DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిసెంబర్ 28 నుంచి విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తాం: మంత్రి గంటా 

సోషల్ మీడియా అవార్డులు, కార్, బైక్ బహుమతులు

బ్రెజిల్ తరహాలో కార్నివాల్, ప్రముఖులకు సమ్మానాలు 

విశాఖపట్నం, నవంబర్‌ 28, 2018 (డిఎన్‌ఎస్‌): à°—à°¤ కొన్నేళ్లుగా

 à°…త్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ ను à°ˆ ఏడాది డిసెంబర్ 28 నుంచి 30  à°µà°°à°•à± మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి

à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం  à°¨à°—à°°à°‚ లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే à°ˆ ఉత్సవం లో

నగరం లోని అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలను భాగస్వాముల్ని చేస్తామన్నారు. ప్రారంభోత్సవ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని, బ్రెజిల్

కార్నివాల్ తరహాలో భారీ స్థాయిలో ఇది జరుగుతుందన్నారు. రాఫెల్ డ్రా ద్వారా మొదటి బహుమతి కారు, ద్వితీయ బహుమతిగా బైక్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియా

అవార్డులను అందిస్తామని, నగర, జిల్లా పరిధిలో వివిధ రంగాల్లో ప్రముఖమైన సేవలందించిన వారికి à°ˆ వేదిక పై సమ్మానం చేస్తామని తెలిపారు.  

ప్రారంభోత్సవం

:

డిసెంబర్ 28 న సాయంత్రం బ్రెజిల్ తరహాలో భారీ స్థాయిలో కార్నివాల్ నిర్వహిస్తామని, దీనిలో వివిధ రూపాలకు చెందిన కళాకారులూ కళారూపాలను ప్రదర్శించనున్నారు.

విద్యార్థులు, శకటాలు, నేవి బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయని తెలిపారు. రెండు ప్రధాన వేదికలు ఉంటాయని, ఒకటి విశాఖ సాగర తీరంలోని రామకృష్ణ బీచ్ లోను,

రెండవది నోవాటెల్ హోటల్ డౌన్ లో జాతర పేరుతొ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు అవుతాయన్నారు. విశాఖ మెట్రో రీజినల్ డెవెలప్మెంట్ అధారిటీ ( వి ఎం ఆర్ డి ఏ - పూర్వపు

ఉడా) ఆధ్వర్యవంలో విశాఖ సెంట్రల్ పార్కు లో ఫ్లవర్ షో, దేవాదాయ శాఖా ఆధ్వర్యవం లో నమూనా దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. నేవీ సహకారం తో ఎయిర్ షో ను

కూడా నిర్వహించేందుకు ఏర్పాటు జరుగుతుందన్నారు. నగరంలో పండుగ  à°µà°¾à°¤à°¾à°µà°°à°£à°¾à°¨à±à°¨à°¿ కల్పించేందుకు అన్ని ప్రధాన వీధులను, ప్రాంతాలను, కూడళ్లను, షాపింగ్ మళ్లను,

ప్రభుత్వ భవనాలను రంగు రంగు ల విధ్యుత్ దీప కారులతో అలంకరించబడతాయన్నారు. దుబాయి రాఫిల్ డ్రా తరహాలో మొదటి బహుమతిగా కారు, రెండవ బహుమతిగా బైక్ ను అందిస్తామన్నారు.

ఈ ఉత్సవాలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఎంపిక కమిటీ నియమించబడుతుందన్నారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన సోషల్ మీడియా అవార్డుల మాదిరిగా ఇక్కడ

కూడా సోషల్ మీడియా అవార్డులు ఇస్తామని à°—à°‚à°Ÿ తెలిపారు. ప్రజల నుంచి ఆశించినంత ఆదరణ లేకపోవడంతో  à°—తం లో ప్రారంభించిన హెలి టూరిజం కార్యక్రమాన్ని

నిలిపివేశామన్నారు. మరొక్కసారి ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈ హెలి టూరిజం ను డిసెంబర్ 23 నుంచి తిరిగి కొనసాగిస్తామన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 3 .50

కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. గత ఉత్సవాల లెక్కలను ఈ ఉత్సవాల్లో పాదార్థిస్తామన్నారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, వి ఎం ఆర్ డి ఏ కమిషనర్ పి

బసంత్ కుమార్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, పర్యాటక శాఖా ప్రాంతీయ సంచాలకులు రాధాకృష్ణ, జిల్లా పర్యాటక శాఖా అధికారిని పూర్ణిమ దేవి

తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ganta srinivasa rao  #visakha utsav  #brazil carnival 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam