DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యాన్ లో వస్తారు, టీ తాగిస్తారు, జనసేన సభ్యత్వం ఇస్తారు.

17 ప్రచార రధాలతో జనం లోకి జనసేన,  

మంగళగిరి, జనవరి 28 ,2019 (DNS Online ): జనసేన పార్టీ ఆశయాలు, జనసేన పార్టీ గుర్తు ( గాజు గ్లాసు), మేనిఫెస్టో తదితర ప్రధాన అంశాలు జనంలోకి మరింత

చేరుకునే విధంగా జనసేన బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రవాసీ భారతీయ ఆంధ్రులు రూపొందించి, అందించిన 17 అత్యాధునిక ప్రచార రథాలను జనసేన అధ్యక్షులు

పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గుంటూరు జిల్లా మంగళగిరి లో జండా ఊపి ప్రారంభించారు. ప్రతి ప్రచార రధం రోజుకు 10 గ్రామాల్లో

ప్రచారాన్ని చేపట్టనున్నాయి. ఈ 17 రథాలు రోజుకు 170 గ్రామాల్లో పర్యటించి, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో, పార్టీ గుర్తు ప్రచారం చేసి, గాజు గ్లాసులో టీ తాగించి,

ప్రజలకు పార్టీ సభ్యత్వం ఇస్తారు.  à°ªà±à°°à°¤à°¿ రధం లోనూ ఎల్ à°ˆ à°¡à±€ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు, వాటి  à°¦à±à°µà°¾à°°à°¾ ఓటర్లను ఆకట్టుకునే విధంగా పవన్ కళ్యాణ్ ప్రసంగాలను ప్రతి

గ్రామం లోని రెండు కూడళ్ల వద్ద ప్రసారం చేయనున్నారు. జనసేన పార్టీ జనం లోకి వెళ్లే విధంగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి, రానున్న ఎన్నికల్లో ఓటు వెయ్యమని కోరనున్నారు.

ప్రతి రధం వెంట సుశిక్షితులైన జన సైనికులు నడవనున్నారు. మొదటి విడతగా 17 ప్రచార రథాలను పార్టీకోసం అందించామని, అతి త్వరలో మరో 17 రథాలు సిద్ధం చేస్తున్నట్టు ప్రవాస

భారతీయ ఆంధ్రులు తెలిపారు. అనంతరం పవన్ కళ్యాణ్ సమీపంలోని భవన నిర్మాణ కార్మికులకు గాజు గ్లాసులో టీ పోసి పార్టీ గురించి తెలియచేసారు.

 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive 

#dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #janasena  #pawan kalyan  #vijayawada

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam