DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే జోన్, హోదా ఇవ్వాల్సిందే: డాక్టర్ రమణ మూర్తి 

విశాఖపట్నం, డిశంబర్ 11 ,2018 (à°¡à°¿ ఎన్ ఎస్  DNS Online ): ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలైన ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రం à°—à°¾ రైల్వే జోన్ తక్షణం

ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ దక్షిణ నియోజక వర్గ ఇంచార్జి డాక్టర్ రమణ మూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంట్ సభ్యులని డిమాండ్ చేశారు.

మంగళవారం గ్రేటార్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగ గల గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసనల్లో అయన మాట్లాడుతూ ఐదేళ్ల మోడీ పాలనా లో చిట్టా చివరి

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి మొదలవుతున్నాయని, కనీసం ఇప్పుడైనా ఆంధ్ర ప్రదేశ్ కి ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు

జరిగేది ఆఖరి సమావేశాలు, కాబట్టి, ఆంధ్రాకి అదే సభలో అన్యాయం జరిగిందని, అక్కడే న్యాయం చెయ్యాలి అని కోరారు. వైఎఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్

మోహన్ రెడ్డి పై విశాఖపట్నం విమానాశ్రయం లో జరిగిన భౌతిక దాడి పై స్వయం ప్రతిపత్తి కల్గిన సంస్థ చే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, నగర అధ్యక్షులు కొండా రాజీవ్ గాంధీ, విశాఖ దక్షిణ నియోజక వర్గం కార్యకర్తలు, మహిళలు

పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #ysr congress  #ysrcp 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam