DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ పై హత్యాయత్నం చంద్రబాబు కుట్రే . . . : గుడివాడ అమర్ 

ఘటన ఎలా జరుగుతుందో డిజిపి à°•à°¿  à°®à±à°‚దే తెలుసా 

టిడిపి పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీ ని విచారిస్తే మొత్తం విషయాలు తెలుస్తాయి : గుడివాడ అమర్ 

విశాఖపట్నం,

అక్టోబర్ 27, 2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): విశాఖపట్నం విమానాశ్రయం లో ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

చేయించిన కుట్రే అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ ప్రతినిధి గుడివాడ అమర్ నాద్ మండిపడ్డారు. శనివారం నగరం లోని పార్టీ కార్యాలయం లో

నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన ఈ కుట్ర జరిగిన నేపధ్యం లో రాష్ట్ర డిజిపి అంతా ప్రత్యక్షంగా చూసినట్టే కధలు వల్లించడాన్ని తప్పు పట్టారు. ఘటన మధ్యాహ్నం 12 : 30

గంటలకు జరిగితే స్థానిక పోలీసులు సాయంత్రం 4  à°—ంటలకు à°°à°‚à°—à°‚ లోకి దిగారని, అయితే మధ్యాహ్నం 2 గంటలకే ఘటనపై వివరాలు ముందుగానే అందినట్టుగా డిజిపి

వివరించేశారన్నారు. దీని వలన పార్టీ వర్గాలకు డిజిపి ఇచ్చిన స్టేట్మెంట్ పై అనుమానాలు వచ్చాయన్నారు. పోలీసుల పరిధిలోకి కేసు వెళ్లకుండానే వివరాలు

చెప్పేశారన్నారు.  à°ˆ క్రమం లో తలెత్తిన అనుమానాలను బహిర్గతం చేశారు. జగన్ మోహన్ రెడ్డి విశాఖ విమానాశ్రయానికి వచ్చిన ప్రతీ సారి  à°†à°¯à°¨à°•à°¿ ఆహారం పార్టీ ప్రతినిధులే

తీసుకెళ్తున్నారని తెలిపారు.  à°…లాంటిది ఘటన జరిగిన రోజు ఆయనకి బయట నుంచి ఆహారం ఎందుకు తీసుకు వెళ్లనివ్వలేదు ? ఎయిర్ పోర్ట్ లో ఫ్యూజన్ ఫుడ్స్ అధినేత హర్షవర్ధన్

ప్రసాద్, ఫిర్యాదు చేసిన మేరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి బయట నుంచి ఆహారం తెస్తున్నారు, తద్వారా మా వ్యాపారానికి గండి పడుతోందని, దాన్ని నిరోధించాలని ఫిర్యాదు

చేశారన్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ అధారిటీ వారు à°† రోజు జగన్ కు ఆహారం తీసుకువెళ్లనివ్వలేదన్నారు. 


తప్పుదారి పట్టించిందెవరు ?

వైఎస్సార్ కాంగ్రెస్

పార్టీ ఈ ఘటనను తప్పుదారి పట్టించిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హేళన చెయ్యడం తో పాటు, జగన్ మోహన్ రెడ్డిని ఏకవచన సంబోధన చెయ్యడం అతని స్థాయి ఏంటో

తెలుస్తోందన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు విశాఖ నగర సీపీ ఎక్కడ ఉన్నారు ?, నగరం లో అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని, క్రికెట్ మ్యాచ్ అవుతోందని, విదేశీ ప్రతినిధులకు,

ప్రపంచాన్ని తప్పుదారి పట్టించిందనడం హాస్యాస్పదం అన్నారు. గతం లో తిరుమల లో బ్రహ్మోత్సవాల్లో అలిపిరి లో చంద్రబాబు పై జరిగిన హత్యాయత్నంను మొత్తం తెలుగు

ప్రజలంతా ఖండించారని, అయితే అది కూడా  à°ªà±à°°à°ªà°‚చాన్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబే చేయించుకున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. 

నటుడు

శివాజీని ఇంటరెగేట్ చేస్తే అంతా బయటకు వస్తుంది. : 

ఆపరేషన్ గరుడ అంటూ ప్రగల్బాలు పలుకుతున్న తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్ట్, నటుడు శివాజీ చేస్తున్న

ఆరోపణలన్నీ నిజమవుతున్నాయి అని ముఖ్యమంత్రి వత్తాసు పలకడం బట్టి చూస్తే చంద్రబాబు రాసిచ్చిన స్రిప్ట్ నే శివాజీ చదువుతున్నాడన్నారు. అతన్ని అరెస్టు చేసి

విచారిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అక్రమాలు, కుట్రలు బయట పడతాయన్నారు.  à°ˆ విలేకరుల సమావేశం లో విశాఖ పార్లమెంటరీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణ, మాజీ

ఎమ్మెల్యే గొల్ల బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dnslive  #dns live #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #YSR Congress  #YSRCP  #YSR Cong  #Gudivada Amarnad  #YS Jagan Mohan Reddy  #attack  #airport

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam