DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి విశాఖలో సంగీత తరంగాల సౌరభాలు 

విశాఖ వేదికగా 890 మంది కళాకారులూ, 298  à°•à°šà±‡à°°à±€à°²à±

కళాభారతి వేదిక గా వందలాది మంది తో సంగీత నీరాజనం

విశాఖపట్నం, జనవరి 25, 2019 (DNS Online): కర్ణాటక శాస్త్రీయ సంగీత కళానిధి

సద్గురు త్యాగరాజ స్వామికి విశాఖ నగరం వేదికగా ఉత్తరాంధ్రా సంగీత కళాకారులు సంగీత నీరాజనం అందించనున్నారు. ఈ నెల 25 నుంచి ఆరు రోజుల పాటు ( 29 వరకు) విశాఖ మ్యూజిక్

అండ్ డాన్స్ అకాడమీ సహకారం తో త్యాగరాజ ఆరాధనా ట్రస్ట్  à°†à°§à±à°µà°°à±à°¯à°µà°‚ లో విశాఖ నగరం లోని మద్దిలపాలెం లో à°—à°² కళాభారతి కళా ప్రాంగణం లో త్యాగరాజ ఆరాధనోత్సవాలు

అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.  
ఈ మేరకు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, కళాభారతి ప్రాంగణం లోని త్యాగరాజస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి,

తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. తదుపరి కళాభారతి లో వందలాది మంది కళాకారులతో పంచరత్న సేవ జరుగుతుంది. వందలాది మంది వర్ధమాన సంగీత కళాకారుల నుంచి, జాతీయ,

అంతర్జాతీయ స్థాయి ప్రసిద్ధ కళాకారులు ఇదే వేదికపై గాత్ర కచేరీలు, వీణ కచేరీలు, వయోలిన్ కచేరీలు చేయనున్నారని తెలిపారు. గురువారం రాత్రి ప్రారంభోత్సవ

కార్యక్రమానికి ప్రముఖ వైణికులు, మహతి కళానిధి, సునాద సుధానిధి, వీణా వైద్య విశారద, జాతీయ  à°¸à°‚గీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత అయ్యగారి శ్యామసుందర్ ముఖ్య అతిధిగా

హాజరయ్యారు. జనవరి 25 ఉదయం 7 :30 గంటల నుంచి త్యాగరాజ స్వామి సంకీర్తనలతో తిరువీధి ఉత్సవం జరుగనుంది. ప్రముఖ విద్వాంసులకు త్యాగరాజస్వామి గా అలంకారం చేసి, కళాభారతి

పరిసర వీధుల్లో త్యాగరాజస్వామి రచించిన సంకీర్తనలతో తిరువీధి నిర్వహించనున్నారు, ఈ ఉత్సవం లో ప్రముఖ కళాకారులూ, వర్ధమాన కళాకారులూ పాల్గొనున్నారు. తదుపరి ఉదయం 8 :

30 à°—à°‚à°Ÿà°² నుంచి కళాభారతి ప్రధాన వేదిక పై 200 మంది కళాకారులచే ఘన పంచరత్న కీర్తనల సేవ జరుగుతుంది. à°ˆ నెల 25 నుంచి 29 వరకు ప్రతి రోజు  à°‰à°¦à°¯à°‚ 7 : 30  à°—à°‚à°Ÿà°² నుంచి రాత్రి 9: 15 à°—à°‚à°Ÿà°² వరకు 10

నిముషాలు, 15  à°¨à°¿à°®à±à°·à°¾à°²à±, 30 నిమిషాల విడతలుగా మూడు విభాగాలుగా సంగీత కచేరీలు జరుగనున్నాయి. à°ˆ కచేరీల్లో కేవలం త్యాగరాజ స్వామి విరచిత కృతులు మాత్రమే పడవలసి యుంటుంది.

విద్యార్థి దశలో సాధన చేసేవారికి 10 నిముషాల సమయం, ఆలిండియా రేడియో "బి" గ్రేడ్  à°†à°°à±à°Ÿà°¿à°¸à±à°Ÿà±à°² కళాకారులకు 15 నిమిషాల సమయం, వున్నత స్థాయి విద్వాంసులకు 30 నిమిషాల సమయం

కేటాయించడం జరుగుతుంది. 

ఐవీఎల్ శాస్త్రికి సంగీత కళాభారతి పురస్కారం :

విశాఖ వేదికగా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు గత 27 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని,

ఉత్సవాలు మొదలు పెట్టిన నాలుగేళ్ల తర్వాత కళాభారతి వేదిక నిర్మాణం జరిగిందన్నారు. ఈ ఏడాది నుంచి సంగీతం, నృత్యం ద్వారా అత్యుత్తుమ సేవలు అందిస్తున్న ప్రముఖులకు

పురస్కారం అందిస్తున్నామన్నారు. à°ˆ ఏడాది తొలి సారిగా à°ˆ పురస్కారాన్ని ప్రముఖ. సంగేత విద్వాంసులు.  15 వేల మందికి పైగా. శిష్య ప్రశిష్యులను. తయారు చేసిన  à°¸à°‚గీత

విద్వాన్. ఐ వి ఎల్ శాస్త్రి. నీ సంగీత కళాభారతి. అవార్డు తో పురస్కరించుకున్నారు. 

సుమారు 967 మందికి పైగా కళాకారులూ దరఖాస్తు చేశారని, కేవలం 890 మందికి అవకాశం

కల్పించడం జరిగిందని నిర్వాహకులు తెలియచేస్తున్నారు. à°ˆ 6 రోజుల సంగీత సంబరాల్లో మొత్తం  298 కచేరీలు జరుగుతాయని తెలిపారు. à°µà±€à°°à°¿à°²à±‹. తెలుగు రాష్ట్రాలు నుంచే కాక.

తమిళనాడు. కర్ణాటక. ఒరిస్సా మహారాష్ట్ర తో పాటు  à°…మెరికా నుంచి కూడా కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. à°¨à°—à°° వాసులు  à°ªà±†à°¦à±à°¦ సంఖ్యలో పాల్గొని

త్యాగరాజస్వామికి ఘన నీరాజనం అందించాలని నగరవాసులను ఆహ్వానిస్తున్నారు. 

ఆరాధన ఉత్సవాల సంప్రదాయం: 

ప్రముఖ వాగ్గేయకారులు  à°¤à±à°¯à°¾à°—రాజు స్వామి

పరమపదించిన రోజైన పుష్య బహుళ పంచమి రోజున త్యాగరాజా ఆరాధన ఉత్సవాలు దక్షిణ భారత దేశ ప్రాంతాలన్నింటిలోనూ వైభవంగా కర్ణాటక సంగీత నీరాజనం అందించడం

జరుగుతుంది. 

అయన సమాధి ప్రాంగణం తమిళనాడు లోని, తంజావూరు జిల్లా, తిరువయ్యూరులో ఈ ఉత్సవం లో జరపడం మొదలైంది. దాన్ని సంప్రదాయంగా అన్ని ప్రాంతాల్లోనూ

నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  à°¸à°‚వత్సరానికి ఒక్కసారి జరిగే సంగీతోత్సవాలలో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి కెక్కిన కర్ణాటక సంగీత

విద్వాంసులు త్యాగయ్యకు తమ నివాళులు అర్పించడానికి విచ్చేస్తారు. ఈ ఉత్సవం త్యాగరాజు కావేరీ నది ఒడ్డున సమాధి సమీపంలో పుష్య బహుళ పంచమి నాడు జరుగుతుంది. సంగీత

విద్వాంసులంతా ఆయన సమాధి ప్రాంగణం లో ఆసీనులై ఆయన స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తారు. అయన పరమ పదించి 171 సంవత్సరాలు గడిచినప్పటికీ, 1903 నుంచి అయన

సమాధి వద్ద సంగీత ఉత్సవాలు క్రమం తప్పకుండా కొనసాగించడం జరుగుతోంది.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #kalabharati  #tyagaraja swami  #aradhanalu
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam