DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలవరం నుంచి పాయిఖానాల వరకూ వాటాల కోసం నాకేసారు : సోము వీర్రాజు

చంద్రబాబు పై బీజేపీ à°Žà°‚ ఎల్ సి సంచలన వ్యాఖ్యలు 

విశాఖపట్నం, డిశంబర్ 26, 2018 (DNS Online): పోలవరం లాంటి భారీ పరిశ్రమల నుంచి గ్రామాల్లో నిర్మించే పాయిఖానాల వరకూ తండ్రీ

కొడుకులు సహా తెలుగుదేశం నేతలు వాటాలతో నాకేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నగరం లోని పార్టీ

కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అడుగడుగు అవినీతి పై చంద్ర

నిప్పులు చెరిగారు. పోలవరం బహుళార్ధ సాధక జాతీయ ప్రాజెక్ట్ అని, దాని నిర్మాణ భాద్యత పూర్తిగా కేంద్రానిదే అయినప్పటికీ కోట్లు దోచెయ్యడానికే చంద్రబాబు, దీని

నిర్మాణ పర్యవేక్షణ, భాద్యత తామే చేపడతామని మోడీ ని ప్రాధేయపడ్డారన్నారు. అక్కడ పని చేసే ప్రతి ఒక్కరూ కేంద్రానికే భాద్యులు అని, ఇతను పనీ పాటు లేనప్పుడల్లా

పోలవరం నిర్మాణ స్థలానికి వెళ్లి, గంటలు గంటలు పనికిమాలిన మీటింగ్ లు పెడుతున్నాడని, దాంతో వాళ్లకి నిద్ర వచ్చేస్తోందన్నారు. చంద్రబాబు కి ఈ ప్రాజెక్ట్ తో

ఏమాత్రం సంబంధం లేదని, పైగా డబ్బులు ఇవ్వట్లేదంటూ రోడ్డెక్కి, తన పచ్చ మీడియా లో గావు కేకలు పెడుతున్నదన్నాడని మండిపడ్డారు. 

గ్రామీణ అభివృద్ధి నిధులు

నాకేసారు :

మహాత్మా గాంధీ గ్రామీణ అభివృద్ధి పధకం క్రింద  à°°à±‚. 40 వేల కోట్లు ఇస్తే, వాటిల్లో 16 వేల కోట్లు తో చెరువులు త్రవ్వేసి, దాంట్లోని మట్టి, ఇసుకను

దోచుకున్నారన్నారు. ఇక మరుగు దొడ్లు కోసం కేటాయించిన నిధులను కూడా దోచేసి, కేంద్రం మాకేమి ఇవ్వలేదంటూ తండ్రీ కొడుకులు తమ పచ్చ మీడియా ముందు బీద అరుపులు

అరుస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు. ఆఖరికి గ్రామాల్లో మరుగుదొడ్లు కట్టించమని నిధులు కేటాయిస్తే చంద్రబాబు, అతని కొడుకుసహా పార్టీ నేతలు  à°®à°°à±à°—ుదొడ్లు

నిర్మాణం లో కూడా వాటాలు నాకేస్తున్నారన్నారు.  à°¦à±€à°¨à°¿à°•à°‚టే నీచమైన విషయం ఇంకొకటి ఉందన్నారు. 

అన్నీ ఈయనేనట ?
భారత దేశం సహా, ప్రపంచం లో ఎవరు ఏ పని చేసినా తానూ

చెప్పడం వల్లే జరిగిందంటూ చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నదన్నారు. ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ను భారత

రాష్ట్రపతి చేసింది బీజేపీ పార్టీ అయితే, దానికి నేను చెప్పడం వల్లే వాజపేయి కలాం ను నియమించారంటూ చంద్రబాబు చెప్పని చోటు లేదన్నారు. అదే విధంగా అమెరికా లో

జరిగిన విషయాలు కూడా ఈయన చెప్పడం వల్లే అన్నీ జరుగుతున్నాయని, ప్రచారం చేసుకునే ఘనుడు చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. 

మోడీ పేరెత్తే అర్హత కూడా బాబు కి లేదు

:

మోడీ పేరెత్తే అర్హత కూడా బాబు కి అతని చెంచా బ్యాచ్ కి లేదన్నారు. పిల్లనిచ్చిన మావకు వెన్ను పోటు పొడిచిన చంద్రబాబూ నుంచీ, దమ్మిడీ కి కొరగాని

కళావెంకటరావు, రోజుకో పార్టీ మారే  à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాస రావు లాంటి గలాటా బ్యాచ్ కూడా మోడీ ని విమర్శించడం చాలా అసహ్యంగా ఉందన్నారు. à°ˆ గలాటా బ్యాచ్ లో ఏ ఒక్కడికీ

నిజాయితీ లేదని, విశాఖపట్నం కేంద్రంగా భూదందాలు చేసి, భూబకాసురునిగా మారిన à°—à°‚à°Ÿà°¾ లాంటి వాళ్ళతో à°ˆ రాష్ట్రం పూర్తిగా భ్రష్టుపట్టిందన్నారు. 

మోడీ ని

ఎదుర్కొనే దమ్ము లేదు :
ఆంధ్రాకి మోడీ చేసిన మేలు ఏంటో స్వయంగానే మోడీ ఈ నెల 6 వ తేదీన నరేంద్ర మోడీ గుంటూరు బహిరంగ సభలో ప్రకటిస్తారని తెలిపారు. చట్టం లో తెలిపిన

అన్ని హామీలను బీజేపీ నెరవేర్చిందని, ఆంధ్రాకి 11 జాతీయ విద్య సంస్థలు ఇస్తామన్నామని,  à°µà°¾à°Ÿà°¿à°•à°¿ మించి ఇప్పడికే 14 సంస్థలు కేటాయించడంతో పాటు, ప్రతి విద్య సంస్థకూ

వందల కోట్ల రూపాయలు కేటాయింపులు కూడా జరిపామన్నారు. వాటిల్లో చాలా సంస్థల్లో విద్య సంవత్సరం మొదలై తరగతులు కూడా నడుస్తున్నాయన్నారు. 

ఈ విలేకరుల సమావేశం లో

బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ శాఖ కార్యదర్శి సాగి కాశీ విశ్వనాధరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కెవివి సత్యనారాయణ, గాజువాక నియోజక కన్వీనర్, మాజీ మేయర్ పులుసు జనార్ధన

రావు, తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #viswanadha raju  #bjp  #somu veerraaju  #chandrababu  #modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam