DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అభ్యర్దుల దురుసు వైఖరే ఏపీలో బీజేపీ కొంప ముంచుతుందా?

*అరకు, అనకాపల్లి, రాజమండ్రి లో సొంత నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 14, 2024 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని పూర్తిగా ముంచేందుకు స్వయంగా రాష్ట్ర అధిష్టానం చేసిన స్వయంకృతాపరాధమే కారణమా అంటే అవునని బీజేపీ క్యాడర్

తెలియచేస్తున్నారు. ప్రధానంగా అభ్యర్థుల నోటి దూరదే పార్టీ కొంప ముంచనుంది. దీని ప్రభావం అరకు, అనకాపల్లి, రాజమండ్రి లోక్ సభ అభ్యర్థుల పై తీవ్రంగా చూపించనుంది. వీళ్ళు సొంత పార్టీ నాయకులపైనే అవాకులు చెవాకులు వ్యాఖ్యానించడం తో పార్టీ క్యాడర్ లోనే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్టీలోని నాయకులూ, క్యాడర్ ను కలుపుకుంటూ

వెళ్లి ప్రచారం చేసుకోవాల్సిన వీళ్ళు సొంత పార్టీ నాయకులపైనే అవాస్తవ అభాండాలు వేయడం సొంత గోతులు వీళ్ళే తీసుకున్నారు. పార్టీలో చాల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు లు ఉన్నారంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. దీనిపై టికెట్లు ఆశించి భంగపడి, నిరాశ లో ఉన్న సీనియర్ నాయకులను (40 ఏళ్ళ నుంచే ఇదే పార్టీ లో

ఉన్నవాళ్లు )   మరింత అవమానించడం తో ప్రచారంలోకి రావడం మానేశారు. 

ప్రధానంగా పొత్తుల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన నాయకులను సైతం బీజేపీ కనీసం గౌరవించక పోవడం బీజేపీ అభ్యర్థుల ప్రచారం లో పట్టుమని పదిమంది కూడా కనపడడం లేదు. పైగా సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి లోక్ సభ

నుంచి పోటీ లో ఉన్నారు. ఆమె ప్రచార సభలోనే తెలుగు దేశం, బీజేపీ నాయకులూ నేరుగా తన్నుకోవడం పార్టీ పట్ల పొత్తుల్లోని వాళ్ళకే ఎంత వ్యతిరేకత ఉందొ దేశ వ్యాప్తంగా తెలిసిపోయింది. ఈమె కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. రాజమండ్రి తో ఈమెకు ఏమాత్రం పరిచయం లేక. .కేవలం ఒకరిద్దరిపైనే ఈమె పూర్తిగా ఆధారపడిపోయారు

అనే విషయం తెలుస్తోంది. 

ఇక అరకు లోక్ సభ లో బరిలో ఉన్న కొత్తపల్లి గీత ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బీజేపీ లోనే వైఎస్సార్ కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారని, మా పార్టీ అభ్యర్థులను ఓడించడానికి కుమ్మక్కు అయ్యారు అంటూ వ్యాఖ్యానించడం చాల దుమారం లేపింది. ఈమె వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీ

లోకి వచ్చిన అభ్యర్థి.  ఈమె చేరడం వాళ్ళ పార్టీ కి ఏమేరకు ఉపయోగం కలిగిందో తెలియదు కానీ సీనియర్లకు అవమానం మాత్రం జరిగింది అనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. ఈమె పై ఆర్థిక నేరాల కేసులు ఉండడం వలన, దాన్ని తప్పించుకోడానికి పార్టీ మారారు అనే అభిప్రాయం ప్రచారం లో ఉంది.     

ఇక అనకాపల్లి నుంచి లోక్ సభ బారి లో ఉన్న

సీఎం రమేష్ కడప ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు లేవు. గతంలో రాజ్య సభ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యక్ష పోటీ ఇతనికి ఇదే మొదటి సారి. ఇలాంటి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో ఏమాత్రం తెలియక చెయ్యరని తప్పులు చేస్తున్నట్టు సమాచారం. అనకాపల్లి పరిధిలో ఎన్ని నియోజక వర్గాలు ఉన్నాయి, ఏ సామాజిక

వర్గం ఎంతమంది ఉన్నారు అనే విషయం పరిజ్ఞానం ఈయనకు పూర్తిగా శూన్యం.    
సొంత పార్టీ అభ్యర్థి దాకా అని ప్రచారం చేయడం కోసం విశాఖ నుంచి బీజేపీ నాయకులూ వెళ్లిన సందర్భంలో రమేష్ చూపించిన దురుసు ప్రవర్తన క్యాడర్ ను ఏంటో  మనస్థాపానికి గురి చేసింది. మొన్నటి వరకూ తెలుగుదేశం ఎంపీ గా ( రాజ్యసభ) ఉన్న ఇతను ఈడీ కేసుల్లో

నిందితుడు గా ఉన్నందున దాన్ని తప్పించుకునేందుకు  బీజేపీ లో చేరారు. ఇతనికి బీజేపీ పార్టీ గురించి గానీ, సంఘ్ ప్రాధాన్యత, సిద్ధాంతాలు గురించి ఏమి తెలియవు. 

విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజు పూర్తిగా ఒంటెద్దు పోకడ వైఖరి కి సొంత బీజేపీ క్యాడర్ ఈయనకు మద్దతు ఇవ్వడం లేదు. ఈయన

తెలుగుదేశం తో అంతర్గత ఒప్పందం ఉన్నట్టుగా పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఇదే చోట నుంచి ఎమ్మెల్యే గా గెలిచినా, ఈసారి ఎన్నికలు ఈయనకు చుక్కలు చూపిస్తున్నాయి. నగర పార్టీలో అత్యంత బలంగా ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ క్యాడర్ సైతం ఈయనకు దూరంగా ఉండడం ఈయన వైఖరే అని  తెలుస్తోంది. 

పార్టీ లో ఏమాత్రం

ప్రాధాన్యత లేని వీళ్ళందరూ సొంత లాబీ వల్ల టికెట్లు తెచ్చుకోవడంతో సీనియర్లను అత్యంత ఘోరంగా అవమానించిన ఫలితం త్వరలోనే చవిచూడబోతున్నారు అన్నది వాస్తవం.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 29, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam