DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోలాహలంగా తిరుమల గిరులు, క్యూ లైన్లలో భక్తుల రద్దీ 

తిరుమల,  à°œà°¨à°µà°°à°¿ 1 , 2019 (DNS Online ): ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తిరుమల గిరులు కోలాహలంగా మారిపోయాయి. ఆంగ్ల సంవత్సవం

తొలిరోజున తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వాసం భక్తుల్లో పెరిగిపోయింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల

నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం తో క్యూలైన్లు రద్దీగా మారిపోయాయి. తిరుమల గిరులపై  à°†à°²à°¯ ప్రాకారం, గోపురాలు, ధ్వజస్తంభం, అంతరాలయాలను రంగురంగుల పూలు,

విద్యుద్దీపాలతో అలంకరించారు. అనుబంధం ఆలయాలు సైతం అత్యద్భుతంగా అలంకారం చేశారు.  

ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులు

సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నందున తెల్లవారు ఝామునే తిరుప్పావై సేవాకాలం చేసిన అనంతరం

భక్తులను దర్శనానికి అనుమతించారు. అనంతరం ఇతర కైంకర్యాలు పూర్తిచేసి.. మంగళవారం వేకువజామున 1.30 à°—à°‚à°Ÿà°² నుంచే వీఐపీ బ్రేక్‌ దర్శనాన్ని ప్రారంభించారు. వేకువజామున 4.30

గంటల నుంచి ధర్మదర్శనాన్ని మొదలుబెట్టి అర్ధరాత్రి వరకు సామాన్య భక్తులకు అవకాశం కల్పించనుంది. సోమవారం సాయంత్రానికి తిరుమలలో యాత్రికుల రద్దీ సాధారణంగా

ఉంది. శ్రీవారికి సోమ, మంగళవారాల్లో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. సహస్రదీపాలంకరణ సేవను మాత్రం సర్కారు సేవగా నిర్వహిస్తున్నారు.  à°ˆà°µà±‹ అనిల్‌కుమార్‌

సింఘాల్‌, తిరుమల ఇన్‌ఛార్జి జేఈవో పోలా భాస్కర్‌ క్యూలైన్లను పర్యవేక్షించారు.

 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #tirumala  #tirupati  #TTD  #rush  #venkateswara swamy temple

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam