DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొత్త కన్యూమర్ యాక్ట్ తో వినియోగదారులకు మరింత బలం

విశాఖపట్నం, డిశంబర్ 24, 2018 (DNS Online ): కొత్త గా ఆమోదించబడుతున్న వినియోగదారుల చట్టం తో వినియోగదారులకు మెరుగైన లాభం చేకూరుతుందని విశాఖ జిల్లా వినియోగదారుల ఫోరమ్

అధ్యక్షులు బులుసు సూర్యభాస్కరం తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖనగరం లోని ద్వారకానగర్ లోగల పౌర గ్రంధాలయం లో నిర్వహించిన

అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిశంబర్ 24 à°¨ జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, à°ˆ ఏడాది ఇచ్చిన అంశం "  à°Ÿà±ˆà°‚ లీ డిస్పోసల్ ఆఫ్ 
/> కన్జ్యూమర్ కేసెస్ " అని తెలిపారు. ఇటీవల భారత లోక్ సభ లో ఈ వినియోగదారుల చట్టాన్ని మార్పులు చేరుస్తూ ఒక నూతన చట్టాన్ని ఆమోదించిందని, అయితే ఈ చట్టం రాజ్య సభలోనూ

ఆమోదం పొందిన తదుపరి, భారత రాష్ట్రపతి ఆమోదం తెలియచేయవలసి యుందన్నారు. ఈ నూతన చట్టం లో అనేక అనూహ్యమైన మార్పులున్నాయని, ఇంతవరకూ గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష

ఉందని, అది ఇప్పుడు నుంచి పదేళ్లకు పెరుగుతుందన్నారు. మూడు వేల రూపాయల  à°œà±à°°à±à°®à°¾à°¨à°¾ నుంచి పది లక్షల వరకూ అధికారం పెంచారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను

మొత్తం 17  à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—దారుల న్యాయస్థానాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ లో రెండున్నాయి. à°ˆ ఏడాది 420  à°•à±‡à°¸à±à°²à± నమోదు.అయ్యాయని, ప్రతి నెల  30  à°¨à±à°‚à°šà°¿ 40  à°¦à°¾à°•à°¾ కేసులను రెండు ఫోరమ్ లు

పరిశీలన చేయడం జరుగుతోందని వివరించారు. కేసు వేసిన పత్రాల్లో లోపాలు ఉన్నట్టయితే 21  à°°à±‹à°œà±à°² లోపల లోపాలు సరిదిద్ది మళ్ళీ కేసువేయాల్సి యుంటుందని, 45  à°°à±‹à°œà±à°² లోపల

ప్రతివాది  à°•à±Œà°‚టర్ వెయ్యక పొతే జాప్యం జరుగుతోందని తెలిపారు. దీనికి ప్రధాన కారణం ఉత్పత్తి దారులు ఇతర ప్రాంతాల్లో ఉండడం వలన వాళ్ళు స్పందించడానికి సమయం

పడుతోందని, పైగా ఉత్పత్తిదారుల చిరునామాలు కూడా కొన్ని కేసుల్లో తప్పుడుగా ఉండడం వలన నోటీసులు వారికి చేరే అవకాశం ఉండదు, దీని వల్ల కేసుల పరిష్కారం

లేటవుతుందన్నారు. ఎక్స్ పార్టీ ఇచ్చే అధికారం కేవలం రాష్ట్ర స్థాయి న్యాయస్థానాలకు డివిజన్ ఉందని, పరిష్కార పరిధి జాతీయ కమిషన్ కు మాత్రమే

ఉందన్నారు. 

వస్తువుల్లో లోపాలపై సంబంధిత నిపుణులు మాత్రమే నివేదిక ఇవ్వాల్సియుందన్నారు. వైద్య పరిశీలన కేసుల్లో సంబంధిత వైద్య నిపుణులు మాత్రమే నివేదిక

ఇవ్వాల్సిన సందర్భాల్లో జాప్యం జరుగుతోందన్నారు. à°—à°¤ మూడేళ్ళ క్రితం సంబంధించిన హుద్ హుద్ తుఫాను ధాటికి విశాఖ లో పోర్ట్ లో కాంట్రాక్టులు నిర్వహిస్తున్న  à°’à°•

ఆయిల్ పరిశ్రమ వారి గోడౌన్ కి కల్గిన నష్టం పై వినియోగదారుల న్యాయస్థానంలో కేసు వెయ్యడం జరిగిందని, అయితే ఇన్సూరెన్స్ సంస్థ పరిహారం ఇచ్చేందుకు సుముఖత

చూపకపోవడం తో కేసు తమ పరిధికి వచ్చిందన్నారు. విశాఖ జిల్లా ఫోరమ్ పరిధి కేవలం 20 లక్షల రూపాయలకే ఉండడంతో పార్టీ కేవలం 18 లక్షలకే పరిహారం కోరడం జరిగిందన్నారు.

అయితే వారికి జరిగిన నష్టం అంతకంటే ఎక్కువగానే ఉన్నట్టు తెలిసిందన్నారు. వారికి తగిన పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. అయితే వినియోగదారుల్లో మరింత చైతన్యం

రావాల్సిన అవసరం ఉందన్నారు. 

ఈ అవగాహనా సదస్సులో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్మోహన్ రావు, తూర్పు కోస్త రైల్వే

డివిజినల్ కమర్షియల్ మేనేజర్ జి. సునీల్ కుమార్. జిల్లా వినియోగదారుల ఫోరమ్ సభ్యులు కె. సరోజ, బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ శాస్త్ర వేత్త, జిల్లా వినియోగదారుల సంఘం

ప్రతినిధులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు. అనంతరం పలువురు ప్రభుత్వ, స్వచ్చంద సంస్థల ప్రతినిధులను సత్కరించారు. 

 

#dns  #dns live 

#dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #consumer forum

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam