DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శబరి గిరీశుని సన్నిధిలో రాజమండ్రి ఎంపీ మురళి మోహన్ గురుస్వామి,

బృంద సభ్యులతో జ్యోతి దర్శన యాత్ర 

శబరీ మల, జనవరి 14, 2019 (DNS Online): ఏడాదికి ఒకమారు భోగి రోజు మాత్రమే లభించే జ్యోతి దర్శనం కోసం రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యులు మాగంటి

మురళి మోహన్ గురుస్వామి, తన శిష్య బృందంతో శబరిమల అయ్యప్ప సన్నిధానం కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం లభించనున్న జ్యోతి దర్శనం కోసం ఆయన ఒక రోజు ముందుగానే

అయ్యప్ప సన్నిధానం కు చేరుకున్నారు. సోమవారం ఉదయం బృందంతో అయ్యప్ప కు పూజ నిర్వహించారు. పూజలో భాగంగా శరణు ఘోషతో సన్నిధానం పరిసర ప్రాంతాలు మారుమ్రోగిపోయాయి.

అనంతరం ఈ జ్యోతి దర్శననాన్ని పురస్కరించుకుని తమ సహచర అయ్యప్ప భక్త బృందం సభ్యులతో మాట్లాడుతూ శబరిమలకు చేరుకోవడం అనుకున్నంతనే సాధ్యం కాదని, అయ్యప్ప

అనుగ్రహం సంపూర్నంగా లభించిన వారు మాత్రమే శబరిగిరులు ఎటువంటి అవాంతరాలు కలుగకుండా చేరుకోగలరన్నారు. అందునా అత్యంత అరుదైన శబరిగిరీశుని జ్యోతి రూప సందర్శనం

పూర్వజన్మ సుకృతమేనన్నారు. ఈ విధంగా జ్యోతి దర్శనం కు వచ్చి, స్వామిని జ్యోతి రూపంలో దర్శించినవారికి జన్మ రాహిత్యమే అన్నారు. ఇంతమంది అయ్యప్ప స్వాములతో కలిగి

అయ్యప్ప కొండకు రావడం, స్వామిని దర్శించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. అయ్యప్ప మాల ధరించిన వారంతా అయ్యప్ప స్వాములేనని, వారిలో పెద్ద, చిన్న, ఎమ్మెల్యే. ఎంపీ లాంటి

 à°¹à±‹à°¦à°¾ తారతమ్యాలు ఉండవన్నారు. అందరూ కలిసే స్వామి దర్శనం చేయాలన్నారు. à°—à°¤ కొన్ని సంవత్సరాలుగా  à°¸à±à°µà°¾à°®à°¿ దర్శనం లభించడం తన అదృష్టం అన్నారు. స్వామిని ఎలా

దర్శించాలి, కొండపై చెయ్యవలసిన పనులు ఏంటో, చెయ్యకూడని పనులు ఏంటో బృంద సభ్యులకు వివరించారు. అనంతరం అయ్యప్ప సన్నిధానం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న

పలువురు ఆలయ అధికారులు, ఇతర సిబ్బందితో ఏర్పాట్లపై వివరాలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnsmedia  #dnslive  #dnsnews  #vizag  #visakhapatnam  #shabari mala  #ayyappa  #jyothi darshanam  #mandalam  #Rajamundry MP  #Murali Mohan

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam