DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెద్దల సేవలో తరించేందుకు సిబ్బంది రెడీ .

కనకమ్మ గుడిలో భక్తులకు ఈమారూ తిప్పలు తప్పేలా లేవు...

విశాఖపట్నం, డిశంబర్ 7 , 2018 (DNS Online ):  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న మార్గశిరమాసోత్సవాలకు

విశాఖనగరం లోని బురుజుపేట లో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సిద్ధమవుతోంది. అయితే అత్యధిక సంఖ్యలో భక్తులు రానున్నందున ఈ ఉత్సవ నిర్వహణ తాము ఆటంకాలు

లేకుండా నిర్వహించలేమని ఆలయ నిర్వాహకులు చేతులు ఎత్తేయడం తో జిల్లా యంత్రాంగం దీని భాద్యత తీసుకుంటోంది. గత కొన్నేళ్లుగా జిల్లా కలెక్టర్ నేతృత్వం లోనే ఈ

మార్గశిర మాసోత్సవాలు జరుగుతున్నాయి. తద్వారా ఈ నెల రోజుల పాటు ఆలయంలో జిల్లా రెవెన్యూ అధికారుల హంగామా, హడావిడి మొదలైపోతుంది. ఈ ఆలయంతో ఎటువంటి సంబంధం

లేనివాళ్లు సూపర్వైజర్లుగానూ, ఉత్సవ కమిటీ లోనూ ఉండడం తో భక్తులకు, నిత్యం వచ్చే మీడియా వారికీ తిప్పలు ఈసారి కూడా తప్పేలా లేవు. మీడియా వారికి కవరేజి పాసులు

ఇచ్చినప్పడికీ, అమ్మవారి దర్శనం కోసం అదనంగా ఎటువంటి పాసులు లేదా అనుమతి పత్రం ఇచ్చేది లేదని ఆలయ సిబ్బంది ఖరాఖండీ గా చెప్పేయడం తో, వెళ్లి అవమానం పాడడం ఎందుకని

చాలామంది మీడియా ప్రతినిధులు ఆలయానికి వెళ్లడమే మనుకుంటున్నారు. దూరం నుంచే అమ్మవారి దర్శనం చేసుకుని బయట నుంచే వెళ్లిపోతున్నారు. సాధారణ రోజుల్లో మీడియా

వారిని బ్రతిమాలుకునే ఆలయ వర్గాలు, à°ˆ ఉత్సవాల సమయంలో మాత్రం మొహం చాటేస్తున్నారన్నది వాస్తవం. 

భక్తుల కంటే విఐపీలు ఎక్కువ :
నిర్వాహకులు ఈ మార్గశిర

మాసోత్సవాల్లో సాధారణ భక్తుల కంటే విఐపీలకే పెద్ద పీట వెయ్యడం తో అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, అధికార పార్టీ

ప్రతినిధుల అనుచరులు తదితరులంతా ఇప్పుడు వీఐపీలు అయిపోతుంటారు. దీనికి తోడు రెవెన్యూ వర్గాలే వీటి నిర్వాహకులు కనుక, రెవిన్యూ సిబ్బందికి మహాద్వారం తలుపులు

తీసే ఉంటాయని మీడియా వర్గాలే ఘోషిస్తున్నాయి. 

ఏడాది కో మారు ఆలయం నుంచి ఇచ్చే ఒక పత్రిక ప్రకటన (అడ్వార్టైజ్మెంట్ ) కూడా కేవలం ఎంపిక చేసిన వారికే ఇవ్వడం

కోసం మెరుపు. దీంతో మీడియా వర్గాలు à°ˆ సమయంలో ఆలయం వైపే చూద్దాం కూడా మానుకునే ఆలోచనలో ఉన్నారు. 

సాధారణ రోజుల్లో పలికే ఈఓ కూడా ప్రస్తుతం పలికే అవకాశం కూడా

ఉండదు. అమ్మవారి దర్శనాల కోసం  
 à°ªà±ˆ అధికారుల నుంచి ఈఓపై  à°…à°‚à°¤ పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటుంది.  à°¸à°¾à°§à°¾à°°à°£ భక్తులకు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు పైకి చెప్తున్నా,

ఆచరణ లో మాత్రం ఫలితం శూన్యం గానే ఉంటుందన్నది అక్షర సత్యం. ఈ ఏడాదైనా విఐపీలను కట్టడి చేసి, సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తే భక్తుల నుంచి అభినందనలు

లభిస్తాయి. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #skml  #temple  #margasira #masotsavalu  #festival 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam