DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెగ్యులర్ చేయకుంటే ఎయు పాలన స్తంభింప  చేస్తాం: తాత్కాలిక సిబ్బంది 

విశాఖపట్నం, నవంబర్ 27, 2018 (డిఎన్ఎస్ DNS Online): గత రెండున్నర దశాబ్దాలుగా తాత్కాలిక పద్ధతిలోను, 28 రోజుల విధానంలోనూ, టైం స్కెల్ లోను పనిచేస్తున్న వారికి పూర్తిస్థాయి వేతనం

ఇవ్వని పక్షం లో ఎయు పాలనను స్తంభింపచేస్తామని ఆంధ్ర విశ్వ విద్యాలయం తాత్కాలిక సిబ్బంది హెచ్చరించారు. మంగళవారం ఎయు కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన మహా

ధర్నాలో పెద్ద సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కుమార్ మాట్లాడుతూ ఎయు కు ప్రత్యేక ప్రాతిపదిక ఉందని, వేతనాలు ఇచ్చుకునే

శక్తి సంస్థ కు ఉందన్నారు. అయితే వీరందరికీ జీతాలు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ ఎయు అధికారులు ప్రభుత్వానికి లేఖ వ్రాస్తే తిరస్కరించారన్నారు. దీనిపై నగరానికి

చెందిన ఎమ్మెల్యేలు శాసన సభలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేటికీ ఠికానా లేదన్నారు. ఈ వేదిక నుంచి రాష్ట్ర విద్య శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు కు హెచ్చరికలు

జారీ చేశారు. గతం లో ఎన్నో మార్లు గంట దృష్టికి తమ సమస్యను తీసుకు వెళతామని అయితే ఆయనకి కూడా పట్టింపులేదన్నారు. పైగా మంత్రి గంటా కూడా ఈ విద్యాలయం పూర్వ

విద్యార్దేనన్నారు. అయినా తమ గోడు పట్టలేదన్నారు. దీనికి నిరసనగా డిసెంబర్ 7 న ఎయు బంద్ కు పిలుపుఇచ్చినట్టు తెలిపారు. ఈ ధర్నా లో సుమారు 400 మంది సిబ్బంది

పాల్గొన్నారు. à°ˆ ధర్నా తో మంగళవారం ఎయులోని చాలా విభాగాల్లో పనులు నిలిచిపోయాయి. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #andhra unviersity  #protest  #temporary employees  #time scale  #bandh

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam