DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారం లోకి వస్తే బాబులు తిన్న ప్రతి పైసా కక్కిస్తాం. : వైకాపా 

లక్ష ఎకరాల భూ స్వాహాలో లోకేష్ ను తప్పించే ప్రయత్నం: వైకాపా 

భూ కుంభకోణం లో సిట్ అండ్ స్టాండ్ లు టీడీపీ కె పరిమితం : వైకాపా 

పేర్లు తారుమారు

చెయ్యడానికి  8 నెలలు పట్టింది 

విశాఖపట్నం, నవంబర్ 8 , 2018 (DNS Online ) : మరో నాలుగు నెలల్లో జరుగనున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారం లోకి వచ్చిన వెంటనే చంద్రబాబు

నాయుడు, లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు తిన్న అవినీతి సొమ్మును, పైసలతో సహా కక్కిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు విశాఖ నగర

అధ్యక్షులు మళ్ల విజయ్ ప్రసాద్ మండిపడ్డారు. గురువారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అక్రమాలపై విచారణ కమిటీలు వేసి, ప్రతి

ప్రోజక్టులో జరిగిన అవినీతి ని బహిర్గతం చేసి, తిన్నవాడిచే ప్రతి పైసా కక్కిస్తామని హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లక్ష ఎకరాల భూ కుంభకోణం లో

రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ నేతల  à°¹à°¸à±à°¤à°‚ ఉంది అని ప్రతిపక్ష పార్టీ ఆధారాలతో నిరూపించినా ముఖ్యమంత్రికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని

మండిపడ్డారు.విశాఖపట్నం భూ కుంభకోణాల కేసులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ ( ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఇచ్చిన నివేదిక లో మంత్రి లోకేష్, గంటా తదితర

మంత్రులు ప్రమేయం ఉంది అని వెలుగు చూసిన క్రమంలో వారి పేర్లు తారుమారు చేసేందుకు రాష్ట్ర క్యాబినెట్ నానా హైరానా పడిందన్నారు. ఈ నివేదికలోని పేర్లను మార్చి,

ప్రతిపక్ష పార్టీ నేతలను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. లోకేష్ పేరు అందరికీ బహిర్గతం అయినా అతని పేరు తప్పించేందుకు అధికారులనే తప్పుదారి

పట్టించారన్నారు. 
రాష్ట్ర ప్రభుత్వం అంతా అవినీతి మయంగా మారిపోయింది. గోదావరి పుష్కరాల్లో 30 మందిని మరణానికి కారణం ముఖ్యమంత్రేనని, అతని పై వీరి హత్య కేసు

చేసిన ఘటనగానే చూడాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం పైగానే, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం గానీ చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క లేఖ కూడా

కేంద్రానికి రాసిన పాపాన పోలేదన్నారు. విశాఖ విమానాశ్రయం లో వైఎస్ జగన్ పై జరిగిన దాడి క్రమం లో రాష్ట్ర డిజిపి, ముఖ్యమంత్రులు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. ఈ

విలేకరుల సమావేశం లో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ రమణ మూర్తి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇంచార్జి కేకే రాజు, విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి వంశీ

కృష్ణ యాదవ్, సీనియర్ నేతలు ప్రసాద్ రెడ్డి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు గారికిన గౌరీ, యువ నాయకుడు కొండా రాజీవ్ గాంధీ, తదితరులు తదితరులు

పాల్గొన్నారు.

 

 

#dns  #dnslive  #dns live  #dnsnews  #dns news  #dnsmedia  #dns media  #vizag  #visakhapatnam  #land scam  #sit   #investigation  #Telugudesam  #Chandrababu Naidu  #Assembly  #Report  #Malla Vijay Prasad  #ex MLA  #Government

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam