DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిరుద్యోగ యువతకు భారీ నజరానా, 1386 పోస్టుల భర్తీ కి ప్రకటన  

అమరావతి : జనవరి 1 , 2019 (DNS Online ): నిరుద్యోగ యువతకు కొత్త సంవత్సర కానుకంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1386 పోస్టులకు భర్తీ

ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ పి.ఉదయ భాస్కర్‌ సోమవారం ఏడు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇందులో గ్రూప్‌1 కేడర్‌ పోస్టులు-169, గ్రూప్‌2-446,

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల లెక్చరర్లు-405, ఫిషరీస్‌ డవలప్‌మెంటు ఆఫీసర్లు-43, డిగ్రీ కళాశాల లెక్చరర్లు-308, ఫిషరీస్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్లు-10, డిప్యూటీ

ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు-5 ఉన్నాయి. తాజా నోటిఫికేషన్లలో అత్యధికంగా గ్రూప్‌-2 పోస్టులు, à°† తర్వాత పాలిటెక్నికల్‌ కళాశాల

లెక్చరర్లు-405, డిగ్రీ కళాశాల లెక్చరర్లు-308ఉన్నాయి. పోస్టుల కోసం వరుసవారీగా దరఖాస్తుల ప్రక్రియ, ఫీజు చెల్లింపు, పరీక్షల షెడ్యూలను విడుదల చేశారు.

గ్రూప్‌-2

పోస్టుల వివరాలు:

ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-2 విభాగంలో మొత్తం 446 పోస్టులున్నాయి. ఇందులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ :292, ఎగ్జిక్యూటివ్‌ : 154 ఖాళీలకు నోటి à°ˆ

పోస్టులన్నీ పాత పద్ధతిలోనే స్క్రీనింగ్‌(ప్రిలిమినరీ) టెస్ట్‌, మెయిన్‌ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సాధారణ పరిపాలన శాఖ :150  à°à°Žà°¸à±‌వో, సీనియర్‌

అకౌంటెంట్లు : 20, ఎక్సైజ్‌శాఖ ఎస్‌ఐలు : 50, పంచాయతీరాజ్‌శాఖ : 40 ఎక్స్‌టెన్షన్‌ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్లు: 16, ఖజానాశాఖలో సీనియర్‌ అకౌంటెంట్లు :13

ఉన్నాయి.

గ్రూప్‌-2  à°²à±‹à°¨à°¿ అన్ని విభాగాల పోస్టులకు (యూనిఫామ్‌ మినహా) వయోపరిమితి 42  à°à°³à±à°²à°²à±‹à°ªà± వరకూ అవకాశం కల్పించారు. రిజర్వేషన్‌, పీహెచ్‌సీ అభ్యర్థులకు

యథాతథంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మే5à°¨ గ్రూప్‌-2 ప్రాథమిక పరీక్ష, జూలై 18, 19 తేదీల్లో గ్రూప్‌-2 మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తామని చైర్మన్‌ ఉదరుభాస్కర్‌

తెలిపారు. 

ఇటీవల ఇంటర్మీడియట్‌ విద్యలో-237 జూనియర్‌ లెక్చరర్ల(జేఎల్‌), అగ్రికల్చరల్‌ ఆఫీసర్లు(ఏవో)-37లకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఏపీ

వర్క్సు అండ్‌ అకౌంట్స్‌ సర్వీసులో గ్రేడ్‌-2 డివిజనల్‌ అకౌంట్‌ ఆఫీసర్లు-22, ఏపీ సచివాలయంలో తెలుగు అసిస్టెంట్‌ ట్రాన్స్‌లేటర్లు-2, ఐఅండ్‌ పీఆర్‌లో

ఏపీఆర్‌వోలు-15 ఖాళీల భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ షెడ్యూలు విడుదల చేసింది.

ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, ఎండోమెంట్‌, రవాణాశాఖ తదితర విభాగాల్లోనూ ఖాళీల

భర్తీ ప్రక్రియకు ఏపీపీఎస్సీ శ్రీకారం చుట్టింది. గతంలో 2016లో ఏపీపీఎస్సీ నుంచి పలు విభాగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏడాది నుంచి గ్రూప్‌-1,2 నోటిఫికేషన్ల

కోసం నిరుద్యోగ యువత శిక్షణ పొందుతున్నారు. కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్లతో అభ్యర్థులు ఊరట చెందుతున్నారు.

పాలిటెక్నిక్‌ లెక్చరర్లు : మొత్తం

పోస్టులు =  405 . దరఖాస్తు చేసేందుకు గడువు :  6-2-2019 నుంచి 27-2-2019

ఫిషరీస్‌ డెవలప్‌మెంటు ఆఫీసర్లు: మొత్తం పోస్టులు = 43 దరఖాస్తు చేసేందుకు గడువు : 17-1-2019 నుంచి 8-2-2019

గ్రూప్‌-2

సర్వీసెస్‌ : మొత్తం పోస్టులు =  446 దరఖాస్తు చేసేందుకు గడువు : 10-1-2019 నుంచి 31-1-2019
డిగ్రీ కళాశాలల లెక్చరర్లు : మొత్తం పోస్టులు =  308. దరఖాస్తు చేసేందుకు గడువు : 5-2-2019 నుంచి

26-2-2019

గ్రూప్‌-1 సర్వీసెస్‌: మొత్తం పోస్టులు =  169. దరఖాస్తు చేసేందుకు గడువు : 7-1-2019 నుంచి 28-1-2019

అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్లు-ఫిషరీస్‌:  à°®à±Šà°¤à±à°¤à°‚ పోస్టులు =  10– . దరఖాస్తు

చేసేందుకు గడువు : 18-1-2019 నుంచి 8-2-2019

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు:  à°®à±Šà°¤à±à°¤à°‚ పోస్టులు =  05. దరఖాస్తు చేసేందుకు గడువు :  22-1-2019 నుంచి 12-2-2019
 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #state

government  #jobs  #APPSC

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam