DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవాళికి మార్గదర్శకం ధనుర్మాసం, డిసెంబర్‌ 18 న వైకుంఠ ఏకాదశి

 

డిసెంబర్‌ 18 à°¨ వైకుంఠ ద్వార దర్శనం

విశాఖపట్నం, డిసెంబర్‌ 08, 2018 (డిఎన్‌ఎస్‌): à°®à°¾à°¸à°¾à°¨à°¾à°‚ మార్గశీర్షోహం అని గీతాచార్యుల సందేశం. మాసాల్లో మార్గశిరం

లాంటివాణ్ణి అని అర్ధం. శనివారం నుంచి ఆరంభమైన మార్గశిర మాసం లో ఎన్నో ఎన్నెన్నో పవిత్రమైన ఉత్సవాలు, సంబరాలు, దీక్షలు మొదలవుతాయి. విశాఖ నగరంలోని శ్రీ

కనకమహాలక్ష్మి అమ్మవారికి వార్షిక ఉత్సవాలు ఈరోజే మొదలవుతాయి. ఈ నెల రోజులూ ఏంటో ప్రాధాన్యత కలిగినవి. ఈ నెల లో జరుపుకులే ఉత్సవాల్లో ప్రధానమైనవి ఈనెల 18 న వచ్చే

ముక్కోటి ఏకాదశి. ఈ రోజున అన్ని వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది. నెలలో ఇదే రోజున గీతా జయంతి, సుబ్రహ్మణ్య షష్టి, తదితర ఉత్సవాలు అత్యంత వైభవంగా

జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  à°¶à±à°°à±€à°µà±ˆà°·à±à°£à°µ సంప్ర దాయంలో అత్యంత ప్రాముఖ్యత కల్గిన ఉత్సవాల్లో ధనుర్మాసం అత్యంత ప్రసిద్ధికెక్కినది. à°ˆ ఉత్సవాలు à°ˆ నెల 16 నుంచి

ధనుస్సంక్రమణం ఆరంభమవుతుండడంతో 17 వ తేది నుంచి నగరంలోని ఆలయాన్నింటిలోను ఘనంగా ప్రారంభమవుతున్నాయి. మార్గ శిర మాసంలో ధనూరాశి లోకి సూర్యుడు ప్రవేశించిన నాటి

నుంచి ధనుర్మాసారంభమవు తుంది. ఈ నెల రోజు కాలం అత్యం త వైభవంగా నియమ నిష్టతో ఉద యం 4 గంటల నుంచి విశిష్టమైన అర్చనలు, సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై పాశుర విన్నపం

నిర్వహిస్తుం టారు. మానవ జీవితానికి ఒక పరమా ర్ధాన్ని అందించే ఈ విధానం లో జాతి, మత భేదాు లేకుండా మానవాళికి అవసరమయ్యే విధి విధానాలను అందించింది ఈ కార్యక్రమ ఆరంభ

కర్త ఆండాళ్‌ తమిళ దేశం లోని శ్రీవిల్లి పుత్తూర్‌ అనే ప్రాంతంలో విష్ణుచిత్తులనే వైష్ణవ భక్తునికి తులసి వనంలో లభించిన ఈమెకు కోదై ( తుసి వనంలో భించినది అని

అర్ధం, కాలాంతరం లొ గోదాగా మార్పు చెందింది) అని నామ కరణం చేయడం జరిగింది. విష్ణుచిత్తులు నిత్యం విల్లిపుత్తూర్‌ లోని రాజమన్నా ర్‌ ఆలయంలో తులసిమాలలు అర్పిం à°šà°¡à°‚

విధిగా నిర్వర్తిస్తుండే వారు. ఆయ à°¨ ప్రభావంతో ఆండా­à°³à±‌ శ్రీరంగంలోని శ్రీరంగనాధునే తన భర్త ­­­à°—à°¾ లక్ష్యం చేసుకుని ముప్పై రోజు పాటు దీక్షగా చేసి తిరుప్పావై

పాశురాలు (తమిళ శ్లోకాలు) రచించి, తన లక్ష్య సాధన చేసుకోవడంతో ఆనాటి నుంచి నేటికీ సంకల్ప సాధనకు తిరుప్పావై ను అన్ని గృహాల్లోను, ఆలయాల్లోను అత్యంత భక్తి శ్రద్ధతో

కార్యక్రమాలను నిర్వ హించడం ఆనవాయితీగా వస్తొంది. రోజుకోక పాశురం చొప్పున పాశరాన్ని దైవ సన్నిధానంలో విన్నపం చేస్తూ పాశుర వైశిష్టాన్ని అందరికీ

వివరిస్తుంటారు. సాయంవేళల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధనుర్మాస వైశిష్ట్యం తెలియచేస్తుం టారు. ఈ నెలరోజుల్లో పది విశిష్ట పాశురాలలో అత్యంత వైభవంగా

కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ తిరుప్పావై పాశురాలో శ్రీకృష్ణ లీలలు, వైకుంఠ వైశిష్ట్యం ప్రధానంగా ఉంటా యి. మానవాళి జీవించాల్సిన విధి విధానాలను

వివరించడం జరుగుతుం ది. ప్రధానంగా 27 వ రోజున అత్యంత ప్రసిద్ధి చెందిన రోజుగా విశేష కార్యక్ర మాలను ఆచరిస్తుంటారు. దీనికి కూడారై అని పేరు. మానవులంతా కూడి స్వామిని

సేవించడం అని అర్ధం. దీనికి నిదర్శనంగా ఈరోజు న ప్రతీ ఆలయంలోను 108 కలశ తో (పాత్రు) పాయసం నైవేద్యం సమర్పించి, అనంత రం భక్తుంతా కలిసి ఏకపంక్తిన కూర్చుని దీన్ని

సేవించాలన్నది దీన్ని గూఢా ర్ధం. ఇదే మాసంలో ఈ నెల 18 వ తేదీన వచ్చే మరో ప్రత్యేక పర్వ దినం వైకుంఠ ఏకాదశి, సంవత్సర కాంలో వచ్చే 24 ఏకాదశుల్లోను అత్యంత వైశిష్ట మైన పర్వ

దినం ఈ వైకుంఠ ఏకాదశి, దీనికే ముక్కోటి ఏకాదశి అని పేరు. ఈ రోజున అన్ని ఆలయాల్లోను ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి స్వామి ని దర్శించుకోవడం ద్వారా జన్మరాహిత్యం

కుగుతుంద ని భక్తు నమ్మకం. నెల వారీగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భక్తి సంగీతం, తిరుప్పావై పాశుర ప్రవచనాలు, బాల బాలికలు, యవతీ యువకులు, విద్యార్ధులకు అత్యుత్తమ

జీవనం కలగాలని ప్రత్యేక గోష్టులు నిర్వహిస్తున్నారు. నగరంలోని శ్రీ వరాహక్ష్మీ నృశింహ స్వామి ఆలయం, సింహాచల  à°•à±à°·à±‡à°¤à±à°°à°‚, పోర్టు శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, పాత

నగరంలోని ఎంబెర్‌మానార్‌ స్వామి ఆలయం, అక్కయ్యపాలెం శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం, తదితర ఆలయాల్లో ధనుర్మాసోత్సవాలను అత్యంత వైభ వంగా నిర్వహించేందుకు అన్ని

ఏర్పాటు చేయడం జరిగింది. ఉద యం వేళల్లో సుప్రభాత సేవకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో తిరుప్పావై పాశుర సేవకు అంతే ప్రాధాన్యత ఉంది. నిత్యం కుంకుమ పూజు, అష్టోత్తర, సహస్ర

నామార్చనతొ పాటు భక్తి సంగీత కచే రీలు, వేద పారాయణలు, గోపూజ, తదితర కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ తిరుప్పావై ఉత్సవా ల్లో పాశురానికి ఉన్న ప్రాధాన్యత ప్రసాదానికి

కూడా ఉందంటే అతిశ యోక్తి కాదు. 
à°ˆ ధనుర్మాసం నిర్వ హించే కాలం  à°¶à±€à°¤à°¾à°•à°¾à°²à°‚ కావడంతో మానవు శరీర గుణాలకు అనుగుణంగా మిరియాలు, పెసర పప్పుతో కూడిన నైవేద్యాన్ని

స్వామికి సమర్పించి, సేవించ డం ద్వారా మనిషి శరీరంలో వేడి గుణం పెంపోందుతుంది. తద్వారా మానవ శరీరంలో కలిగే పలు మార్పులను క్రమ బద్దీకరిస్తుందని ఆరోగ్య సూత్రం

తెలియచేస్తోంది. ఆలయాల్లోను, ఇటు గృహాల్లోను à°ˆ ఆచరణను తప్పక నిర్వ హిస్తుంటారు. ధనుర్మాస వైభవాన్ని విశాఖవాసులకే కాక, యావదాంధ్ర ప్రదే శ్‌కు అందించిన

మహానుభావులో శ్రీమాన్‌ శ్రీభాష్యం అప్పలాచార్యులు, శ్రీమాన్‌ సాతులూరి గోపా కృష్ణమాచార్యులు అగ్రగణ్యులు. వివిధ సమస్యలతో తనమునకలయ్యే సాధారణ ప్రజలకు

మోక్షమార్గాన్ని ఆండాళ్‌ స్వయంగా చూపిన వ్రతమిది. 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #tiruppavai  #margasiram #dhanurmasam  #geeta jayanti
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam