DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర బంద్ కు జనసేన దూరం, హోదాకు, రైల్వే జోన్ కు వ్యతిరేకమా ?

విజయవాడ, జనవరి 31, 2019 (DNS Online ): అత్యవసరమైతే తప్ప బంద్ లో పాల్గొన కూడాదు అనేది జనసేన పార్టీ విధానమని జనసేన మీడియా విభాగం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ లక్ష్యంగా శుక్రవారం నాడు అఖిల పక్ష పార్టీలు పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ లో పాల్గొనకూడదు అని

నిర్ణయించినట్టు ప్రకటించింది. అంటే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అనేవి అత్యవసరం కాదని భావించిందా అనే అనుమానాలు కూడా

వ్యక్తమవుతున్నాయి. ఈ బంద్ లో అధికార, ప్రతిపక్ష, పార్టీలతో పాటు, కాంగ్రెస్, వామ పక్షాలు సైతం ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. రానున్న ఎన్నికల్లో జనసేన భారతీయ

జనతా పార్టీ తో జత కట్టే సూచనలున్నాయి అనే సంకేతాలు వస్తుండడంతో ప్రస్తుతం జరిగే బంద్ కేంద్రంలో అధికారం లో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కనుక జనసేన

దూరంగా ఉండడం కూడా ఆ అభిప్రాయాలను బలపరుస్తున్నాయి. అయితే ఇప్పడికే జనసేన వామ పక్షాలకు దగ్గరగా ఉండడం గమనార్హం. ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ పుట్టింది అని

అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. అయితే, ప్రస్తుతం కేంద్రాన్ని ప్రశ్నించడం కోసం జరుగుతున్న ఈ బంద్ లో పవన్ సేన పాల్గొనక పోవడం ప్రశ్నార్థకంగానే

ఉంది. 

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #janasena  #pavan kalyan #bandh  #all party

 

 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam