DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రాను ఆదుకోండి మహాప్రభో. . వెంకయ్య కు నేతల వేడుకోలు 

న్యూ ఢిల్లీ, జనవరి 29, 2019  (DNS Online ) :  à°µà°¿à°­à°œà°¨ హామీలు అమలులో ఘోరంగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నుంచి ఆంధ్రాను రక్షించి కోట్లాది మంది ఆంధ్రులను ఆదుకోండి

మహాప్రభో అంటూ ఉత్తరాంధ్రా చర్చ వేదిక నేతలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కోరారు. ఆదివారం విశాఖ నుంచి న్యూఢిల్లీ చేరుకున్న ఉత్తరాంధ్ర చర్చ వేదిక కన్వీనర్

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వం లో పలు రాజకీయ పార్టీల నేతలు మంగళవారం ఉదయం ఉపరాష్ట్రపతి కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ, సామాజిక,

ఆర్ధిక పరిస్థితులు వివరించి, రాజకీయ పరంగా జరుగుతున్న పోరాటం నుంచి ఆంధ్రా ను రక్షించవలసిందిగా కోరారు. విభజ సమయంలో రాజ్యసభలో ఆంధ్ర ప్రదేశ్ తరపున à°¨à°¾à°Ÿà°¿ రాజ్య

సభ సభ్యులుగా వెంకయ్య నాయుడు చేసిన పోరాటం ఫలితంగా బిల్లు లో కొన్నైనా చేర్చడం జరిగిందని, దానికి ముందుగా ఆయన్ని అభినందించారు. అయితే వాటిని ప్రస్తుతం అమలు

చెయ్యవలసిన భాద్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందన్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల వాసుల చిరకాల వాంఛ అయినా విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు దశాబ్దాలుగా

త్రిశంఖు స్వర్గం లోనే ఉందన్నారు. విద్యార్థి దశ నుంచి విశాఖ తో ప్రత్యేక అనుబంధం కారణంగా విశాఖ రైల్వే జోన్ వచ్చేలా సూచనలు చేసి, ఉత్తరాంధ్రా వాసులకు కనుక

అందించవలసిందిగా నేతలు ఉపరాష్ట్ర పతిని కోరారు. ఈ బృందంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంయుక్త

కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి, లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి పాల్గొన్నారు. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #lok satta  #konathala ramakrishna  #cpi  #venkaiah naidu  #vice president
 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam