DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొంతన లేని వ్యాఖ్యలతో బీజేపీ పార్టీ పరువు తీస్తున్నారు 

బీజేపీ పార్టీ వైఖరి పై అధికారప్రతినిధి కే అవగాహనా లేదు

విశాఖపట్నం, డిశంబర్ 21 ,2018 (DNS Online ): దేశం లోని ప్రాంతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న నరేంద్ర మోడీ,

అమిత్ షా, రామ్ మాధవ్, జివిఎల్ లాంటి మహామహులున్న భారతీయ జనతా పార్టీ కి ఆంధ్ర నేతలు అర్ధం పర్ధం, పొంతన లేని వ్యాఖ్యలతో పార్టీ పరువు తీస్తున్నారని పార్టీ క్యాడర్

బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. శుక్రవారం విశాఖ నగరం లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధిగా బుద్ధ చంద్రశేఖర్ మాట్లాడిన

మాటలతో ఏపీ బీజేపీ పార్టీ లో ఉన్న డొల్లతనం బయట పడిపోయింది. జనవరి 6 న భారత ప్రద్ధనామంత్రి నరేంద్ర మోడీ గుంటూరు లో బహిరంగ సభలో పాల్గొంటారు, అదే సభలో ఆంధ్రాకి ఆయన

ఏమి చేశారో చెప్తారు అని ప్రకటించారు. దీనికి బదులుగా విశాఖ కేంద్రం గా రైల్వే జోన్ హామీ పై గత ఎన్నికల ప్రచారం లో విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్

ఇస్తామంటూ నాటి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు, మరి దాని సంగతేంటి అని విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రశేఖర్ చేతులెత్తేశారు. పైగా తెలుగుదేశం

ఎంపీ రాయపాటి సాంబశివరావు  à°…డ్డుపడ్డారు, అందుకే ఇవ్వలేదు అని బదులిచ్చారు. దీంతో à°ˆ దేశం లో à°’à°• సాధారణ ఎంపీ à°•à°¿ ఉన్న విలువ భారత దేశ ప్రధానికి లేదా అని

ప్రశ్నించారు. నరేంద్ర మోడీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలి అనుకుంటే ప్రధాని గా ఆయనకున్న ప్రత్యేక అధికారాలతో వెంటనే ఒక ఆర్డినెన్స్ తో తక్షణం విశాఖ

రైల్వే జోన్ ప్రకటన చెయ్యవచు కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రశేఖర్ మాట దాటేసారు. పైగా వచ్చే ఎన్నికల్లో ఈ జోన్ అంశం మేనిఫెస్టో లో చేరుస్తాం అని కూడా

చెప్పడం కొసమెరుపు. ఈ హామీ తోనే విశాఖ ప్రజలు ఎంపీగా డాక్టర్ కె. హరిబాబుకు, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గా విష్ణుకుమార్ రాజు కు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎం ఎల్ సి గా

పివిఎన్ మాధవ్ కు ఓట్లు వేసి మరీ గెలిపించారు, మరి మీ హామీ సంగతి ఏంటి అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి

ఉన్నారు అంటే బీజేపీ పరిస్థితి ఏంటో ప్రజలకు తెలుస్తోంది. పైగా ఈయన రానున్న ఎన్నికల్లో విశాఖ పశ్చిమం నియోజక వర్గం నుంచి ఎం ఎల్ ఏ అభ్యర్థిగా బారి లో ఉన్నట్టు

బీజేపీ ఇటీవలే ప్రకటించింది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #viswanadha raju  #vizag  #bjp

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam