DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీఈ ఓ ను కాదు ప్రజా  సేవకుడిని : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

ఆశించిన అభివృద్ధి సాధించేవరకూ పోరాడుతూనే ఉంటా  

ముఖ్యమంత్రి చంద్రబాబు 

విశాఖపట్నం, జనవరి 10, 2019 (DNS Online): తానూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సిఈఓ ను కాదని,

ప్రధాన సేవకుడినేనని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జన్మభూమి 9వరోజు పై  à°—ురువారం జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన పలు జిల్లాల కలెక్టర్లు,

అధికారులతో మాట్లాడుతూ నన్ను గతంలో కొందరు సీఈవో అని ప్రచారం చేశారని, అయితే ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రిని మాత్రమేనని, ఇదే విషయం గతంలో చెప్పాను, ఇప్పుడూ అదే

చెబుతున్నానన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు మన సామర్ధ్యాన్ని నమ్మి ఓటు వేసి అధికారాన్ని అప్పగించారని, వాళ్ళ ఆశలు నెరవేర్చే వరకూ పోరాడుతూనే ఉంటానన్నారు. వైజాగ్-

చెన్నై పారిశ్రామిక కారిడార్ లో 4  à°ªà°¾à°°à°¿à°¶à±à°°à°¾à°®à°¿à°• నోడ్లు వస్తాయని, మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పెట్టుబడులు రావాలి. పారిశ్రామికంగా ప్రతి జిల్లా ముందుండాలని

సూచించారు.   2015  à°¨à±à°‚à°šà°¿ జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్ వృద్ది పెంచుకున్నాం. సేవల రంగంలో కూడా జాతీయ సగటు కంటే ముందున్నామని,  à°¸à±à°²à°­ తర వాణిజ్యంలో మన రాష్ట్రమే

రెండేళ్లుగా అగ్రగామిగా ఉందన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలపై నాకు అచంచల విశ్వాసం ఉందని, రాజకీయాల్లోకి నేను వచ్చినప్పటికీ భువనేశ్వరి ఎంటర్ ప్రెన్యూర్ గా

రాణించిన విధానమే తార్కాణమని తెలిపారు. అవసరమైన  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¾à°¹à°‚ అందిస్తే మహిళలు సాధించలేనిది లేదు అని ఎందరో మహిళామణులు నిరూపించారన్నారు. మహిళా ఎంటర్

ప్రెన్యూర్ల ప్రోత్సాహం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని వివరించారు. 

పారిశ్రామిక రంగంలో మహిళలే విజేతలు :

ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే

ఎక్కువగా మహిళలు కనబడరని, చట్టసభల్లో మహిళలు తక్కువ అయ్యారని, అయితే పారిశ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉందని, పారిశ్రామిక సదస్సులు, పెట్టుబడుల

సదస్సులో హాజరవుంటున్న మహిళా ఎంటర్ ప్రెన్యూర్లే అందుకు నిదర్శనంమని అభినందించారు. నీతి నిజాయితీలతో వ్యాపారం చేస్తే ముందుంటారని, తప్పులు చేస్తే

నష్టపోతారని, అయితే నిర్ణయాధికారం మహిళలు చేపడుతున్నారు కనుకనే వారు విజేతలుగా నిలిచారని తెలిపారు. వ్యవస్థలో లోపాలను మనం సరిదిద్దగలం. కానీ వ్యక్తులలో

లోపాలను వాళ్లే చక్కదిద్దుకోవాలని,  à°’కప్పుడు వ్యాపారంలో కొన్ని కుటుంబాలదే గుత్తాధిపత్యం ఉండేది. à°ˆ రోజు à°† కుటుంబాల ఆధిపత్యం సన్నగిల్లిందన్నారు. వారసత్వ

ప్రతిభతో పారిశ్రామికంగా రాణించలేం. ఎవరికైతే ప్రతిభ ఉంటుందో వారే రాణిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.  

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #amaravati  #chandra babu naidu  #andhra pradesh  #government  #conference

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam