DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్యోతి దర్శనానికి శబరీ మల సిద్ధం, కిక్కిరిసి పోయిన శబరిగిరి  

అయ్యప్ప దర్శనానికి మురళి మోహన్ ఎదురుచూపు 

మహిళల సేవలోనే తరిస్తున్న పోలీసులు 

శబరీ మల, జనవరి 13, 2019 (DNS Online): ఏడాదికి ఒకమారు భోగి రోజు మాత్రమే లభించే జ్యోతి

దర్శనం కోసం శబరీ గిరులు లక్షలాది అయ్యప్ప భక్తులతో కిక్కిరిసి పోయింది. పంబ నుంచి శబరీగిరీశుని ఆలయం వరకూ అన్ని ప్రాంతాలూ జన సందోహంతో అయ్యప్ప నామస్మరణతో

మారు మ్రోగిపోతున్నాయి. భోగి రోజున ( సోమవారం ) లభించే అయ్యప్ప జ్యోతి దర్శనం కోసం రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యుడు మురళి మోహన్ కూడా శబరీ గిరి కి చేరుకున్నారు. అయితే

ఇటీవల సుప్రీం కోర్టు అన్ని వయసుల మహిళలు వారూ అయ్యప్ప ను దర్శించవచ్చు అని తీర్పు ఇచ్చేయడంతో  à°…సలు హిందూ ధర్మం పై నమ్మకం లేని వాళ్ళు కమ్యూనిస్టులు, క్రైస్తవ

మహిళలూ  à°…య్యప్ప భక్తులను తప్పుదారి పట్టించేందుకు అయ్యప్ప కొండకి వచ్చేందుకు ప్రయత్నించడం తో అయ్యప్పలు అభ్యంతరాలు చెప్పిన నేపధ్యంలో పోలీసులు భారీ

బందోబస్త్ కల్పించి మరీ వాళ్ళని అయ్యప్ప గుడిలోకి అందరికంటే ముందే తీసుకువెళ్తున్నట్టు తెలుస్తోంది. ఎరుమేలి నుంచి, పంబ వరకూ సాగే వనయాత్రలో శుక్రవారం రాత్రి

అయ్యప్ప స్వాములపై దూసుకు రావడంతో ఆరుగురు భక్తులు ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే, వీటిని అదుపు చేసేందుకు కేరళ ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చెయ్యక పోవడం

గమనార్హం. పైగా à°ˆ ప్రభుత్వం తరపున పోలీసులు కేవలం నడియస్కులైన మహిళలకు మాత్రమే భద్రతా కల్పించే ప్రయత్నంలోనే నిమగ్నమవడంతో భక్తులు మండిపడుతున్నారు. 

 

#dns  #dns

live  #dns media  #dns news  #dnsmedia  #dnslive  #dnsnews  #vizag  #visakhapatnam  #shabari mala  #ayyappa #jyothi darshanam  #mandalam

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam