DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ కు పుంజుకుంటున్న బలం చూసి, బాబు బెంబేలెత్తుతున్నారు : మళ్ల 

రాష్ట్రాన్ని నట్టేట ముంచింది చంద్రబాబే : మళ్ల విజయ్ ప్రసాద్ 
 
విశాఖపట్నం, డిశంబర్ 31, 2018 (DNS Online): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్

కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాబలం చూసి చంద్రబాబు అండ్ కో బెంబేలెత్తుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయ్ ప్రసాద్

అభిప్రాయపడ్డారు. సోమవారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ స్వార్ధపూరిత రాజకీయ లబ్ది కోసం ఆర్ధికంగా వెనుకబడిన

ఆంధ్ర ప్రదేశ్ ను నట్టేట ముంచింది చంద్రబాబే నని వైఎస్ ఆర్ ఆంధ్రా కి ప్రత్యేక హోదా కావాలని మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి

పోరాటం చేస్తుంటే. . . దాన్ని తప్పుపట్టి, నాటి మిత్రపక్షం బీజేపీ తో కుమ్మక్కై, జగన్ ని తప్పు పట్టి, వెటకారం చేసి, తన పబ్బం గడుపుకున్నదన్నారు. రాష్ట్రం లో

ప్రాజెక్టుల్లో అధికశాతం తన బినామీలకు కాంట్రాక్టులు వచ్చేలా తీవ్రంగా కృషి చేసింది చంద్రబాబు కాదా అని అడిగారు. లక్షల కోట్లాది రూపాయలు తండ్రీకొడుకులు

దోచుకుతిన్నారన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని, వైఎస్సార్  à°•à°¾à°‚గ్రెస్ పోరాటం చేస్తుంటే, దాన్ని తొక్కిపెట్టి, విశాఖకు రైల్వే జోన్

రాకుండా తెలుగుదేశం ఎంపీలు అడ్డుకున్న మాట వాస్తవం కాదా అని అడిగారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లు రాజీనామా చేస్తే, తెలుగుదేశం

ఎంపీలు పగటివేషగాళ్లలా పార్లమెంట్ ముందు దేవులాడుతున్నారని మండిపడ్డారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #YSR Congress  #Malla Vijay Prasad

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam