DNS Media | Latest News, Breaking News And Update In Telugu

30 న త్రివిక్రమ్ సౌజన్య భరతనాట్య ప్రదర్శన

విశాఖపట్నం, జనవరి 27, 2019 : ప్రముఖ తెలుగు సినీ రచయిత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సౌజన్య ఈ నెల 30 న నగరం లో భారత నాట్యప్రదర్శన చేయనున్నట్టు కళావేదిక. సంగం

ఫౌండేషన్ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. ఆదివారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నండూరి

రామకృష్ణ మాట్లాడుతూ ప్రముఖ నాట్యాచార్యులు పసుమర్తి రామలింగ శాస్త్రి శిక్షణలో భారతనాట్యంలో మంచి ప్రావీణ్యం సంపాదించి అయన ఆధ్వర్యవంలో శశిరేఖా పరిణయం

తెలుగు వైభవం లాంటి ఎన్నో  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¨à°²à± ఇచ్చారన్నారు. శాస్త్రీయ సంగీతం పై ఉన్న మక్కువతో ఆమె ప్రముఖ సంగీత శిక్షకులు ఉమా మహేశ్వరీ వద్ద à°—à°¤ మూడు సంవత్సరాలుగా

సంగీత సాధన కూడా చేస్తున్నారన్నారు. ఆమె విశాఖ జిల్లా అనకాపల్లి కి చెందిన వారు కావడం తో కళావేదిక ఆహ్వానాన్ని మన్నించి విశాఖపట్నం లో భారత నాట్య ప్రదర్శన

ఇచ్చెందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఈనెల 30 à°¨ 6 గంటలకు  à°µà°¿à°¶à°¾à°–పట్నం లోని మద్దిలపాలెం లోగల కళాభారతి కళావేదిక వద్ద à°ˆ ప్రదర్శన జరుగుతుందన్నారు.  à°ˆ కార్యక్రమం

లో ముఖ్య అతిధిగా పద్మశ్రీ అవార్డు ప్రకటిత రచయిత సిరివెన్నెల ( చేంబోలు) సీతారామ శాస్త్రి, ప్రత్యేక అతిధులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్, రంగస్థల, సినీ నటులు జయ

ప్రకాష్ రెడ్డి, నాట్యాచార్యులు ఏ.బి. బాలకొండల రావు, తదితరులు హాజరవుతారన్నారు. ఈ విలేకరుల సమావేశం లో సివిఆర్ శాస్త్రి, బి. గాయత్రీ చంద్రశేఖర్ తదితరులు

పాల్గొన్నారు. 

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #visakhapatnam  #vizag  #trivikram srinivas  #soujanya  #bharata natyam  #dance  #vjf press club

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam