DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్యాంకింగ్ రంగాన్ని కాపాడకపొతే నష్టం దేశానికే : బ్యాంకు సంఘాలు 

విశాఖపట్నం, జనవరి 8, 2019 (DNS Online): భారత దేశ ఆర్ధిక వ్యవస్థ నిలబడాలంటే బ్యాంకింగ్ రంగాన్ని కాపాడవలసిన అవసరం ఉందని బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం విశాఖ జిల్లా

కార్యదర్శి ఏ. యుగంధర్ అన్నారు. మంగళవారం దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్, బీమా రంగం, పోస్టల్, బిఎసెనెల్ తదితర సంస్థల పరిరక్షణకు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్ర బ్యాంకు

సిబ్బంది  à°¬à°‚ద్ పాటించారు. విశాఖ నగరం లోని సీతమ్మధార ఆంధ్రా బ్యాంకు ప్రధాన ప్రాంతీయ కార్యాలయం వద్ద జరిగిన నగరం లోని ఆంధ్రా బాంకుల సిబ్బంది పెద్ద సంఖ్యలో

పాల్గొని ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కార్మికులు, ఉద్యోగులు అనేక ఉద్యమాలు చేసి సాధించిన చట్టాలను యజమాన్యములకు అనుగుణంగా మార్చి యూనియన్ ల

హక్కులను కాల రాసె విధంగా ప్రభుత్వం కుట్రను చేస్తోందన్నారు. కార్మికులు, అసంఘటిత కార్మికులు నెలకు రూ.18 వేలు పొందేటట్లు, ఈ ఎస్ ఐ, పీఎఫ్, అర్హత కల్గిన వారికి బోనస్

కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µ à°°à°‚à°— సంస్థల్లో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే పద్దతిని రద్దుపరిచి, అన్ని

క్యాడర్లలోనూ నియామకాలు చేపట్టాలని. ఏప్రిల్ 1 ,2010 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు కొత్త పెన్షన్ విధానం అమలు కాకుండా, పాత పెన్షన్ విధానాన్ని వీరికి  à°•à±‚à°¡à°¾ అమలు

చెయ్యాలని డిమాండ్ చేశారు, బ్యాంకుల ప్రయివేటీకరణ, బ్యాంకుల విలీనాలు వ్యతిరేకించారు. అదే విధంగా మొండి బకాయిదారులై à°•à° à°¿à°¨ చర్యలు చేపట్టాలని కోరారు. 
    à°ˆ

కార్యక్రమం లో అధ్యక్షులు ఆర్ వి రవికుమార్, బ్యాంకు యూనియన్ ప్రతినిధులు ఫై. మంగపతి, పి. రాఘవేంద్ర రావు, ఆర్. వసంతరావు, వి రమేష్, పట్నాయక్, ఉష కుమారి, ఈశ్వర రావు, పెద్ద

సంఖ్యలు ఉద్యోగులు పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dnslive  #dns news  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #bank stirke  #national bandh  #bjp  #modi

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam