DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇది చారిత్రాత్మక బడ్జెట్: నగర బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర 

రైతులు, ఉద్యోగులకు బంపర్ బృహత్తర బహుమతి 

విశాఖపట్నం, ఫిబ్రవరి 01 ,2019 (DNS Online): భారత పార్లమెంటులో కేంద్ర ఇంచార్జి ఆర్ధిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన

మధ్యంతర కేంద్ర బడ్జెట్టు చారిత్రాత్మకమైన బడ్జెట్టుగా నగర బీజేపీ అధ్యక్షులు ఎం. నాగేంద్ర తెలిపారు. ఐదు ఎకరాల లోపు పొలం ఉన్న చిన్న మరియు సన్నకారు రైతులకు

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాలలోకి సంవత్సరానికి 6 వేల రూపాయలు బదిలీ చేయటం ఒక సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొంటూ అందులో

భాగంగా మొదటి విడతగా 2 వేల రూపాయలు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే లభించనుందని తెలియజేసారు. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని వార్షిక ఆదాయం 5

లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకొని మధ్య తరగతి మరియు ఉద్యోగుల హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని ప్రధానమంత్రి  à°¨à°°à±‡à°‚ద్ర మోడీ గారు పొందారని తెలియజేసారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీటితో పాటుగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు బడ్జెట్ లో పలు నిర్ణయాలు తీసుకున్నారని, అలాగే ఎన్నడూ లేని విధంగా

దేశ రక్షణ కొరకు బడ్జెట్టులో 3 లక్షల కోట్లు కేటాయించడం దేశ రక్షణపై బీజేపీ ప్రభుత్వ శ్రద్ధకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఇంతటి చారిత్రాత్మకమైన బడ్జెట్టు

ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారికి, ఆర్ధికమంత్రి(ఇంచార్జి)  à°ªà±€à°¯à±‚ష్ గోయెల్ గారికి విశాఖపట్నం ప్రజలు, బీజేపీ విశాఖపట్నం తరుపున

ధన్యవాదాలు తెలియజేసారు.

 

#dns  #dns live  #dns media  #dns news  #dnslive  #dnsmedia  #dnsnews  #vizag  #visakhapatnam  #bjp  #andhra pradesh  #union government  #budget  #lok sabha  #piyush goel  #goyal  #income  #taxes  #M Nagendra

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam