DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్యం కన్యూమర్ వస్తువు  కాదు, అమ్మడానికి, ఇది ఒక సేవ : ఐఎంఏ 

ప్రజా రోగ్యం పై,  à°µà±ˆà°¦à±à°¯ à°°à°‚à°—à°‚ పై ఆటలాడ వద్దు, 

విశాఖపట్నం, జనవరి 4, 2019 (DNS Online ): వైద్య రంగం అనేది ఒక కన్యూమర్ వస్తువు కాదని, ఇది ప్రజలకు అందించే అత్యున్నత సేవ

మాత్రమేనని, అలాంటి సేవను, మార్కెట్ లో సరుకుల చూడడం అత్యంత దారుణమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు (ఎలెక్ట్ ) డాక్టర్ ఎం. సుబ్రహ్మణ్యం అన్నారు.

జాతీయ వినియోగదారుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ నగరం లోని పౌర గ్రంధాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ à°—à°¤

నెల్లో కేంద్రం ఆమోదించిన వినియోగ దారుల  à°°à°•à±à°·à°£ చట్టం నుంచి వైద్య రంగాన్ని తక్షణం  à°®à°¿à°¨à°¹à°¾à°¯à°¿à°‚చాలని డిమాండ్ చేశారు. వైద్యో నారాయణో హరి అనేది పురాతన కాలం నుంచి

వస్తోందని, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేది కేవలం వైద్యులు మాత్రమేనని, అలాంటి వారిని ఇబ్బందుల పాలు చేస్తే, ప్రజలకు సరైన వైద్యం అందే అవకాశం ఉండదన్నారు. ఒక్కో

వ్యక్తికీ ఒక్కో రకమైన వ్యాధి ఉన్న సమయాల్లో వైద్యులు ఒకే రకమైన వైద్యాన్ని, శాస్త్ర చికిత్సలు చెయ్యరని, అదే విధంగా, అన్ని రకాల సేవలతోనూ వైద్య రంగాన్ని కలిపి

ఒకే త్రాటి కట్టడం సరి కాదన్నారు. వైద్యులు విధుల్లో ఉన్న సమయాల్లో నిర్లక్ష్యంగా ఉండరని, పైగా రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తారన్నారు.

ఒక్కొక్క కేసులో తీవ్రతను బట్టి, వారికి శాస్త్ర చికిత్స చేసే వైద్యులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాంటి వారిపై భౌతిక దాడులు కూడా

చేస్తున్నారన్నారు. గత నెల రోజులుగా తాము ప్రధాన అంశాలపై ద్రుష్టి సారించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. వివిధ స్థాయిల్లో

ప్రజలకు ఇబ్బంది లేకుండా నిరసనలు కూడా తెలియచేశామని తెలిపారు. 
ప్రధానంగా చేస్తున్న డిమాండ్లలో  à°µà°¿à°¨à°¿à°¯à±‹à°— దారుల చట్టం ప్రకారం జరిమానా రూ. 10  à°²à°•à±à°·à°² నుంచి కోటి

రూపాయల వరకూ విధిస్తూ నిర్ణయించారన్నారు. ఒక వైద్యులు తన ఆసుపత్రి నిర్మాణానికి 25 లక్షల కూడా ఖర్చు చెయ్యరని, అలాంటి వారిపై కోటి రూపాయల వరకూ జరిమానాలు

విధించేస్తే ఇక పై ఎవరూ వైద్యం చేయలేరన్నారు. 
ప్రస్తుతం ఆమోదించిన చట్టం ప్రకారం విచారణ కమిటీ లో ఒక్క వైద్యునికి కూడా చోటు కల్పించలేదన్నారు. వైద్య రంగం

గురించి తెలియని వాళ్ళని విచారణ కమిటీల్లో నియమిస్తే, వారికి వైద్యం వికటించిన కేసులో వాస్తవాలు ఎలా తెలుస్తాయన్నారు. 
ఈ చట్టం ప్రకారం రోగి బంధువులే ఫిర్యాదు

చేయనవసరం లేదని, సంఘాలు, ఇతర సంస్థలు కూడా ఫిర్యాదు చేసే విధంగా రూపొందించారన్నారు. ఈ విధమైన లొసుగులతో సంఘ విద్రోహ శక్తులు వైద్యులను బ్లాక్ మెయిల్ చేసే

అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ మెడికల్ కమిషన్  à°¨à± తక్షణం రద్దు చెయ్యాలని, గతం లో ఉన్న ఇండియన్ మెడికల్

కౌన్సిల్ ను తిరిగి కొనసాగించాలన్నారు. ఈ కొత్త కమిషన్ ద్వారా, గ్రామాల్లో సూది పొడవగలిగిన వారికి చిన్న పాటి శిక్షణ ఇచ్చి, వైద్యులుగా కొనసాగింపుపై అనుమతి

ఇచ్చేసింది, అయితే ఐదేళ్లు వైద్య విద్యను భక్తి శ్రద్దలతో అభ్యసించిన వైద్యులకి, గ్రామాల్లో వైద్యులకు పెద్ద తేడా లేదన్నారు. ఇదే విధమైన విధానం కొనసాగితే

రానున్న కాలం లో పూర్తి స్థాయి వైద్య విద్యను అభ్యసించేవారు ఉండరన్నారు. వైద్య రంగం పై ప్రయోగాలు చేసి, ప్రజల ఆరోగ్యంగా తో ఆటలాడ వద్దని ప్రభుత్వాన్ని

హెచ్చరించారు. à°ˆ విలేకరుల సమావేశం లో ఐఎంఏ విశాఖ శాఖ అధ్యక్షులు డాక్టర్ ఏ. సుబ్రమణ్యేశ్వర రావు, విశాఖ శాఖ కార్యదర్శి డాక్టర్ మల్లాది శర్మ  à°•à±‡à°‚ద్ర కమిటీ సభ్యులు

 à°¡à°¾à°•à±à°Ÿà°°à± à°Žà°‚ వి విజయశేఖర్,  à°‰à°ªà°¾à°§à±à°¯à°•à±à°·à±à°²à± డాక్టర్ పిజె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #IMA  #public library  #press meet

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam