DNS Media | Latest News, Breaking News And Update In Telugu

OC రిజర్వేషన్లను కూడా రాజకీయం చేస్తారా, సిగ్గు పడాలి: BJP ఎమ్మెల్యే విష్ణు 

కాపు వర్గ ఓట్లు కోసం కుళ్ళు రాజకీయాలా ?

అమరావతి, జనవరి 22 ,2019 (DNS Online): ఇంతవరకు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ పధకాన్ని తానే ఇచ్చినట్టు ప్రచారం

చేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీ అగ్రవర్గాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ల పై కూడా రాజకీయం చేస్తున్నారని బీజేపీ శాసన సభ పక్ష నేత పి. విష్ణు కుమార్ రాజు

మండిపడ్డారు. మంగళవారం డిఎన్ఎస్  à°¤à±‹ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కేంద్రం అమలు చేస్తున్న ప్రతి పధకాన్ని చంద్రబాబు నాయుడు తన ఖాతా లో

వేసుకుంటున్నారని, పార్లమెంట్ లో బీజేపీ చట్టం చేసిన అగ్ర వర్గ పేదలకు ఇచ్చిన 10 శాతం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లలో సగం (5 శాతం) కాపు సామాజిక వర్గానికి

ఇచ్చేస్తామంటూ ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయడాన్ని విష్ణు కుమార్ రాజు తప్పు పట్టారు. ఇలా చేసినందుకు సిగ్గు పడాలన్నారు. కేంద్రం పేదలకు

ఇచ్చిన బహుమానాన్ని, తన ఖాతాలో వేసుకోవడం ఎంతటి ఘనకార్యమో, నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబే చెప్పాలన్నారు. మొత్తం రిజర్వేషన్ లో సగం కాపు సామాజిక

వర్గానికి ఇచ్చేస్తే మిగిలిన పేదల సంగతేంటని ప్రశ్నించారు? వాళ్ళెవ్వరూ మనుషులుగా చంద్రబాబు కి కనపడలేదా అని ఎద్దేవా చేశారు. ఇది సాధ్యం కాదు అని చంద్రబాబు కి

కూడా తెలుసునని, అయితే ఎవరైనా కోర్టుకు వెళ్లి కేసు పెడితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసే చర్య అన్నారు. ప్రధాన రిజర్వేషన్ల పరిధిలోకి

రానివారికి కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన సంక్రాంతి బహుమతి అన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుదారిలోకి వెళ్లనివ్వమన్నారు. మోడీ ని

ఇరకాటం లో పెడదామనుకుని చంద్రబాబు తానే గోతిలో పడుతున్నారన్నారు. 

 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #viswanadha raju  #vishnu kumar raju  #bjp  #Narendra Modi  #OC reservations  #chandra babu naidu  #telugudesam party
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam