DNS Media | Latest News, Breaking News And Update In Telugu

19 న కార్యకర్తల సమావేశంగా ద్రోణంరాజు జయంతి 

విశాఖపట్నం, డిశంబర్ 10, 2018 (DNS Online):  à°‰à°¤à±à°¤à°°à°¾à°‚ధ్ర టైగర్ à°—à°¾ పేరొందిన ద్రోణంరాజు సత్యనారాయణ 86 à°µ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దినోత్సవంగా నిర్వహించండం

ఆనవాయితీగా వస్తున్నట్టు పీసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ

డిశంబర్ 19 అనగానే ఉత్తరాంధ్ర జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎనలేని ఉత్సాహం వస్తుందని, ఆయన ఏనాడూ జన్మదినం జరుపుకోలేదని, కేవలం కార్యకర్తలకు వేడుక

జారుకునేవారని, అదే ఆనవాయితీగా తాము కూడా అదే రోజు ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దినోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. ఈ పర్యాయం విశాఖ నగరం

లోని గురుజాడ కళాక్షేత్రం లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి,

రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి, విశిష్ట అతిధులుగా హాజరవుతున్నారన్నారు. ఈ సభకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి అద్యక్షత

వహించనున్నారని తెలిపారు. ఈ సభలో రానున్న ఎన్నికల్లో పార్టీ చేపట్టనున్న కార్యాచరణ, కార్యకర్తల భాద్యతలను వివరించడం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో

కాంగ్రెస్ పార్టీ  à°¨à°—à°° అధ్యక్షుడు బెహరా భాస్కర రావు, విజయనగరం అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి, ఉడా మాజీ చైర్మన్ రవి,

తదితరులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #congress  #dronamraju  #satyanarayana  #srinivas

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam