DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం : డీఎంహెచ్ ఓ 

విశాఖపట్నం, నవంబర్ 30 ,2018 (DNS Online ): ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్ వ్యాధిపై గ్రామ స్థాయి నుంచి  à°ªà±à°°à°œà°²à°¨à± అప్రమత్తం చేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

డా.తిరుపతిరావు అన్నారు. శుక్రవారం డి ఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డిశంబరు 1వ తేది ర్యాలీ

మరియు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని ఒక కొత్త నినాదం, ఆశయంతో జరుపుకుంటున్నామన్నారు. అదే విదంగా ఈ

సంవత్సరం కూడా మీ హెచ్ ఐ వి స్ధితిని తెలుసుకోండి అనే నినాదం తో కొత్తగా ఏ ఒక్కరిని హెచ్ ఐ వి భారిన పడకుండా చేయడం, ఇప్పటికే హెచ్ ఐ వి సోకిన వారిని ఎటువంటి వివక్ష

లేకుండా సామూహికంగా కలుపుకొని పోవడం ప్రధాన అంశంగా పెట్టుకొని అన్ని ప్రభుత్వ శాఖలు మరియు ప్రభుత్వసంస్థలు, స్వచ్చంద కార్యకర్తలు సంయుక్తంగా కృషి చేసి

లక్ష్యాన్ని చేరుకొనే విదంగా జరుగుతుందన్నారు. హెచ్ ఐ వి సోకిన గర్భిణీలకు ప్రత్యేకంగా వైద్య సేవలను అందించడం తో పాటు పుట్ట బోయే శిశువులకు ఈ వ్యాధి సోకకుండా

తగిన మందులను అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలు, రెండు సంచార పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, అన్ని ఆరోగ్య కేంద్రాలలో రక్త పరీక్షలను

నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 9గంటలకు జి.వి.ఎం సి గాంధీ విగ్రహాం నుండి ర్యాలీ బయలు దేరి ఎ యు అంబేద్కర్

అసెంబ్లీ హాలు వరకు కొనసాగి అక్కడ సమావేశం జరుగుతుందన్నారు. 
ప్రజల ఆరోగ్య భద్రత మాతా శిశు సంరక్షణ ధ్యేయంగా పలకరింపు - 2 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం

ప్రతిష్టాత్మకంగా డిశంబరు 1 నుండి 31వ తేది వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా శిశు సంక్షేమం, పట్టణ పేదరిక నిర్మూలన, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది సమన్వయంతో

బృందంగా ఏర్పడి ఇంటింటికి సందర్శించి ఆయా గృహాలలో గర్బిణీలు, బాలింతలు, చిన్నారులను గుర్తించి వారికి టీకాలు, వ్యాదుల నివారణకు సంబందించి వైద్య సేవలను

అందించడం జరుగుతుందన్నారు. ఆశా, అంగన్ వాడీ వర్కర్లు రోజుకు 10 గృహాలను సందర్శిస్తారన్నారు. 
జిల్లాలో ఇప్పటి వరకు 71 à°¸à±à°µà±ˆà°¨à±  à°ªà±à°²à±‚ కేసులు నమోదయ్యాయని, 5గురు

60సంవత్సరాల పైబడి ఇతర దీర్ఝకాల వ్యాధులు కలిగిన వారు చనిపోయారన్నారు. దగ్గు, జలుబు, గొంతునొప్పి, కళ్లమంటలు, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ

ఆసుపత్రులలో వైద్య పరీక్షలను చేయించుకోవాలన్నారు. ముందు జాగ్రత్తగా దగ్గిన, తుమ్మిన కర్చీఫ్ లను అడ్డుగా పెట్టుకొని చుట్టప్రక్కల వారికి వ్యాప్తి చేందకుండా

చూసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కన్న పట్టణ ప్రాంతాలలో ఈ కేసుకు ఎక్కువగా నమోదౌతున్నాయన్నారు. సై#్వన్ ప్లూ పరీక్షలకు సంబందించి జిల్లాలో 12 సెంటర్లు

ఉన్నాయన్నారు. కె.జి.హెచ్, చెస్ట్ ఆసుపత్రులలో వెంటిలేటర్లు, ప్రత్యేక వార్డులు, స్పెషలిస్టు డాక్టర్లు ఉన్నారన్నారు. 
à°ˆ  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో జిల్లా ఎయిడ్స్

నియంత్రాణాధికారి à°¡à°¾.రమేష్, వైద్య ఆరోగ్య శాఖా జిల్లా సిబ్బంది పాల్గొన్నారు. 

 

#dns  #dns media  #dns live  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #swaine flu  #dmho   #medical  #health department

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam