DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళ నే ఎదుర్కోలేని బాబు మోడీని ఎదుర్కొంటారా? సుహాసిని ఆనంద్ 

విశాఖపట్నం, జనవరి 5, 2019 (DNS Online): ఒక మహిళ కార్పొరేటర్ సంధించిన ప్రశ్నలకు సరైన జవాబు చెప్పలేక పోయిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ని ఎలా

ఎదుర్కొంటారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ ప్రశ్నించారు. శనివారం నగరం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం

లో ఆమె మాట్లాడుతూ కాకినాడ లో చంద్రబాబు పర్యటనలో బీజేపీ మహిళ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి కేంద్రం అందిస్తున్న నిధులతో రాష్ట్రంలో పధకాలను అమలు

చేస్తున్నచంద్రబాబు నాయుణ్ణి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం ఏమి చేసింది అని ప్రశ్నించడంతో జవాబు చెప్పలేక నన్నే ప్రశ్నిస్తే ఫినిష్ అవుతావంటూ,

ఆమెపై అక్రమంగా పోలీసు కేసులు పెట్టి రాత్రంతా స్టేషన్ లోనే కూర్చోబెట్టిన ఘనుడన్నారు. దీన్ని అడ్డుకునేందుకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై సైతం

కేసులు పెట్టి, ఈ రాష్ట్రం లో రాక్షస పాలన నడుస్తోందని నిరూపించారని మండిపడ్డారు. ప్రశ్నించడమే తప్పుగా భావించే చంద్రబాబు నాయుడు, తనని ఒక మహిళ ప్రశ్నించడం

భరించలేక ప్రశ్నించిన మహిళనే ఫినిష్ చేస్తా అనేవాళ్ళు పాలనేం చేస్తారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా ఉన్న వ్యక్తి ముందు మహిళలతో ఎలా మాట్లాడాలో

తెలియకపోతే ఇక పరిపాలన ఎలా ఉంటుందో ప్రజలకు బహిర్గతమవుతోందన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #viswanadha raju  #vizag  #bjp  #Suhasini anand  #madhav  #Chandrababu naidu  #telugudesam  #kakinada
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam