DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఏఎస్ లక్ష్య సాధనే నా ధ్యేయం: ఇంటర్ ర్యాంకర్ మయూఖ్ 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*

*విశాఖపట్నం, ఏప్రిల్ 20, 2024 (డి ఎన్ ఎస్):* కఠోర శ్రమ చేసి, భారత దేశ అత్యున్నత పరీక్షల్లో విజయం సాధించి ఐ ఏ ఎస్ అధికారి కావాలని ఇంటర్ రాష్ట్ర రాష్ట్ర ర్యాంకర్ ఆరుద్ర మయూఖ్ భాగవతుల మయూఖ్ తెలిపారు.  

ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ద్వితీయ ఇంటర్ లో విశాఖ

నగరానికి చెందిన ఆరుద్ర మయూఖ్ 929 మార్కులతో రాష్ట్ర స్థాయి అగ్ర శ్రేణి ర్యాంకు సాధించాడు. శనివారం నగరం లోని భారతీయ విద్యా కేంద్రం జూనియర్ కళాశాల లో జరిగిన కార్యక్రమం లో ఆరుద్ర మయూఖ్ ను ను బివికే కళాశాల ప్రిన్సిపల్  రమా ఆచంట అభినందించారు. ఇదే కళాశాలలో మయూఖ్ ఇంటర్ రెండు సంవత్సరాలు చదివాడు. రెండేళ్ల ఇంటర్ లో హెచ్.ఇ.సి.

గ్రూపు లో ఈ స్థాయి మార్కులు సంపాదించడం సామాన్య విషయం కాదు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో 929 మార్కులు సాధించి కళాశాల అన్ని గ్రూపులలో ప్రధముడిగా నిలిచాడు, పదవ తరగతి వరకు విశాఖ వ్యాలీ స్కూల్లో చదివి, ఇంటర్లో బి.వి.కె. కళాశాలలో  చదువుకోవడం గర్వంగా భావిస్తున్నానని తెలిపాడు. 
తన తల్లిదండ్రులు ఇరువురు

ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారని, వారి ప్రోత్సాహం కూడా ఈ విజయంలో భాగమేనని అన్నారు. తండ్రి శంకర్ నీళ్లు ప్రభుత్వ పాఠశాల లో డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పలు స్వచ్చంద సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ఆర్ట్స్ విభాగం అధ్యాపకులు తదితరులు ఆరుద్ర మయూఖ్ ను

అభినందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam