DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి నిధులు దారిమళ్లిస్తున్న ఈఓ ధర్మారెడ్డి పై చర్యలు తీసుకోవాలి:బీజేపీ 

*రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనాకు బీజేపీ - టిడిపి బృందం ఫిర్యాదు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విజయవాడ / విశాఖపట్నం, ఏప్రిల్ 09, 2024 (డి ఎన్ ఎస్):* కోట్లాది మంది హిందువుల ఇలవేల్పు తిరుమల శ్రీ వేంకటేశ్వరుని టిటిడి నిధులు అధికార వైసీపీ పార్టీ అభ్యర్థి కోసం దారి మళ్లిస్తున్నఈఓ ధర్మారెడ్డి పై

చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు బీజేపీ, టీడీపీ ఫిర్యాదు చేసింది. విజయవాడ లో ఈసీ ముకేశ్ కుమార్ మీనా ను కలిసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత పట్టాభి కలిసి టిటిడి బ్రేక్ దర్శనం సుపథం టికెట్లు నిబంధనలకు విరుద్ధంగా జారీపై ఫిర్యాదు చేసారు. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జులకు కూడా ప్రతిరోజూ కోటాలో

బ్రేక్ దర్శన్, సుపథం టిక్కెట్ల జారీ చేస్తున్నారని, సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతోందన్నారు.

టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కొడుకు ప్రస్తుత తిరుపతి డిప్యూటీ మేయర్ మరియు వైసీపీ తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి అభినయ్ గెలుపు కోసం టీటీడీ నిధులను టీటీడీ ఈఓ ధర్మారెడ్డి.దారి మళ్లిస్తున్నవిషయం తెలిపారు.

 

నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జులకు కూడా ప్రతిరోజూ కోటాలో బ్రేక్ దర్శన్, సుపథం టిక్కెట్ల జారీ చేస్తున్నారన్నారు.

ఈసీ ని కలిసిన బృందం లో టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, బీజేపి అధికార ప్రతినిధి

సాదినేని యామిని శర్మ, మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ తదితరులున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 29, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam