ చెల్లు అంతే.
    ఇక మోక్షం సంగతి అంటావా..
    .
    నీతో సహా అందరికీ మోక్ష మార్గం చూపించేది రామానుజులే.  నీకు మోక్షం కావాలి అంటే రామానుజులు ను ఆశ్రయించమని చెప్తారు.
    దాంతో జ్ఞానోదయం కలిగి, రామానుజులు ను ఆశ్రయించి   సంప్రదాయ సేవ మరింత ఉధృతంగా చేస్తారు. స్థానికంగా చేపట్టవలసిన వైదిక క్రియలు తెలియచేసి, వారిని పర్యవేక్షించమని సూచిస్తారు.

    ఎంత విద్వత్ ఉన్నా. . .పెద్దల ఎదుట వినయంగా ఉండాలి అనే సందేశాన్ని కాంతా కృష్ణమాచార్య  వృత్తాంతం తెలియచేస్తోంది. 
     

  • చందన యాత్ర ఆన్లైన్ టికెట్లు విధానం అట్టర్ ఫ్లాప్ 

    Apr 14, 2026 11:54 pm

    *అనుభవ రాహిత్యం తో చుక్కలు చూపిస్తున్న దేవస్థానం.* 

    *భక్తుల అకౌంట్ నుంచి డబ్బులు కట్, నో టికెట్. . .* 

    *(DNS Report: Sathya Ganesh, Cheif Reporter, visakhapatnam)*    

    *విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన సింహాచల క్షేత్ర  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్న తరుణం లో ఆన్లైన్ టికెట్ విధానం ద్వారా నరకం చూపిస్తోంది దేవస్థానం. పూర్తిగా అనుభవ రాహిత్యం కొత్త వచ్చినట్టు కనిపించింది. 
    మొదటిసారిగా ఈ విధానం అమలు చేస్తున్నట్టు ప్రగల్బాలు పలికిన దేవస్థానం, మాట నిలబెట్టుకోవడంలో ఘోర వైఫల్యం చెందింది. 
    వరుసగా ఒక గంట పనిచేస్తే ఒట్టు. ఈ నెల 12 నుంచి టికెట్లు ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయి అని ఈఓ జె వెంకట్రావు చెప్పడంతో భక్తులు మొబైళ్ళు, కంప్యూటర్లకే అతుక్కు పోయారు. చెప్పిన ప్రకారం 12 వ తేదీ వెబ్ సైట్  పనిచేయకపోవడంతో ఒకరోజు తర్వాత పనిచేస్తుందని సొంత మీడియా ద్వారా ప్రకటించారు. అయితే 13 వ తేదీన వెబ్ సైట్ ఓపెన్ అయ్యిన,  రోజంతా హ్యాంగ్ అవుతూనే ఉంది. ఒక సారి కేవలం ఒక్క టికెట్ మాత్రమే బుక్ అయ్యేలా పెట్టారు. బాగుంది. అయితే ఒక ఫామిలీ లో 5 గురు ఉంటె. . కేవలం ఇద్దరికీ టికెట్లు బుక్ అయినా వెంటనే వెబ్సైట్ హ్యాంగ్ అవ్వడం గమనార్హం. 
    ఆ ఒక్క రోజు మహా ఓ 50 టికెట్లు బుక్ అయి ఉంటాయి. అదే తరహా దృశ్యాలు 14 వ తేదీ కూడా జనాన్ని వెక్కిరించాయి. అయితే 14 వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో వెబ్సైట్ ఓపెన్ అయినా భక్తుల అకౌంట్ నుంచి డబ్బులు దేవస్థానానికి చేరినా, టికెట్లు ప్రింట్ అవ్వకపోవడం అత్యంత దారుణం. రెండు రోజుల పాటు వెబ్సైట్ పనిచేయలేదు. మూడవ రోజు రాత్రి వెబ్ సైట్ ఓపెన్ అయ్యి, డబ్బులు పోయి ... టికెట్ లేకపోవడం దేవస్థానం నిర్వహణ నిర్లక్ష్య వైఖరి సుస్పష్టంగా కనిపించింది. 
    రెండవ రోజు ప్రింట్ అయినా టికెట్ల పై క్యూ ఆర్ కోడ్ లు ఉన్నాయి. మూడవ రోజు అసలు టికెట్టే ప్రింట్ ( జనరేట్ ) అవ్వలేదు. దీంతో వెబ్సైట్ లో ఇచ్చిన దేవాలయం హెల్ప్లైన్ నెంబర్ 93987  34612 కు ఎన్ని సార్లు ఫోన్ చేసిన సమాధానం రాకపోవడం గమనార్హం. అసలు వీళ్ళకి టికెట్ వచ్చినట్టా లేదా అనే విషయం కూడా చెప్పే నాధుడు సింహాచలం దేవస్థానం లో లేడు. భక్తులకు విస్తృత సేవలు చేస్తున్నాం అని ప్రకటించిన జిల్లా కలెక్టర్, రెవిన్యూ యంత్రాంగం, ఇతర ప్రభుత్వ అధికారులు భక్తులకు సమాధానం చెప్పవలసి ఉంది. పైగా ముగ్గురు మంత్రులతో పర్యవేక్షణ సంఘం ఏర్పాటు చేసారు. 

     

Panchangam - May 11, 2026

Date :
Ruthuva :
Nakshatram :
Week :
Masam :
Amrithakalam :
Year :
Pakshamvarjam :
Samsthram :
Ayanam :
Tithi :
Durumuhratam :

Today Vizag Events - May 11, 2026

ఆంధ్ర ప్రదేశ్
view more..
రాజకీయo
view more..

వీడియోలు
International
view more..
Movie News
view more..
విశాఖ వార్తలు
కమ్యూనిస్ట్ లు, ఖాన్ గ్రెస్ లు బీజేపీ కి , మోడీ క...

May 10, 2026 5:49 pm

*15 ఏళ్లుగా టిఎంసీ గూండాల కబ్జా లో సిపిఎం, ఖాన్ గ్రెస్ ల పార్టీ ఆఫీసులు* 

*ఒక్కొక్కటిగా నేడు స్వాధీనం అవుతున్న సంఘటన...

view more..
Competitive Exams in India
Sports
view more..
National News
view more..