DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటర్ నుంచే విద్యార్థుల్లో సాంకేతికతను పెంపొందించాలి : కమిషనర్ ఉదయలక్ష్మి 

విశాఖపట్నం, డిశంబర్ 27, 2018 (DNS Online): ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యా బోధనకి సాంకేతికను అనుసంధానం చేసినప్పుడే ఉత్తమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చని ఆంధ్రప్రదేశ్

ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ బి.ఉదయలక్ష్మీ తెలిపారు. గురువారం విశాఖ నగరం లోని ఓ స్టార్ హోటల్ లో విఐటీ-ఎపి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ కాలేజ్

ప్రిన్సిపాల్స్ కోసం నిర్వహించిన అవగాహనా సదస్సు కు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సమర్ధవంతమైన  à°¬à±‹à°§à°¨-సాంకేతిక అనుసంధానంపై (Effective Teaching Learning –Technology

Integration)  à°¬à±‹à°§à°¨ పద్దతుల్లో ఆధునికతను సంతరిచుకున్నప్పుడే కొత్త తరానికి దగ్గర అవుతామని ,అనునిత్యం తమను తాము మెరుగు పర్చుకున్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని

తెలిపారు. విఐటీ –ఎపి యూనివర్సిటీ ఇటువంటి సదస్సులు నిర్వహిస్తుండటం మంచి పరిణామం అన్నారు. రోజు రోజుకి సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో బోధనలో కూడా

కొత్త ఒరవడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 
విఐటీ –ఎపి రిజిస్ట్రార్ డాక్టర్ సి.ఎల్వీ శివకుమార్ మాట్లాడుతూ బోధనలో కూడా సాంకేతికను ఉపయోగించుకున్నప్పుడే

విద్యార్ధుల్లో ఉత్సుకత పెరుగుతుంది. బోధన ఎప్పుడూ బోరింగ్ గా కాకుండా షేరింగ్ గా ఉండాలి అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్ ల్లో ఈ అవగాహనా సదస్సులు

నిర్వహిస్తున్నామని, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లు కొరకు విశాఖపట్నం లో నిర్వహింస్తున్నట్టు తెలిపారు.

 à°ªà°¶à±à°šà°¿à°® గోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం ప్రాంతాల కళాశాలల వారికి విజయవాడలో ఇప్పడికే సదస్సు నిర్వహించామన్నారు. రాయలసీమ జిల్లాల వారికి తిరుపతి లోను à°ˆ సదస్సు

జరుగుతోందన్నారు. జనవరి 5, 6 వ తేదీలలో విఐటీ-ఎపి యూనివర్సిటీ లో రెండు రోజుల పాటు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఫెస్ట్ విటోపియా పేరుతొ

నిర్వహిస్తున్నామన్నారు. à°ˆ కార్యక్రమం లో 5 à°µ తేదీన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్,  6 à°¨ ఫెస్ట్ ముగింపు కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి

హాజరవుతారన్నారు. à°ˆ సందర్భంగా విటోపియా-2019 పోస్టర్ ని ఇంటర్మీడియట్ కమీషనర్  à°‰à°¦à°¯à°²à°•à±à°·à±à°®à±€ ఆవిష్కరించారు. విశాఖ లో జరిగిన సదస్సులో సుమారు వివిధ కళాశాలలకు చెందిన

ప్రిన్సిపాళ్లు వందమంది పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #VIT AP #andhra pradesh  #government  #amaravati  #Intermediate

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam