DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పప్పు-తుప్పు నాయుళ్ల  ధన నికృష్టాన్ని బహిర్గతం చేస్తా : విజయసాయిరెడ్డి 

బాబు పది నాల్కల రాక్షస రావణుడే 

నాపై క్రిమినల్ చర్యలు తీసుకున్న ఎదుర్కోడానికి సిద్ధం : 

పప్పు - నిప్పు నాయుళ్లు ఎన్నికల్లో కోట్లాది డబ్బు

కుమ్మరిస్తున్నారు 

విశాఖపట్నం, డిశంబర్ 4 , 2018 (డిఎన్ఎస్ ):  à°†à°‚ధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (తుప్పు), అతని కొడుకు లోకేష్ (పప్పు) లు ఎన్నికల్లో

కోట్లాదిగా నిధులు కుమ్మరిస్తున్నారని, వీటన్నింటినీ బట్టబయలు చేస్తానని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి ప్రకటించారు. మంగళవారం

నగరం లోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ పప్పు నాయుడు - తుప్పు నాయుడు ఆంధ్ర ప్రజలను మోసం చేసి సంపాదించిన కోట్లాది రూపాయలను ఎర వేసి

ఎన్నికల్లో ఓట్లు కొనుగోలుకు నానా హైరానా పడుతున్నారన్నారు. దీనిపై వాస్తవాలు బయటపెడుతున్న తనపై క్రిమినల్ కేసులు అక్రమంగా బనాయించేందుకు చంద్రబాబు ప్రణాళిక

సిద్ధం చేసినట్టు తెలుస్తోందని, తాము ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళం కాదన్నారు. ఇప్పడికే  à°¤à±†à°²à°‚గాణా ఎన్నికలకు చంద్రబాబు 1200 కోట్లు తరలించారని,

 à°¤à±†à°²à±à°—ుదేశం -కాంగ్రెస్ పార్టీల డీల్ ఏమిటో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రకటనల్లో వాళ్ళ నేతల ఫోటోలు చిన్నవి,

చంద్రబాబు ఫోటోలు పెద్దవిగా కనిపిస్తున్నాయాంటేనే వీళ్ళ దొంగాట అర్థమవుతోందన్నారు. ఇటీవల జరిగిన రాజస్దాన్ .మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా 500

కోట్ల రూపాయలు చంద్రబాబు పంపారుని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాహుల్ గాంధికి ఐదు వేల కోట్లు చంద్రబాబు ఇస్తానన్నారు అంటేనే వీళ్ళ నీచ నికృష్ట రాజకీయ చరిత్ర

బహిర్గతమవుతోందన్నారు. ఆంధ్రా లో వివిధ ప్రోజక్టుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు ఒక్క రూపాయి కూడా లెక్క చెప్పకుండా ఏపిలో దోచిన డబ్బంతా ఎన్నికలలో

ఖర్చుపెడుతున్నారని, ఒక్కో ఓటుకు ఐదువేల రూపాయలు ఇస్తామని నంద్యాల ఎన్నికల్లో చెప్పారని మండిపడ్డారు. 

డబ్బు తరలించేది : యరపతే
పప్పు నాయుడు - తుప్పు నాయుడు

ఏ రోజు ఆ డబ్బు ఎక్కడకు ఎలా , ఎంత తరలిస్తారు అని ప్రజలందరికి తెలియచేయాల్సిన భాద్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందన్నారు. ఈ నికృష్ట కార్యాచరణలో ప్రత్యక్షంగా

పాల్గొనేవారిలో  à°ªà°ªà±à°ªà±à°¨à°¾à°¯à±à°¡à±à°¤à±‹ ఉన్న రాజేష్, శ్రీనివాస్ ,అజ్ఞాత వ్యక్తి గోపి, యరపతినేని శ్రీనివాసరావు, సుబ్బారావులు ఉన్నారని, వారు ఎలా తరలించబోతున్నారో సమయం

వచ్చినప్పడు చెప్తానని విజయ సాయి రెడ్డి ప్రకటించారు. 

తుప్పు నాయుడు రెండు  à°¨à°¾à°²à±à°•à°²à± ఉన్న చంద్రుడు కాదని, పదినాలుకలు ఉన్న .రావణసురుడు అని, అతనికి పదితలల్లా

ఇతనికి పదినాలుకలు ఉన్నాయన్నారు. 

నిప్పు - పప్పు లు  à°…వినీతిలో హిమలయాల అంచులకు వెళ్లారని, ప్రజాస్వామ్యంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారని, ఇక

వీళ్ళకి పతనం తప్పదన్నారు. 

ఎన్నో టెండర్లకు సంబంధించి ఏకంగా నలభై శాతం రేటు ఫిక్స్ చేసిన దుర్మార్గ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనని తెలిపారు. నేనే

నీతిమంతుడ్ని, నాకంటే సీనియర్ లేడు భారతరాజకీయాలలో అని గొప్పలు చెప్తాడు, ఎలాంటి పరిస్దితులలోనైనా డబ్బు ఖర్చు పెట్టి తిరిగి అధికారంలోకి రావాలని

భావిస్తున్నాడన్నారు. 

తాను చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారమా ?

తెలంగాణాలో తమ సొంత పార్టీ ఎంఎల్ ఏలు టిఆర్ ఎస్ లోకి వెళ్లారని చంద్రబాబు అక్కడకు

వెళ్లి వారంతా ద్రోహులని అంటున్న తుప్పు నాయుడు, ఆంధ్రా లో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎంఎల్ ఏలను కొన్న సంగతి గురించి మాట్లాడదన్నారు.

ఇతను చేస్తే సంసారం అంటాడు, ప్రక్కవాడు చేస్తే వ్యభిచారం అంటాడు అని హేళన చేశారు. 

అవినీతిపరులు కాంగ్రెస్ గూటికే అన్నాడు, తానే చేరాడు. 

ప్రజలనుంచి

దోచుకున్న సొమ్మును ఎన్నికలలో ఖర్చు పెట్టకుండా చూస్తాం.దానిని సరైన తీరులో ఎదుర్కొంటామని, అవినీతిపరులందరూ కూడా కాంగ్రెస్ పంచన చేరతారని 2013 లో చంద్రబాబు

ప్రకటించారు, నేడు దాన్ని నిజం చేస్తూ 
à°ˆ నిప్పునాయుడు,తుప్పునాయుడు ఇప్పుడు రాహుల్ ( కాంగ్రెస్)  à°ªà°‚à°šà°¨ చేరాడని ఎద్దేవా చేశారు. 

ప్రత్యేక హోదా కోసం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులను తృణప్రాయంగా వదిలివేశారని, అదే టిడిపి ఎంపీలు గబ్బిలాల్లా పదవులు పట్టుకుని వేలాడుతున్నారని వెటకారం చేశారు.

రాష్ట్రం లో  à°ªà°¦à°¿à°œà°¿à°²à±à°²à°¾à°²à±à°²à±‹ కరవు విలయతాండవం చేస్తుంటే చంద్రబాబు తెలంగాణాలో జనం రాని సభలకు హాజరవుతున్నాడని, రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకు బుధ్ది

చెప్పడానికి సిధ్దంగా ఉన్నారన్నారు.  à°ªà±à°°à°œà°²à°•à± మేలు చేయాలన్న మంచి మనస్సున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి.ఆయనకు అవకాశం ఇవ్వండి. ఒకసారి అవకాశం ఇస్తే మూడు దశాబ్దాల

కాలం ఆంధ్ర ప్రదేశ్ సువర్ణ యుగాన్ని అనుభవిస్తుందన్నారు.  

విజయవాడలోని చిన్న బ్రిడ్జి కట్టలేని చంద్రబాబు హైద్రాబాద్ కట్టాడంట.శంషాబాద్

విమానాశ్రయంకట్టాడా అని ఎద్దేవా చేశారు. -ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మవద్దని సూచించారు. 

జనసేన పార్టీ  à°•à±‚à°¡à°¾ టిడిపి వైపు మొగ్గుచూపుతోందని, దాని

వంకరబుద్ధికి ప్రజలు గట్టిగా బుధ్ది చెప్పాలని పిలుపునిచ్చారు. 
మాకు ప్రధాన ప్రత్యర్ది తెలుగుదేశమే తప్ప, పిల్లపిచుక  à°œà°¨à°¸à±‡à°¨à°¨à± అసలు మేము గుర్తించడం

లేదన్నారు.

2014 ఎన్నికలల్లో ఎలా అయితే డబ్బులు తీసుకుని కాల్ షీట్లు ఇచ్చారో, అలాగే  à°¨à±‡à°¡à± కూడా పవన్ కల్యాణ్  à°šà°‚ద్రబాబుకు అమ్ముడుపోతున్నారన్నారు. 

à°ˆ

విలేకరుల సమావేశం లో విశాఖ పార్లమెంట్ సమన్వయ కర్త ఎంవివి సత్యనారాయణ, అసెంబ్లీ నియోజక సమన్వయకర్తలు మళ్ల విజయ్ ప్రసాద్ ( విశాఖ పశ్చిమం), తైనాల విజయ్ కుమార్ ( విశాఖ

ఉత్తరం), వంశీకృష్ణ శ్రీనివాస్ ( విశాఖ తూర్పు), కరణం ధర్మశ్రీ, రవిరెడ్డి, కేకే రాజు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ysr congress  #vijay sai reddy #hotel srikanya  #itc  #press meet

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam