DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తమిళనాడు లో డీఎంకే ఓడుతుందని చెప్పిన చిలక జోస్యుడు అరెస్ట్

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*చెన్నై / విశాఖపట్నం, ఏప్రిల్ 13, 2024 (డి ఎన్ ఎస్):* పిచ్చి ముదిరి రోకలి చుట్టుకుంటున్న అధికార పార్టీకి విచక్షణ లేకుండా గుడ్డిగా తలూపుతున్న అధికారుల అత్యుత్సాహానికి సామాన్య జనం నానా చీవాట్లు పెడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు లోని కడలూరు కు చెందిన సెల్వరాజ్‌ అనే 81

సంవత్సరాల ఓ చిలక జ్యోతిష్కుడు రోడ్డు ప్రక్కన తన చిలకతో జోతిష్య సూచనలు చెప్తుంటాడు. దీన్ని గిని జాతక శాస్త్రం అని పేరు. 
ఈ క్రమం లోనే రెండు రోజుల క్రితం కడలూరు లోక్ సభ ఎన్నికల్లో అధికార డీఎంకే అభ్యర్థి ఓడిపోతారని అని చెప్పాడు. పీఎంకే అభ్యర్థి టంగర్ బచ్చన్ గెలుస్తాడంటూ చెప్పాడు. దీన్ని వీడియో చిత్రీకరించి సోషల్

మీడియా లో వైరల్ చేసారు. దాంతో అధికార పార్టీ తక్షణం ఆ జ్యోష్యుణ్ణి అరెస్ట్ చెయ్యమని ఆదేశాలు ఇచ్చేసింది. అంతే ముందు వెనుక చూడకుండా ఓ పెద్ద వ్యాన్ లో ఆ జ్యోషుడి ఇంటికి వెళ్లి మరీ అటవీ శాఖా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపేశారు. అటవీ జంతువుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఒక చిలకను వ్యాపారం వస్తువుగా చేసాడు అంటూ కేసు

నమోదు చేసారు. 

 ఈ ఘటన చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసేసారు. సెల్వరాజ్‌ను పట్టుకుని, అతని బోనులో రెండు చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. అంతే. .ఈ వీడియో చూసి న వాళ్లంతా అటవీ శాఖా ఓవర్ ఆక్షన్ కి నానా చీవాట్లు పెడుతున్నారు. 

మాట సందర్భంగా కూడా ఓడిపోతాం అనే పదం వినపడకూడదు ని

డీఎంకే ఆదేశాలు జారీ చేసినట్టు ఉంది బీజేపీ, పీఎంకే మండిపడుతున్నాయి. 
గత మూడేళ్ళ కాలంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె. అన్నామలై అధికార పార్టీకి చూపిస్తున్న చుక్కలను భరించలేని డీఎంకే అతి సామాన్య ప్రజలపై విరుచుకు పడుతోంది అనడానికి ఈ చిలక జ్యోష్యుడి అరెస్ట్ ఒక నిదర్శన, ఈ ఘటనపై

పీఎంకే చీఫ్ అన్బుమణి రాందాస్ మండిపడ్డారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 30, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam