DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ అమ్ముల పొదిలో మరిన్ని యుద్ధ నౌకలు సిద్ధం : వైఎస్ అడ్మిరల్ కరం బీర్ సింగ్ 

భారత్ అమ్ముల పొడిలో మరిన్ని  à°¯à±à°¦à±à°§ నౌకలు సిద్ధం : వైఎస్ అడ్మిరల్ à°•à°°à°‚ బీర్ సింగ్ 

విశాఖపట్నం, డిశంబర్ 3 , 2018 (DNS Online ):  à°ªà±à°°à°ªà°‚à°šà°‚ లోనే అత్యంత పటిష్టమైన నావికాదళం

లోకి అతి త్వరలోనే మరిన్ని యుద్ధ నౌకలు రానున్నాయని తూర్పు నౌకాదళపతి వైఎస్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ తెలిపారు. సోమవారం తూర్పు నావికాదళ ప్రధాన కేంద్రం వద్ద ఐ ఎన్

ఎస్ సహ్యాద్రి నౌక పై నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ బంగ్లా విమోచన యుద్ధంలో భాగంగా కరాచీ మీద 1971 లో భారత నౌకాదళం విజయవంతంగా జరిపిన దాడికి విజయ

సంకేతంగా ప్రతి ఏటా డిసెంబరు నాలుగున నేవీ దినోత్సవాన్ని జరుపుతున్నట్టు తెలిపారు. భారత నౌకాదళం గత 75 ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద దళాల్లో ఒకటిగా, సమర్ధమైన

శక్తిగా మారిందన్నారు. లుక్ ఈస్ట్, టేక్ ఈస్ట్ విధానాలతో తూర్పు నౌకాదళం ప్రాధాన్యత పెరిగిందన్నారు. దేశ రక్షణతో పాటు ప్రకృతి ఉపద్రవాలనుంచి దేశ, విదేశ ప్రజలను

రక్షించటం, సహాయపడటం వంటి సేవల్లో తూర్పు నౌకాదళం నిమగ్నమవుతోందన్నారు. మత్స్యకారులను, వాణిజ్యనౌకా సిబ్బందినీ రక్షించటం వంటి పనులతో పాటు ఆయా బోట్లలో,

నౌకల్లో ముందస్తు భద్రతా, రక్షణ చర్యలు ఎపి ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నామన్నారు. దేశీయ పరిజ్ఞానంతో యుద్ధ నౌకల నిర్మాణం మొదలు, ఆయుధాలు, క్షిపణుల వరకూ

తయారవుతున్నాయన్నారు. విమాన వాహక నౌకలు సైతం దేశీయంగానే తయారవుతాయన్నారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య నేవీసేవలకు సిద్ధమైందనీ, మరో రెండు విమాన వాహక నౌకలు రానున్నాయనీ

తూర్పు నౌకాదళాధిపతి తెలిపారు. 
ప్రజలకు అందుబాటులో, ప్రజా సంక్షేమం లో భారతీయ నౌకాదళం ఉందన్నారు. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో ప్రాంతాలకు అతీతంగా

భారతీయ నేవీ తక్షణ ప్రమాద ఘటన స్థలాలకు చేరుకొని ప్రజలను రక్షిస్తోందన్నారు. ఇటీవల సముద్ర ప్రమాదాలు, గోదావరి, కృష్ణ నదుల్లో జరిగిన పడవ ప్రమాదాలు, ఉత్తరాంధ్ర లో

సంభవించిన హుదూద్ తుఫాన్, ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ఏర్పడిన టిట్లి తుఫాన్ సమయాల్లో నేవీ తనదైన సహకారాన్ని అందించిందన్నారు. మ్రత్యకారులకు ఎప్పడికప్పుడు

రక్షణా సూచనలు చేస్తున్నామని, మత్యకార గ్రామాల్లో నేవీ వైద్య బృందాలచే ఉచిత వైద్య శిబిరాలు, చికిత్సలు జరుపుతున్నామని తెలిపారు. నావీ అధికారాల శ్రీమతుల సంఘం

ఆధ్వర్యవం లో బాల బాలికలకు ప్రోత్సాహకాలు అందిస్తూ, వారితో కలిసిమెలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. 
మిషన్ డిప్లాయ్డ్ ఆపరేషన్స్ అనే

విధానాన్ని ప్రస్తుతం భారత నౌకాదళం అనుసరిస్తోందని, దీనివల్ల అవసరమైన చోట, అనుకున్న సమయానికి అందుబాటులో ఉంటామనీ తూర్పు నౌకాదళాధిపతి అన్నారు. 
విశాఖ

అభివృద్ధికి కూడా తాము ఎన్నో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈఏడాది సింగపూర్ తో జరిగిన సింబెక్స్ అనే సంయుక్త విన్యాసాల్లో తొలిసారిగా టార్పెడోల ప్రయాగం కూడా

జరిగిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాల ప్రభుత్వాలతో ఎప్పడికప్పుడు చర్చలు, సమావేశాలు జరుపుతూ వారికి అవసరాల్లో

సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు. 

సాహస మహిళా స్వాతి à°•à°¿ అభినందనలు. 

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఐ ఎన్ ఎస్ తరుణీ నౌక పై పర్యటించిన ఆరుగురు సాహస మహిళా

నావికాదళ సిబ్బంది బృందంలో ఒకరుగా ఉన్న విశాఖ నగరానికి చెందిన స్వాతి ని వైస్ అడ్మిరల్ సహా తూర్పు నావికాదళ సిబ్బంది అభినందించారు. విశాఖ నగరానికి చెందిన ఈమె

భారతీయ నావికాదళం లో విధులు నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన à°ˆ యాత్ర ను పశ్చిమ తీరం  à°—ోవా లో భారత దేశ రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ప్రారంభించి అశీసులు

అందించారన్నారు. ఈ బృందం అత్యంత క్లిష్టమైన వాతారవరణం లో సైతం సురక్షితంగా ప్రపంచ దేశాలు తిరిగి భారత జాతి కీర్తి పతాకను ఎగురవేశారన్నారు. ఈ విధమైన మహిళా

సిబ్బంది తమ బృందం లో ఉన్నారని తెలిపారు. à°ˆ విలేకరుల సమావేశం పలువురు ఉన్నత స్థాయి నావికా దళ సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam