DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మోక్ష దాయకం. . . ఉత్తర ద్వార దర్శనం 

విశాఖపట్నం, డిశంబర్ 17, 2018 (DNS Online): వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువు ను దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు, ఏకంగా మోక్ష దాయకమే అని వేద వాక్కు.

వైష్ణవ దేవాలయాలన్నింటిలోనూ మార్గశిర మాసం లో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి రోజు న వైకుంఠ ఏకాదశి, లేదా ముక్కోటి అని పేరు. మాసానాం మార్గ శీర్షోహం అని భగవద్గీత

లో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అంత్యంత ప్రీతికరమైంది. à°ˆ నెలలోనే  à°§à°¨à±à°°à±à°®à°¾à°¸à°‚ ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా

అవతరించిన శ్రీహరిని ఈ మాసంలోనే గోదాదేవి భక్తితో పూజించి తన భర్తగా పొందింది. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో

ఆరాటపడతారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. 
శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు

(ద్వారాలు) ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు.

మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి à°ˆ రోజున ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. 

వైకుంఠ

ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. à°ˆ పేర్లు రావడం వెనుక వేర్వేరు కథనాలు పురాణాల్లో కనిపిస్తాయి. 

దక్షిణాయణంలో చనిపోయిన

పుణ్యాత్ములకు à°ˆ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు. 

వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన

శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే  à°®à±‹à°•à±à°·à°‚ పొందారు అని తెలుస్తోంది.   శ్రీ నమ్మాళ్వారులకు à°ˆ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు

అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. వీరు à°ˆ లోకానికి అందించిన దివ్య ప్రబంధ పారాయణను అనుసంధిస్తూ అధ్యయనోత్సవాలు నిర్వహిస్తుంటారు. 

ప్రసిద్ధ

ఆలయాలు - ఉత్తర ద్వార దర్శనం :
ఆంధ్ర దేశంలో ఈ ఉత్తర ద్వార దర్శన వేడుకలలు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రధానంగా భద్రాచల క్షేత్రం లో శ్రీ రామచంద్ర స్వామి, సపరివారంగా

ఈ రోజునే భక్తులకు కన్నుల పండువగా దర్శనం ఇస్తుంటారు. అదే విధంగా తిరుమల క్షేత్రం లో రెండు రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తుంటారు. అధిక సంఖ్యలో

భక్తులు ఆలయాన్ని వస్తారు కనుకనే ఏకాదశి రోజున, మరునాడు వచ్చే ద్వాదశి రోజున కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం లభిస్తుంది. సింహాచలం, వేదాద్రి, యాదాద్రి, మంగళగిరి,

శ్రీకూర్మం తదితర ఆలయాలు ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుంటారు. అదే విధంగా తెలుగు ప్రాంతాల్లోని అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఈ ముక్కోటి వేడుకలు

జరుగుతుంటాయి. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bhadrachalam  #uttara dwara darshanam  #vaikuntha ekadasi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam