DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పీహెచ్ డీలు ఇచ్చే విధానం ఇదేనా? అంగడిలో . .ఇచ్చినట్టె ఇస్తారా?

పీహెచ్ డీ పట్టా ఇచ్చేది ఫోటో కోసమేనా ? ఇది ఉత్తుత్తి పట్టాయేనా

ఇది విద్యా విద్యానానికి మచ్చలాంటిదే 

విశాఖపట్నం, జనవరి 9, 2019 (DNS Online): ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (

ఎయు) నిర్వహించిన స్నాతకోత్సవం లో విద్యార్థులను అగౌరవ పరిచే విధంగా కార్యక్రమం జరగడం విద్యా విధానానికే అవమానం జరిగినట్టు అనిపించింది అని విద్యా వేత్తలు

అభిప్రాయపడుతున్నారు. బుధవారం ఎయు నిర్వహించిన 85 , 86 à°µ స్నాతకోత్సవ సభలో పరిశోధకులకు పిహెచ్ à°¡à±€ పట్టాలు అందించిన విధానం  à°•à±‡à°µà°²à°‚ à°’à°• ఫోటో తీసుకోడానికి మాత్రమే

అన్నట్టు గా దర్శనమిచ్చింది. ఛాన్సలర్ హోదా లో రాష్ట్ర గవర్నర్ హాజరైన సభలో ఈ విధంగా జరగడం విద్యా విధానానికి అవమానం గానీ కనిపించింది. పైగా ఇదే సభలో సాక్షాతూ

గవర్నర్ తన కీలక ప్రసంగం లో మాట్లాడుతూ విద్యా విధానాన్ని కించపరచవద్దు అని హెచ్చరించినా ఏయూ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. 

పరిశోధన పత్రం అదే పీ

హెచ్ డీ పట్టా అనేది అంత సునాయాసంగా వచ్చేది కాదు. ఒక విద్యార్థి జీవితకాలం వెచ్చించి, డిగ్రీ, తదుపరి పీజీ చేసి, అనంతరం కనీసం ఐదేళ్ల కాలం పూర్తి గా వెచ్చించి

పూర్తి చేసేది ఈ పరిశోధన. ఈ పట్టా ద్వారా ఆ విద్యార్థి జీవితం సార్ధకం అవుతుంది. తద్వారా ఎయు విలువ మరింత ఇనుమడింపచేస్తుంది. అలాంటి పట్టాను ఎదో అంగడి లో సరుకులు

విక్రయించినట్టు గా విద్యార్ధులందరినీ ఒక క్యూలో నిల్చోబెట్టి, ఒక కెమెరా ముందు ఫోటో కోసం ఏదో ఒక కాయితం ఇచ్చి నట్టుగానే కనిపించింది, తప్ప, ఒక విద్యార్థి

జీవితానికి సార్ధకత చేకూరుస్తున్నట్టు ఎక్కడ కనపడలేదన్నది వాస్తవం, ఇదే విషయాన్ని విద్యావేత్తలు సైతం వ్యక్తం చేస్తున్నారు. 

భారీ క్యూ ల్లో జనాన్ని

నిల్చోబెట్టి, స్టేజి పైకి పిలిచి, ఒక ఫోటో కెమెరా ముందు నిల్చోబెట్టి, ఫోటో అయిపోగానే నెట్టేసే విధానం అత్యంత దారుణంగానే అనిపించింది. ఇంతకీ వీళ్ళు ఐదారేళ్ళ

పరిశోధన చేసింది à°’à°• ఫోటో కోసమేనా అంటే, అవుననే అంటున్నారు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉన్నతాధికారులు. 

రాష్ట్ర గవర్నర్ కేవలం పది లేక 20 మందికే పట్టాలు ఇస్తారు.

మిగిలిన వాళ్లకి వీసీ చేత్తోనే పట్టాలు అందిస్తున్నారు.ఎక్కువమంది అభ్యర్థులు ఉంటె. . . ఈ కార్యక్రమం రెండు రోజులు నిర్వహించి, అందరికీ సగౌరవంగా పట్టా అందిస్తే

అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ లో  à°¸à°°à±à°•à±à°²à± పంపిణీ చేసినట్టు జరగడం, విద్యావిధానాన్ని అవమానం à°—à°¾ అనిపించింది. ఎంతో దూరం నుంచి వచ్చిన విద్యార్థులకు,

కనీసం తాము పట్టా అందుకున్నామన్న ఆనందాన్ని కూడా అనుభవించకుండా చేసేసారు ఎయు అధికారులు. 

 

#Andhra University  #AU  #Vizag  #visakhapatnam #convocation

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam