DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రపంచం మెచ్చిన సంస్కరణలను మేధావి మన పీవీ యే : ఏయు వీసీ 

విశాఖపట్నం, డిశంబర్ 23, 2018 (DNS Online ):  à°–ండాంతరాలకు విస్తరించిన ఖ్యాతిగాంచిన మేధావి మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు అని, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఏ యు) ఉపకులపతి

డాక్టర్ జి. నాగేశ్వర రావు అన్నారు. ఆదివారం పీవీ వర్ధంతిని పురస్కరించుకుని వైజాగ్ బ్రాహ్మ న్ వెల్ఫేర్ సొసైటి à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో జరిగిన కార్యక్రమంలో విశాఖనగరం

లోని సిరిపురం కూడలి వద్ద గల పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ సామాన్య వ్యక్తిగా ప్రారంభమైన పీవీ ప్రస్థానం ఒక

ఉత్తమ విద్యార్థి గా, విద్యార్థి నాయకుని స్థాయి నుంచి అఖండ భారతావనికి అత్యుత్తమ ప్రధానిగా గురుతరమైన భాద్యతలను ప్రపంచం మెచ్చేవిధంగా నిర్వహించారన్నారు.

మైనరిటీ ప్రభుత్వానికి నాయకుడు అయినప్పటికీ, ఐదేళ్ల కాలం కూటమిలోని పార్టీలను కలుపుకుంటూ, దేశంలో ఎన్నో ఆర్ధిక సంస్కరణలను à°ªà±à°°à°µà±‡à°¶à°ªà±†à°Ÿà±à°Ÿà°¾à°°à°¨à±à°¨à°¾à°°à±. తద్వారా

ఆర్థికపరంగా భారతదేశం అగ్ర దేశాలకు ధీటుగా సత్తా చాటిందన్నారు. మరో ప్రక్క అణువిధానానికి కూడా పునాదులు వేసి, తదుపరి ప్రధాని, అతుల్ బిహారి వాజపేయి కి బృహత్తర

కార్యాచరణను అందించారని తెలిపారు. భాషావేత్తగా, ఆర్ధిక శాస్త్రవేత్తగానే కాకుండా, సాహిత్యకారునిగా సైతం ఎన్నో దేశీయ భాషలే కాకుండా అంతర్జాతీయ భాషల్లో కూడా

అపారమైన నైపుణ్య ప్రవేశం ఉందన్నారు. విదేశీ ప్రతినిధులతో నేరుగా వారి భాషలోనే నేరుగా సంప్రదించగలిగిన భారత ప్రధానుల్లో పీవీ మాత్రమే ఉంటారన్నారు. ఆంధ్ర

ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ  à°Žà°®à±à°®à±†à°²à±à°¯à±‡ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ పీవీ లాంటి అపార

చాణుక్యులు జీవించిన కాలంలోనే మనం కూడా జీవించడం గొప్ప విషయం అన్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం  à°®à±‡à°§à°¾à°µà±à°²à± ఏ విధంగా చలించకుండా సరైన నిర్ణయాలు

తీసుకుంటారో తెలియచేసిన వారు కేవలం పీవీ యే అన్నారు. ఇంత మేధావి తెలుగువారు కావడం అందరికీ గర్వకారణం అన్నారు. à°ˆ కార్యక్రమం లో à°µà±ˆà°œà°¾à°—్ బ్రాహ్మ న్ వెల్ఫేర్

సొసైటి à°…ధ్యక్షులు కావూరి చరణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది పీవీ నారాయణ రావు, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి,

గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్, భాగవతుల శంకర్ నీలు తదితరులు పాల్గొన్నారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #pv  #narasimha rao  #prime minister #siripuram

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam