DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యధావిధిగా పెద్దలకు సేవలోనే తరిస్తున్న కనకమ్మ ఈఓ : భక్తులు,

కనకమ్మ గుళ్లో టాయిలెట్ల కు తాళాలు. భక్తుల పాట్లు.

విశాఖపట్నం, డిసెంబర్‌ 13, 2018  (డిఎన్‌ఎస్‌) : విశాఖ లోని బురుజు పేట లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి

దేవాలయంలో సాగుతున్న మార్గశిర మాసోత్సవాల్లో తోలి గురువారం భక్తులకు ఆలయ సిబ్బంది, ఈఓ యధావిధిగా విఐపీలు, వీవీఐపీలు పాదాక్రాంతులయ్యారంటూ భక్తులు

మండిపడుతున్నారు. క్రమం తప్పకుండా ఆలయ ఈఓ, నిర్వాహక సిబ్బంది, సాధారణ భక్తులకు పట్టపగలే చుక్కలు చూపించారు. గురువారం ప్రత్యేకత ఉండడంతో వేలాదిగా భక్తులు జిల్లా

నలుమూలల నుంచే కాక ఇతర ప్రాంతాల ను నుంచి కూడా అమ్మవారిని దర్శించేందుకు ఆలయానికి వచ్చారు. అయితే ఏర్పాట్లు అత్యంత ఘోరంగా ఉండడంతో భక్తులకు పట్టపగలే చుక్కలు

కనిపించాయి. మహిళలకు ప్రత్యేకించి మరుగు దొడ్లు ఏర్పాటు చేసినా, వాటికి ఇనుప తాళాలు వెయ్యడంతో విస్తుపోవడం భక్తుల వంతయ్యింది. ఆలయాన్ని ప్రధాన ప్రవేశ ద్వారం

వద్ద ఉన్న ఈ తాత్కాలిక మరుగు దొడ్లకు తాళాలు వెయ్యడం ఏంటని ప్రశ్నించిన భక్తులకు ఆలయ సిబ్బంది, నిర్వాహకుల నుంచి నిర్లక్ష్య సమాధానం రావడం గమనార్హం. క్యూలైన్లు

చాంతాడంత ఉన్నప్పటికీ భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చెయ్యకపోవడం గమనార్హం. పైగా రూ.200 , రూ. 500 , టిక్కెట్ల ద్వారానే దర్శనం చేసుకోవాలని, తొందరగా దర్శనం అవుతోందంటూ

తొందర పెట్టి, భక్తులు ఈ పెద్ద టికెట్లను కొనుగోలు చేసే విధంగా హంగామా చేసేవిధంగా ప్రకటనలు చేస్తున్నారు. రూ. 20 , రూ. 100 ల దర్శనం టిక్కెట్లలో దర్శనానికి వచ్చేవారి

సంగతి అంతే గతి. ప్రసాద వితరణ పూర్తిగా కొనుగోలుకు పెట్టడం గమనార్హం. 
జిల్లా రెవిన్యూ అధికారులు, పోలీసు విభాగం సిబ్బంది తమ కుటుంబ సభ్యులను, అనుబంధీకులను

నేరుగా ఆలయ దర్శనం చేయించడాన్ని భక్తులు తప్పు పట్టారు. దీనిపై ఆలయ ఈఓ ని ప్రశ్నించగా, తప్పించుకునే ధోరణి లో కనిపించారని భక్తులు మండిపడుతున్నారు. 

 

#dns  #dns live  #dns

media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #skml  #temple  #EO

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam