DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీలో బ్రాహ్మణులంతా జగన్ కి మాత్రమే ఓటు వేస్తారు:జ్వాలాపురం

*ఈ ప్రభుత్వం నుంచి బ్రాహ్మణులూ వేల కోట్ల లబ్ది  పొందారు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)* 

*విశాఖపట్నం, మే 8, 2024 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లోని బ్రాహ్మణా కుటుంబాల ప్రజలు అంతా వైఎస్ar కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేస్తామని రాష్ట్ర దేవాదాయ

ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురపు శ్రీకాంత్ తెలిపారు. బుధవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులూ అంతా ఈ సారి ఎన్నికల్లో బ్రాహ్మణులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి అండగా నిలబడతారన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక్క బ్రాహ్మణునికి

టికెట్ ఇవ్వలేదని, వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ ఒక బ్రాహ్మణుడికి టికెట్ ఇచ్చిందన్నారు. గతంలో ద్రోణంరాజు శ్రీనివాస్, మల్లాది విష్ణు, కోన రఘుపతి, తదితరులకు టికెట్లు ఇచ్చిందన్నారు. నాడు గానీ, నేడు గానీ తెలుగుదేశం ఒక్క బ్రాహ్మణుడికి కూడా టికెట్లు ఇవ్వలేదన్నారు. 
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ బ్రాహ్మణులకు

చట్ట సభల్లో అవకాశం కలిగిందని తెలిపారు. 
18 మంది కార్పొరేటర్లు బ్రాహ్మణులు. ముగ్గురు కి ఎమ్మెల్యే టికెట్లను ఈ ప్రభుత్వం ఇచ్చింది

బ్రాహ్మణులు 50 వేల మందికి పైగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా 3 వేల పెన్షన్ తీసుకుంటున్నారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్  ద్వారా రూ. 780 కోట్లు బ్రాహ్మణులు అభ్యున్నతికి  ఈ

ప్రభుత్వం నిధులు వెచ్చించినట్టు తెలిపారు. అమ్మఒడి, ఋణాలు, గరుడ స్కీం, స్సీకీం, విదేశీ విద్య, అర్చక, పురోహితులకు, నిరుద్యోగులకు ఎన్నో పధకాలు, బ్రాహ్మణులకు వంశ పారంపర్య హక్కు కల్పించిన ఘనత   వైయస్ జగన్ మోహన్ రేడ్డి ప్రభుత్వందేనన్నారు. బ్రాహ్మణుడు జీవించే వరకు ఆలయాల్లో సేవ చేసే అవకాశం జగన్ ప్రభుత్వం

కల్పించిందన్నారు. 

బ్రాహ్మణుల హక్కు కాల రాసింది చంద్రబాబు: 

తెలుగుదేశం తొలిసారి అధికారం లోకి వచ్చిన వెంటనే గ్రామ కారణాలను తొలగించి, వేలాదిమంది బ్రాహ్మణుల ఉసురు పోసుకుందన్నారు. ఆ క్రమంలోనే సుమారు 18 మంది అకాల మరణం చెందారన్నారు.  నాటి నుంచి అర్చకులు  హక్కులు కాలరాసి ఆత్మహత్యలకు చంద్రబాబు

కారణం అయ్యారన్నారు. 

బ్రాహ్మణా కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది కాదని, అది మాజీ ఐఏఎస్ అధికారి ఐవి ఆర్ కృష్ణా రావు ఆలోచనల నుంచి వచ్చిందన్నారు. ఆయన్ను అతిగా కించపరిచిన పచ్చ మీడియా తిక్కవేషాలు ఇంకా ప్రజలకు గుర్తున్నాయన్నారు. 

తల్లిదండ్రులు చనిపోతే తల నీలాలు ఇవ్వని చంద్రబాబుకు

హిందూ సంప్రదాయం అన్నా,  బ్రాహ్మణులు అన్నా,  గౌరవం లేదన్నారు. 

ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ్, రాష్ట్ర కార్యదర్శి పి వి నారాయణ, కనక మహాలక్ష్మిట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు నండూరి సుబ్రహ్మణ్యం, బ్రాహ్మణకార్పొరేషన్ డైరెక్టర్ పూర్ణానంద శర్మ, బ్రాహ్మణ

కార్పొరేషన్ డైరెక్టర్  కోడూరు సుశీల తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam