DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వమేవ శరణం మమ:. . . .. మాధురి తో భాజపా ?

పూణే నుంచి ఎన్నికల బరిలోకి మాధురి ?

విశాఖపట్నం, డిశంబర్ 6 , 2018 (DNS Online ): రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అనే సంకల్పం తో  à°­à°¾à°°à°¤à±€à°¯ జనతా పార్టీ ఆఖరి

బ్రహ్మాస్త్రం కూడా వాడేసింది. 1980 ల్లో తన అందం, నటన తో భారత దేశాన్ని ఒక ఊపు ఊపిన అందాల నటి మాధురి దీక్షిత్ ను రానున్న ఎన్నికల బరిలోకి దింపే ప్రయత్నం లో భారతీయ జనతా

పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి తార్కాణమే ఇటీవల ముంబై పర్యటనలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మాధురి ఇంటికి వెళ్లి మరీ కలిసి, అంతరంగ చర్చలు జరిపినట్టు

సమాచారం. గత నాలుగున్నరేళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పధకాలను వివరించి, తమ పార్టీ తరపున ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి రావాల్సిందిగా అనధికారిక ఆహ్వానం

పలికినట్టు తెలుస్తోంది. ఇంతవరకూ భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల్లో గెలుపునకు వాడని అస్త్రం లేదంటే అతిశయోక్తి కాదు. మొదట్లో అయోధ్య లో రామాలయం నిర్మాణం

వాడేశారు, తాము అధికారం లోకి వచ్చినా అది పూర్తికాక పోవడం తో, ఇప్పుడు మాధురి దీక్షిత్ ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. కొత్తగా రాజకీయ ప్రవేశం చెయ్యడం తో

ప్రతిపక్ష పార్టీలకు ఈమెను విమర్శించే అవకాశాలు తక్కువ ఉంటాయనే ఆశ మోడీ- షా లకు ఉన్నట్టు వినికిడి. ఆమె అంగీకరిస్తే మహారాష్ట్ర లోని పూణే నగరం నుంచి లోక్ సభ

ఎన్నికల బరిలోకి దిగవచ్చు అని సమాచారం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam