*విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకున్న వారికి జన్మరాహిత్యమే కలుగుతుంది అని సింహాచల క్షేత్ర మహాత్మ్యం తెలియచేస్తోంది. ఏడాది పాటు చందనం పూత తో కనిపించే స్వామి అసలు రూపం చూడాలి అని లక్షలాది మంది భక్తులు తపించిపోతుంటారు.
ఏడాది కాలం పాటు 12 మణుగుల చందనం తో అలంకారభూషితుడైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి. వైశాఖ శుద్ధ తదియ నాడు ఒక్క రోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం అందిస్తాడు. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి పై ఉన్న సుమారు 500 కిలోల చందనం తొలగింపు అంత సులభంగా జరగదు. ఎంతో ఉత్కృష్టమైన ఈ వైదిక క్రియను నిర్వహించేందుకు ముందస్తు సంస్కార విధులు చాలా ఉంటాయి. వాటిని పూర్తి చేసిన తర్వాతే స్వామి పై ఉన్న చందనాన్ని తొలగించడం ( చందనోత్తరణ) జరుగుతుంది. ఆ వైదిక క్రియను తెలుసుకుందాం.
ఏకాదశి నుంచి వైదిక క్రియా విధానం మొదలు...
వైశాఖ శుద్ధ తదియ ( ఏప్రిల్ 20 , 2026) నాడు స్వామి నిజరూప దర్శనం భక్తులకు లభించనుంది. అయితే ముందు వారం రోజుల ముందు నుంచి వైదిక క్రియ మొదలవుతుంది. చైత్ర బహుళ ఏకాదశి నాటి ఉదయం స్వామి కి నిత్యా ఆరాధనలు ముగిసిన తదుపరి, చందనం అరగతీత కోసం తగిన మేలిమి చందన కలప, సుగంధ ద్రవ్యాలకు షోడశోపచారాలు సమర్పించి, గర్భాలయం లో స్వామి ఎదుట పెట్టి, అనుమతి తీసుకుని ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి, బేడామండపం వద్దకు చేరుకుంటారు, అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, జరిపి, చందన కలప కు, అరగతీత సానపెట్ట కు హారతి ఇచ్చి, చందనం తొలి అరగతీత ను ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ఆరంభిస్తారు. తదుపరి, అధికారులు, ఇతరులు సైతం ఈ క్రియ లో పాల్గొంటారు. అనంతరం ఆలయ స్దాన కైంకర్య సిబ్బంది వీటిని వారం రోజుల పాటు, అరగతీత నిర్వహిస్తారు. వారం రోజుల పాటు సుమారు 125 కిలోల ( 3 మణుగుల) చందనాన్ని సేకరించి, భండారం లో భద్రపరుస్తారు.
ముందు రోజు అర్ధ రాత్రి:..
వైశాఖ శుద్ధ విదియ అర్ధరాత్రి ( తెల్లవారితే తృతీయ), అంటే ఈ నెల 19 రాత్రి గడిచిన తర్వాత తెల్లవారు ఝామున 1 గంట ప్రాంతంలో స్వామికి సుప్రభాతం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణ, పంచ కలశ ఆవాహనం, ఆరాధనం, నిర్వహిస్తారు. అనంతరం అర్హులైన, అర్చక సిబ్బంది ముఖాలకు గంటలు కట్టుకుని, వెండి బొరిగెలతో స్వామి పై ఉన్న 500 కిలోల చందనాన్ని తొలగించే ప్రక్రియ ను ( చందనోత్తరణం ) మొదలు పెడతారు. పూర్తిగా స్వామి పై ఉన్న చందనాన్ని తొలగించిన తదుపరి స్వామికి పంచామృత అభిషేకం, పంచ కలశ అభిషేకం, స్నాపన తిరుమంజనం, విశేష అలంకారం, ఆరాధనం, సేవాకాలం, మంగళ నీరాజనం, కేవలం శీతల పానీయం నివేదనం జరుగుతుంది. ఎటువంటి ఘన పదార్ధం నివేదన ఉండదు. ఈ వైదిక ప్రక్రియ అంతా తెల్లవారుఝామున 3.50 నిమిషాల లోపు జరుగుతుంది.
తొలి దర్శనం పూసపాటి వంశస్థులకే...
అనంతరం తెల్లవారు ఝామున 4 గంటల ప్రాంతంలో దేవాలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి వంశీకులకు మాత్రమే తొలి దర్శనం కల్పిస్తారు. తదుపరి ఇతర ప్రముఖులకు, సామాన్య భక్తులకు రాత్రి 8 గంటల వరకూ స్వామి దర్శనం కల్పిస్తారు.
సంప్రదాయ శ్రీవైష్ణవ స్వాముల చే . . సహస్ర ఘటాభిషేకం ..
సాయంత్రం ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పరులైన వైదిక శ్రీవైష్ణవ స్వాములు గంగాధర నుంచి మట్టి కలశలతో తీసుకు వచ్చిన పవిత్ర గంగాధర జలం తో స్వామికి వెయ్యి కలశలతో అభిషేకం నిర్వహిస్తారు. దీన్నే సహస్ర ఘటాభిషేకం అని పేరు. ఈ వేడుక సమయంలో గర్భాలయంలోకి ఇతరులు ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. తదుపరి శీతల పానీయం, పళ్ళు నివేదన అనంతరం రాత్రి తిరిగి తొలివిడత 125 మణుగుల చందనం స్వామికి అలంకరిస్తారు. ఈ అలంకరణ లో స్వామి గుమ్మడి పండు ఆకారం లో దర్శనం ఇస్తారు.
తిరిగి వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఒక్కో మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. దీంతో చందనయాత్ర పరిపూర్ణం అవుతుంది.
కొన్ని యుగాల నుంచి వేలాదిమందికి నిదర్శనాలు చూపుతున్న శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి నేటి తరానికి ప్రత్యక్ష నిదర్శనం చూపుతున్నాడు. అది గ్రహించే శక్తి మనకి ఉండాలి అంతే. .
Apr 14, 2026 3:57 pm
*కళ్ళకు గంతలు, వెండి బోర్ గేలు ఇవే చందనోత్తరణ పరికరాలు.*
*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, visakhapatnam)*
*విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2026 (డిఎన్ఎస్ ):* అత్యంత దుర్లభమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకున్న వారికి జన్మరాహిత్యమే కలుగుతుంది అని సింహాచల క్షేత్ర మహాత్మ్యం తెలియచేస్తోంది. ఏడాది పాటు చందనం పూత తో కనిపించే స్వామి అసలు రూపం చూడాలి అని లక్షలాది మంది భక్తులు తపించిపోతుంటారు.
ఏడాది కాలం పాటు 12 మణుగుల చందనం తో అలంకారభూషితుడైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి. వైశాఖ శుద్ధ తదియ నాడు ఒక్క రోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనం అందిస్తాడు. శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి పై ఉన్న సుమారు 500 కిలోల చందనం తొలగింపు అంత సులభంగా జరగదు. ఎంతో ఉత్కృష్టమైన ఈ వైదిక క్రియను నిర్వహించేందుకు ముందస్తు సంస్కార విధులు చాలా ఉంటాయి. వాటిని పూర్తి చేసిన తర్వాతే స్వామి పై ఉన్న చందనాన్ని తొలగించడం ( చందనోత్తరణ) జరుగుతుంది. ఆ వైదిక క్రియను తెలుసుకుందాం.
ఏకాదశి నుంచి వైదిక క్రియా విధానం మొదలు...
వైశాఖ శుద్ధ తదియ ( ఏప్రిల్ 20 , 2026) నాడు స్వామి నిజరూప దర్శనం భక్తులకు లభించనుంది. అయితే ముందు వారం రోజుల ముందు నుంచి వైదిక క్రియ మొదలవుతుంది. చైత్ర బహుళ ఏకాదశి నాటి ఉదయం స్వామి కి నిత్యా ఆరాధనలు ముగిసిన తదుపరి, చందనం అరగతీత కోసం తగిన మేలిమి చందన కలప, సుగంధ ద్రవ్యాలకు షోడశోపచారాలు సమర్పించి, గర్భాలయం లో స్వామి ఎదుట పెట్టి, అనుమతి తీసుకుని ఆలయం చుట్టూ ప్రదర్శన చేసి, బేడామండపం వద్దకు చేరుకుంటారు, అక్కడ విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, జరిపి, చందన కలప కు, అరగతీత సానపెట్ట కు హారతి ఇచ్చి, చందనం తొలి అరగతీత ను ఆలయ ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు ఆరంభిస్తారు. తదుపరి, అధికారులు, ఇతరులు సైతం ఈ క్రియ లో పాల్గొంటారు. అనంతరం ఆలయ స్దాన కైంకర్య సిబ్బంది వీటిని వారం రోజుల పాటు, అరగతీత నిర్వహిస్తారు. వారం రోజుల పాటు సుమారు 125 కిలోల ( 3 మణుగుల) చందనాన్ని సేకరించి, భండారం లో భద్రపరుస్తారు.
ముందు రోజు అర్ధ రాత్రి:..
వైశాఖ శుద్ధ విదియ అర్ధరాత్రి ( తెల్లవారితే తృతీయ), అంటే ఈ నెల 19 రాత్రి గడిచిన తర్వాత తెల్లవారు ఝామున 1 గంట ప్రాంతంలో స్వామికి సుప్రభాతం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, ఋత్విక్ వరుణ, పంచ కలశ ఆవాహనం, ఆరాధనం, నిర్వహిస్తారు. అనంతరం అర్హులైన, అర్చక సిబ్బంది ముఖాలకు గంటలు కట్టుకుని, వెండి బొరిగెలతో స్వామి పై ఉన్న 500 కిలోల చందనాన్ని తొలగించే ప్రక్రియ ను ( చందనోత్తరణం ) మొదలు పెడతారు. పూర్తిగా స్వామి పై ఉన్న చందనాన్ని తొలగించిన తదుపరి స్వామికి పంచామృత అభిషేకం, పంచ కలశ అభిషేకం, స్నాపన తిరుమంజనం, విశేష అలంకారం, ఆరాధనం, సేవాకాలం, మంగళ నీరాజనం, కేవలం శీతల పానీయం నివేదనం జరుగుతుంది. ఎటువంటి ఘన పదార్ధం నివేదన ఉండదు. ఈ వైదిక ప్రక్రియ అంతా తెల్లవారుఝామున 3.50 నిమిషాల లోపు జరుగుతుంది.
తొలి దర్శనం పూసపాటి వంశస్థులకే...
అనంతరం తెల్లవారు ఝామున 4 గంటల ప్రాంతంలో దేవాలయ అనువంశిక ధర్మకర్తలు పూసపాటి వంశీకులకు మాత్రమే తొలి దర్శనం కల్పిస్తారు. తదుపరి ఇతర ప్రముఖులకు, సామాన్య భక్తులకు రాత్రి 8 గంటల వరకూ స్వామి దర్శనం కల్పిస్తారు.
సంప్రదాయ శ్రీవైష్ణవ స్వాముల చే . . సహస్ర ఘటాభిషేకం ..
సాయంత్రం ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం సంప్రదాయ పరులైన వైదిక శ్రీవైష్ణవ స్వాములు గంగాధర నుంచి మట్టి కలశలతో తీసుకు వచ్చిన పవిత్ర గంగాధర జలం తో స్వామికి వెయ్యి కలశలతో అభిషేకం నిర్వహిస్తారు. దీన్నే సహస్ర ఘటాభిషేకం అని పేరు. ఈ వేడుక సమయంలో గర్భాలయంలోకి ఇతరులు ఎవ్వరికీ ప్రవేశం ఉండదు. తదుపరి శీతల పానీయం, పళ్ళు నివేదన అనంతరం రాత్రి తిరిగి తొలివిడత 125 మణుగుల చందనం స్వామికి అలంకరిస్తారు. ఈ అలంకరణ లో స్వామి గుమ్మడి పండు ఆకారం లో దర్శనం ఇస్తారు.
తిరిగి వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఒక్కో మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. దీంతో చందనయాత్ర పరిపూర్ణం అవుతుంది.
కొన్ని యుగాల నుంచి వేలాదిమందికి నిదర్శనాలు చూపుతున్న శ్రీవరాహ లక్ష్మి నృసింహ స్వామి నేటి తరానికి ప్రత్యక్ష నిదర్శనం చూపుతున్నాడు. అది గ్రహించే శక్తి మనకి ఉండాలి అంతే. .