DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రకృతి సేద్యానికి సంఘీభావంగా 4 న కవుల పాట- ప్రకృతి సాగు బాట 

విశాఖపట్నం, జనవరి 2 , 2019 (DNS Online ): వాయు కాలుష్యం ఫలితంగా గాలిలో కార్బన్ డయాక్సిడ్ విస్తృతంగా పెరిగి పోయి నెలలో కార్బన్ శాతం తగ్గి సాగు కు వ్యతిరేక పరిస్థితులు

నెలకొన్నాయని జట్టు ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ డి. పారినాయుడు అన్నారు. బుధవారం నగరంలోని నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ రైతులకు

గిట్టుబాటు కూడా లభించని విధంగా పరిస్థితులు మారిపోతున్న తరుణంలో ప్రకృతి సాగు విధానం పై ప్రజానీకంలో అవగాహనా కల్పించేందుకు బృహత్తర అవగాహనా కార్యక్రమాన్ని

చేపట్టినట్టు తెలిపారు. à°ˆ నెల 4 à°µ తేదీన విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (ఎయు) లోని అసెంబ్లీ హాల్ ( సిరిపురం కూడలి) లో కవుల నోట - పాట ప్రకృతి  à°¸à°¾à°—ు బాట

కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతు సోదరులకు, ప్రజలకు ప్రకృతి సాగు పై సంపూర్ణ అవగాహనా కల్పించేందుకు పాట ద్వారా అందరికీ ఈ

సందేశాన్ని చేరవేసేందుకు ప్రజా కవులు గద్దర్ ( విఠలరావు), అండ్ శ్రీ, గోరెటి వెంకన్న, డాక్టర్ ఎం. భూపాల్ రెడ్డి, గొడిశాల జయరాజు పాల్గొని, తమ గానంతో అందరినీ

అలరించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎయు రెక్టార్ డాక్టర్ ఎం. ప్రసాద రావు, ఎయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామ్మోహన్ రావు, డాక్టర్ ఎం. మదన్

మోహన్, డాక్టర్ కెపి సుబ్బారావు, తదితరులు హాజరవుతారన్నారు. రైతు సాధికార సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో జరుగుతున్న ఈ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్

లోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, రచయితలతో ముఖాముఖీ చర్చాగోష్ఠి జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశం లో ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు, సీనియర్

పాత్రికేయులు ఎన్. నాగేశ్వర రావు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #jattu trust  #natural farming

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam