DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాజీ ట్రస్టీ దుర్గ ప్రసాద్ కు పెద్ద పీట వేసిన ఈఓ : మాజీ ట్రస్టీలు 

విశాఖపట్నం, డిసెంబర్‌ 13, 2018  (డిఎన్‌ఎస్‌) : విశాఖ లోని బురుజు పేట లో వేంచేసిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో సాగుతున్న మార్గశిర మాసోత్సవాల్లో భక్తులకు

అందుబాటులో ఉండాల్సిన ఆలయ కార్యనిర్వాభాణాధికారి కేవలం వివిఐపీల సేవలోనే తరిస్తున్నారంటూ మాజీ బోర్డు సభ్యుడు సిహెచ్ చంద్రరావు మండిపడ్డారు. తమతో పాటు రద్దు

అయినా బోర్డు సభ్యులు సామాన్య భక్తుల లాగానే ఆలయంలోకి వెళ్ళవలసి యుండగా, ఈఓ ఆశీస్సులు పొందిన దుర్గ ప్రసాద్ అనే మాజీ బోర్డు సభ్యుడు యధేచ్చగా ఆలయ అన్నదాన సత్రం

లో తన హవా కొనసాగిస్తూ తనదైన ఆధిపత్యాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయాల ఈఓ జ్యోతి మాధవి భర్త భారతీయ జనతా పార్టీ లో సీనియర్ నాయకునిగా ఉండడమే దీనికి

ప్రధాన కారణమన్నారు. దుర్గ ప్రసాద్ కూడా బీజేపీ కార్యకర్త కావడంతో అతనికి మాత్రం అనుమతి ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోందంది మండిపడ్డారు. గతంలోనే ఆలయ ట్రస్ట్

బోర్డు రద్దు అయినప్పటికీ ఇతను మాత్రం బోర్డు సభ్యునిగానే అనధికారికంగా కొనసాగుతున్నాడన్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

#dns  #dns live 

#dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bjp  #skml  #temple  #EO

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam