DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే బోర్డు చైర్మన్ గా వినోద్ కుమార్ యాదవ్ భాద్యతలు స్వీకరణ 

విశాఖపట్నం,  à°œà°¨à°µà°°à°¿ 1 , 2019 (DNS Online ): భారతీయ రైల్వే బోర్డు చైర్మన్ à°—à°¾ వినోద్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు. ఇంతవరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ à°—à°¾ విధులు నిర్వహించిన

ఈయన హయం లో దక్షిణ మధ్య రైల్వే లో ఎన్నో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టారు. ఈయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఆంగ్ల నూతన సంవత్సరం 1 వ తేదీ నుంచి

ఈయన నియామకం అమలుకానుంది. సికంద్రాబాద్ లోని రైల్ నిలయం లో మంగళవారం  à°†à°¯à°¨ భారతీయ రైల్వే బోర్డు చైర్మన్ à°—à°¾ భాద్యతలు చేపట్టారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ

రైల్వేలో ప్రయాణీకులకు ప్రధాన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి

చేస్తామన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో తో పాటు విశాఖపట్నం జిల్లా పరిధిలో దువ్వాడ నుంచి మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతా

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉండడం గమనార్హం. ఈయన కేంద్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి గా కొనసాగనున్నారు. దక్షిణాది కి చెందిన రైల్వే ఉన్నతాధికారి

రైల్వే బోర్డు చైర్మన్ గా భాద్యతలు స్వీకరించడం పట్ల విశాఖపట్నం డివిజినల్ రైల్వే మేనేజర్ ముకుల్ శరన్ మధుర్, విశాఖపట్నం రైల్వే అధికారులు శుభాకాంక్షలు

తెలిపారు.  

ఆంధ్రా కు ఆశాభావం :
విభక్త ఆంధ్ర ప్రదేశ్ స్థితిగతులు తెలిసిన వినోద్ కుమార్ యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్ గా రావడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో

కొంత ఆశాభావం నెలకొంది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు లో ఉన్న ఇబ్బందులు తెలిసిన వ్యక్తి చైర్మన్ గా రావడంతో ఈ నూతన సంవత్సరం లోనైనా విశాఖపట్నం

కేంద్రంగా  à°œà±‹à°¨à± ఏర్పాటులో ఉన్న ఆటంకాలకు à°’à°• సానుకూల పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం నెలకొంది. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #railways  #indian railway board  #RRB #vinod kumar yadav  #South central railway

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam