DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూ కుంభ కోణంపై సిట్ నివేదిక బహిర్గతం చెయ్యాలి  : విష్ణుకుమార్ రాజు 

విశాఖపట్నం, నవంబర్ 8 , 2018 (DNS Online ) : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణాల కేసులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ ( ప్రత్యేక దర్యాప్తు

సంస్థ) ఇచ్చిన నివేదిక ను తక్షణం బహిర్గతం చెయ్యాలని విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పి విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ శాసన సభ

పక్ష నేతగా అయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ సభలో తాను డిమాండ్ చేసిన మేరకే ఈ సిట్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని, అలాంటిది ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తనకు ఒక కాపీ

ఇవ్వడం పద్దతి అని అన్నారు. అయితే ఈ కుంభకోణం పై దర్యాప్తు కు ఆదేశించిన ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. ఈ విచారణ బృందం చేపట్టిన విచారణలో అధికార, ప్రతిపక్ష,

అనధికార ప్రతినిధుల పాత్ర ఉందని, అయితే  à°…ధికారులు ప్రభుత్వానికి అందించిన నివేదిక లో చంద్రబాబు తమకు అనుకూలంగా ఉన్న లైన్లను మాత్రం బహిరంగంగా

ప్రకటించడాన్ని తప్పు పట్టారు. హైటెక్ పాలనా అందిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు, తక్షణ ఈ సిట్ నివేదికను ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్ లోడ్

చెయ్యాలని, లేదా, రాష్ట్రం లోని అందరు శాసన సభ్యులకూ ఒక కాపీని అందించాలని డిమాండ్ చేశారు. తాము కేవలం ప్రభుత్వ భూములపై మాత్రమే దృష్టి సారించామని, ఈ విచారణలో

ప్రయివేట్ భూములు కూడా ఉన్నట్టు తెలిసిందన్నారు. అధికార పార్టీకి చెందిన పెద్దలు, వారి అనుచరులు, బంధువులు, ప్రభుత్వ అధికారులు ఇలా ఎవరికీ ఈ కుంభకోణం లో పాత్ర

ఉందొ బహిరంగంగా అందరికీ తెలియచేయాల్సిన భాద్యత చంద్రబాబు పై ఉందన్నారు. 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #land scam  #sit  #investigation  #vishnu kumar raju  #BJP  #MLA  #Telugudesam  #Chandrababu Naidu  #Assembly #Report

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam